DNS Media | Latest News, Breaking News And Update In Telugu

రాజధాని లో రైతు కుటుంబాల మహా భారీ వాహాన ర్యాలీ 

వైసీపీ భూదందాల కోసమే రాజధానిగా విశాఖ: దేవినేని . . . 

(DNS రిపోర్ట్ : పి. రాజా, Spl కరస్పాండెంట్ అమరావతి)

అమరావతి, జనవరి  29, 2020 (డిఎన్‌ఎస్‌) : తుళ్లూరు మండలం లోని 29

గ్రామాల్లో ప్రజలు మూడు రాజధానులు వ్యతిరేకిస్తూ జై అమరావతి అనే నినాదాలతో రైతులు, కుటుంబాల సభ్యులు పెద్ద ఎత్తున వాహాన ర్యాలీ నిర్వహించారు. బుధవారం రాజధాని

రైతుల మహర్యాలీ కార్యక్రమాన్ని జెండా ఊపి తాడికొండ మాజీ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్ ప్రారంభించారు. ఈ ర్యాలీ లో 5సంవత్సరాల వయస్సు నుండి 90 సంవత్సరాల వయసున్న

రైతులు,మహిళలు పగొన్నారు. దీక్ష శిబిరం నుండి తుళ్లూరు ప్రధాన విధుల్లో భైక్ ర్యాలీ వల్ల రోడ్లు మొత్తం ఆకుపచ్చ వాతావరణం చోటు చేసుకుంది. 29 గ్రామాల్లోని ప్రజలు

రోడ్డు ఏక్కడం తో రోడ్డులన్ని కిక్కిరిసిపోయాయి. à°ˆ బైక్ ర్యాలీలో రూటు తుళ్లూరు నుండి  à°¬à°¯à°²à±à°¦à±‡à°°à°¿ రాయపూడి.ఉద్దండ్రాయునిపాలెం, మోదు లింగాయపాలెం వెలగపూడి

మల్కాపురం మందడం కృష్ణాయపాలెం ,పెనుమాక ఎర్రబాలెం ,నవులూరు ,నిడమర్రు ,కురగల్లు నీరుకొండ, పెదపరిమి ,నెక్కల్లు ,అనంతవరం వడ్డమాను, హరిచంద్ర పురం, బోరుపాలెం

దొండపాడు, గ్రామాల మీదుగా తుళ్లూరు చేరనున్న ర్యాలీ.

వైసీపీ భూదందాల కోసమే రాజధానిగా విశాఖ: దేవినేని:  . .

బుధవారం నందిగామలో 20 రోజులుగా అమరావతి కోసం

జరుగుతున్న నిరసన దీక్షా శిబిరాన్ని మాజీ శాసన సభ్యురాలు శ్రీమతి తంగిరాల సౌమ్య తో కలిసి శ్రీ దేవినేని ఉమామహేశ్వరరావు సందర్శించి వారికి తమ సంఘీభావం

తెలియజేశారు. అనంతరం నందిగామ పట్టణంలో జరిగిన బైక్ ర్యాలీ లో దేవినేని ఉమామహేశ్వరరావు, తంగిరాల సౌమ్య లు పాల్గొన్నారు. à°ˆ సందర్భంగా దేవినేని మాట్లాడుతూ జిఎన్

రావు కమిటీ నివేదిక లోని అంశాలను ప్రభుత్వం తొక్కిపెట్టి నివేదికను బయటపెట్టకుండా ప్రజలను మభ్యపెట్టి విశాఖకు రాజధాని తీసుకువెళ్లాలని ప్రయత్నించారని కానీ

హైకోర్టు నిర్ణయంతో నివేదికలోని అంశాలు వెలుగులోకి  à°µà°šà±à°šà°¾à°¯à°¨à°¿ ప్రతి ఒక్కరూ కమిటీలోని అంశాలను గ్రామాలలో వివరించాలని కోరారు.

హైదరాబాదులో జగన్మోహన్

రెడ్డి కి సంబంధించి 10వేల ఎకరాలు ఉన్నాయని వాటిని ఎలా మార్కెటింగ్ చేసుకోవాలి అని పక్క రాష్ట్ర ముఖ్యమంత్రితో ఆరు గంటల పాటు ఏకాంత చర్చలు చేశాడని దేవినేని

అన్నారు. à°µà°¿à°¶à°¾à°–లో à°—à°¤ ఎనిమిది నెలలుగా చేతులు మారిన 52 వేల ఎకరాలలో 32 వేల ఎకరాలు జగన్ వారి నేతలు కొనుగోలు చేశారని విశాఖపట్నానికి వచ్చిన కంపెనీలను భయపెట్టి

వెళ్లగొట్టి పారిశ్రామికవేత్తలను భయబ్రాంతులకు గురి చేసి భూదందాలు చేస్తున్నారని దేవినేని విమర్శించారు.

ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ శంఖుస్థాపన చేసిన

అమరావతి రాజధానిని శాసనమండలి చైర్మన్ షరీఫ్ సెలక్ట్ కమిటీకి పంపి నిలబెట్టారని దేవినేని కొనియాడారు. 13 జిల్లాల ప్రజలు రాజధానిగా అమరావతే కొనసాగాలని

కోరుతున్నారని రాజధానిగా అమరావతి కొనసాగుతుందని ప్రభుత్వం ప్రకటించే వరకు ఈ ఉద్యమం కొనసాగుతుందని దేవినేని అన్నారు.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam