DNS Media | Latest News, Breaking News And Update In Telugu

పిఠాపురం లో విగ్రహాల ధ్వంసం - జాతీయ క్రైమ్ తో సమానం   

హిందూ గుళ్ల కు ప్రభుత్వ కబంద హస్తాల నుంచి విముక్తి ఇవ్వాల్సిందే

హిందూ ద్రోహులపై ధర్మాగ్రహ దీక్ష లో స్వామీ పరిపూర్ణానంద ఆగ్రహం 

పరిపూర్ణానంద 6

కిలోమీటర్ల పాదయాత్ర  à°§à°°à±à°®à°¾à°—్రహం 

శతావధాని వద్ధిపర్తి పద్మాకర్, శతక కర్త జొన్నవిత్తుల సంఘీభావం   

చలో పిఠాపురం పాల్గొన్న కమలానంద భారతి,

శ్రీనివాసానంద సరస్వతి 

దేశ విదేశాల నుంచి మద్దతు ఇస్తున్న హిందూ సమాజం   

దేవాదాయ శాఖా తీరుకు మండిపడ్డ ధర్మ దీక్షా వేదిక 

నేడు గుడి బయట, రేపు

గుడిలో ఆపై. . మీ ఇంట్లో. కూలుస్తారు. . .:

సైకో à°•à°¿  à°Žà°®à±à°®à±†à°²à±à°¯à±‡, రాజకీయ నేతల విగ్రహాలు కనపడలేదా ? 

ప్రతి ఇంటిపైనా హిందూ ధ్వజం ఎగురవెయ్యాల్సిందే. . .

(DNS

రిపోర్ట్ : సాయిరాం CVS , బ్యూరో , విశాఖపట్నం) : . . . 

విశాఖపట్నం, జనవరి  30, 2020 (డిఎన్‌ఎస్‌): తూర్పు గోదావరి జిల్లా పిఠాపురం లో హిందూ ద్రోహులు కూల్చిన 23 దేవీ దేవతా విగ్రహాల

ఘటన జాతీయ క్రైమ్ అని శ్రీపీఠాధిపతులు స్వామి పరిపూర్ణానంద సరస్వతి ప్రకటించారు. గురువారం పిఠాపురం లో హిందూ ఐక్య వేదిక నిర్వహించిన ధర్మాగ్రహ దీక్షలో స్వామి

à°•à°¿ సంఘీభావంగా స్వామి కమలానంద భారతి, à°ªà±Šà°‚దూరు స్వామి శ్రీనివాసానంద సరస్వతి తదితర హిందూ ప్రవర్తకులు, శతావధానులు వద్ధిపర్తి పద్మాకర్, శతక కర్త, తెలుగు భాష యజ్ఞ

కర్త జొన్నవిత్తుల రామలింగేశ్వర రావు, తదితర ప్రముఖులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. 

ఈ సందర్భంగా పరిపూర్ణానంద సరస్వతి మాట్లాడుతూ ప్రభుత్వ కబంధ హస్తాల

నుంచి హిందూ దేవాలయాలు, హిందూ ఆలయాల భూములను తక్షణం విముక్తి కల్గించాలని డిమాండ్ చేసారు. హిందువులు ఆలయాల్లోని హుండీల్లో వేసే ముడుపులు జీతాలుగా తీసుకుంటూ

దేవదాయశాఖ మొత్తం బ్రష్టుపట్టిపోయిందన్నారు. హిందువుల ఆలయాల్లోని నిధులు దోచుకోడానికి ప్రభుత్వాలు ఉన్నాయి తప్ప, వాటిని పరిరక్షించడానికి

కాదన్నారు. 

పిఠాపురంలో కూడా దేవాదాయ శాఖా కార్యాలయాలు ఉన్నాయని, వాటికి ఈ ఆలయాల ధ్వంసం పట్టక పోగా కనీసం స్పందించిన దాఖలాలు లేవన్నారు. హిందూ సంస్థలు

చేస్తున్న నిరసనలకు కంటి తుడుపు చర్య అన్నట్టుగా విరిగిన విగ్రహాలకు మరమ్మతులు చేయడం అత్యంత నీచమైన పని అన్నారు. ఒకసారి విరిగిన విగ్రహానికి మరమత్తు చేయిస్తే ఆ

విగ్రహాలు ఆరాధనకు పనికి రావని, కనీసం ఆలయం లో కూడా ఉండకూడదని కనీసం విషయం తెలియని వాళ్ళు ఆంధ్ర ప్రదేశ్ దేవాదాయ శాఖా లో పనిచేస్తున్నారన్నారు. 

నేడు గుడి

బయట, రేపు గుడిలో ఆపై. . మీ ఇంట్లో. కూలుస్తారు. . .:

అంతకు ముందు పిఠాపురం పట్టణం లో వందలాది మంది భక్తులతో స్వామి పరిపూర్ణానంద 6 కిలోమీటర్ల పాదయాత్ర చేపట్టారు.

హిందూ ద్రోహులు కూల్చేసిన విగ్రహాలను అయన పరిశీలించారు. ఈ సందర్బంగా అయన హిందూ ధార్మిక ప్రజలను హెచ్చరించారు. ఈ రోజు ఆలయాల బయట ఉన్న విగ్రహాలను కూల్చారు, రేపు

ఆలయం లోపల విగ్రహాలను కూలుస్తారు, ఇంకా నోరు మూసుకుని, చేతులు కట్టుకుని కూర్చుంటే. . .  à°®à±€ ఇళ్లల్లోకి వచ్చి మరీ పూజ మందిరంలో విగ్రహాలు కూడా కూలుస్తారని

హెచ్చరించారు. 

హిందూ విగ్రహాలు కూల్చిన వ్యక్తి ఒక సైకో అంటూ పోలీసులు ఈ కేసును తప్పుదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారని స్వామి పరిపూర్ణానంద

మండిపడ్డారు. ఈ విగ్రహాలు కూల్చిన వ్యక్తి సైకో అయితే, రాత్రి పూట అతనికి కేవలం హిందూ దేవీ దేవతా విగ్రహాలు మాత్రమే కనపడ్డాయా? ప్రక్కనే ఉన్న . . . కనపడలేదా, ఆ

ప్రక్కనే ఉన్న రాజకీయా నేతల విగ్రహాలు కనపడలేదా? స్థానిక  బ్యానర్లు కనపడలేదా. . .  à°®à°°à°¿ ఇతను సైకో అయితే మరి వాటిని ఎందుకు కూల్చలేదని ప్రశ్నించారు. తమకు న్యాయం

జరిగే వరకూ తానూ పిఠాపురం లోనే నిరాహార దీక్ష చేస్తున్నట్టు వేదిక నుంచే ప్రకటించారు.  

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam