DNS Media | Latest News, Breaking News And Update In Telugu

విశాఖ దిశగా బంగ్లాదేశ్ జలాల్లో బందీ అయిన మత్స్యకారులు 

విడుదల లో కృషి చేసిన కేంద్రానికి ఎంపీ ధన్యవాదాలు  

మత్స్యకారుల విడుదలలో విస్తృత కృషి చేస్తున్న మోడీ ప్రభుత్వం 

(DNS రిపోర్ట్ : సాయిరాం CVS , బ్యూరో ,

విశాఖపట్నం): . . . .

విశాఖపట్నం, జనవరి  29, 2020 (డిఎన్‌ఎస్‌) : చేపలవేట కోసం వెళ్లి పొరపాటున బంగ్లాదేశ్‌ సముద్ర జలాల్లో చిక్కుకుని బందీలుగా ఉండిపోయిన ఎనిమిది మంది

ఆంధ్ర ప్రదేశ్ కు చెందిన మత్స్యకారులు విడుదలయ్యారు. ఈ మేరకు కేంద్రం తో విస్తృత సంప్రదింపులు జరిపిన విశాఖపట్నం ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ కేంద్ర హోంశాఖ సహాయ

మంత్రి జి కిషెన్ రెడ్డికి మత్స్యకారుల సమస్యలను వివరించారు. వీరి విడుదల అనంతరం 
కేంద్రానికి ఎంపీ కృతజ్ఞతలు తెలియచేసారు. కేంద్రం చూపిన చొరవతో శ్రీకాకుళం,

విజయనగరం జిల్లాలకు చెందిన మత్స్యకారులను బంగ్లాదేశ్‌ లో విడుదల చేయబడ్డారు . సెప్టెంబర్‌ 27à°¨ బోటులో చేపలవేటకు వెళ్లిన వీరంతా పొరపాటున బంగ్లాదేశ్‌

భూభాగంలోకి ప్రవేశించారు. అక్టోబర్‌ 2à°¨ à°† దేశ కోస్ట్‌గార్డ్‌ సిబ్బంది వారిని అదుపులోకి తీసుకున్నారు. అక్రమంగా తమ దేశంలోకి చొరబడ్డారంటూ వారిపై కేసులు నమోదు

చేసి జైళ్లలో బంధించారు. దీంతో మత్స్యకారులను విడిపించేందుకు చర్యలు తీసుకోవాలని విశాఖ  à°Žà°‚పీ పలుమార్లు కేంద్రాన్ని కోరారు . à°ˆ క్రమంలో విదేశాంగ శాఖ

స్పందించింది. ఉపాధి కోసం వెళ్లిన మత్స్యకారులను విడిచిపెట్టాలని పలుమార్లు బంగ్లాదేశ్‌ ప్రభుత్వాన్ని కోరింది. à°ˆ నేపథ్యంలో వారిని విడుదల చేస్తున్నట్లు

బంగ్లాదేశ్‌ అధికారులు ప్రకటించారు. 
తమ వారు స్వదేశానికి బయలుదేరారన్న సమాచారంతో బంధువుల్లో ఆనందం వ్యక్తమవుతోంది. ఈ సందర్బంగా వారు విశాఖ ఎంపీ ఎంవీవీ

 à°¸à°¤à±à°¯à°¨à°¾à°°à°¾à°¯à°£ కు కృతఙ్ఞతలు తెలియజేసారు. ఇటీవలే శ్రీకాకుళం సహా ఇతర ప్రాంతాలకు చెందిన మత్స్యకారులు పాకిస్తాన్ నుంచి కేంద్రం చొరవతో విడుదలైన విషయం

తెలిసిందే. 

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam