DNS Media | Latest News, Breaking News And Update In Telugu

14 ఏళ్ల సీఎం పదవి, 40 ఏళ్ల అనుభవమున్నా విలువలేవీ?

రాష్ట్ర అభివృద్ధికి అడ్డుపడితే చరిత్ర హీనులే

ప్రజల ఆకాంక్షల మేరకు ముందుకు .. . : మంత్రి కన్నబాబు 

పోస్టుకార్డుల ఉద్యమంలో మంత్రులు,

ప్రజాప్రతినిధులు

(DNS రిపోర్ట్ : మనోహర్ , స్టాఫ్ రిపోర్టర్, అనంతపూర్): . . .  

అనంతపూర్, జనవరి 30, 2020 (డిఎన్‌ఎస్‌) : à°ˆ రాష్ట్రంలో 14 ఏళ్ల సీఎం పదవి, 40 ఏళ్ల అనుభవమున్నా

చంద్రబాబు ప్రవర్తనలో విలువలు ఎక్కడా లేవని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు మండిపడ్డారు. వైసీపీ యువజన విభాగం అనంతపురం పార్లమెంట్‌ అధ్యక్షుడు

సాకే చంద్రశేఖర్‌ ఆధ్వర్యంలో అభివృద్ధి వికేంద్రీకరణ విషయంలో టీడీపీ తీరును నిరసిస్తూ.. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి మద్దతుగా రాష్ట్రపతికి

పోస్ట్‌కార్డులు పంపే కార్యక్రమాన్ని గురువారం నగర పాలక సంస్థ ఎదుట చేపట్టారు. మంత్రులు కురసాల కన్నబాబు, శంకర నారాయణ, ఎమ్మెల్యేలు అనంత వెంకట రామిరెడ్డి,

డాక్టర్‌ సిద్దారెడ్డి, తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డి, ఎమ్మెల్సీ గోపాల్‌రెడ్డి, పాఠశాల విద్య నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్‌ కార్యదర్శి ఆలూరి సాంబశివారెడ్డి,

ఏడీసీసీ బ్యాంక్‌ చైర్మన్‌ వీరాంజనేయులు, అనంత చంద్రారెడ్డి తదితరులు హాజరై అక్కడి నుంచి పోస్టు కార్డులు పంపారు. à°ˆ సందర్భంగా మంత్రి కన్నబాబు మాట్లాడుతూ à°—à°¤

ఎన్నికల్లో 151 స్థానాల్లో వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీని ప్రజలు గెలిపించి వైఎస్‌ జగన్‌ జగన్‌ నాయకత్వాన్ని కోరుకుంటున్నట్లు స్పష్టం చేశారన్నారు. ఆయనతోనే à°ˆ

రాష్ట్రానికి మేలు జరుగుతుందన్న విశ్వాసం వారిలో ఉందని, ప్రజల ఆకాంక్షల మేరకు ముందుకు సాగుతామన్నారు. జగన్‌ చేసే సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధిని

అడ్డుకోవడమే చంద్రబాబు అజెండాగా పెట్టుకున్నారన్నారు. తనను తిరస్కరించారన్న కనీస ఆలోచన కూడా బాబులో లేదన్నారు. అసలు జగన్‌ ఏం తప్పు చేస్తున్నారని

వికేంద్రీకరణను వ్యతిరేకిస్తున్నారని ప్రశ్నించారు. అధికార, అభివృద్ధి వికేంద్రీకరణతోనే రాష్ట్ర సమగ్రాభివృద్ధి జరుగుతుందన్నారు. వెనుకబడిన ప్రాంతాలు

అభివృద్ధి చెందాలని, వారి ఆత్మగౌరవాన్ని కాపాడాల్సిన అవసరం ఉందన్నారు. రాయలసీమలోని కర్నూలులో జ్యుడీషియల్‌ క్యాపిటల్, ఉత్తరాంధ్రలోని విశాఖలో

ఎగ్జిక్యూటివ్‌ క్యాపిటల్, అమరావతిలో లెజిస్లేటివ్‌ ఉండాలని నిర్ణయం తీసుకుంటే చంద్రబాబు వ్యతిరేకిస్తున్నారని, అసలు ప్రజలు ఏం అనుకుంటారోనన్న ఆలోచన కూడా

లేకుండా ప్రవర్తిస్తున్నారని అన్నారు. శాసన మండలిలోని గ్యాలరీలో కూర్చుని చైర్మన్‌ను ప్రభావితం చేస్తూ నీచంగా వ్యవహరించారని దుయ్యబట్టారు. ‘‘14 ఏళ్లు

ముఖ్యమంత్రిగా పనిచేశా.. 40 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నా అని చెప్పుకుంటే ఏం ప్రయోజనం..రాజకీయ విలువలు పాటించకపోతే ప్రజలు ఎలా గౌరవిస్తారు? సాంకేతిక కారణాలతో మా

నిర్ణయాన్ని తాత్కాలికంగా ఆపచ్చు. కానీ రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి సీఎం జగన్‌ చేపట్టే వికేంద్రీకరణను అడ్డుకోలేరు’’ అని స్పష్టం చేశారు. రాయలసీమ,

ఉత్తరాంధ్ర అభివృద్ధికి అడ్డుపడితే చరిత్రహీనులుగా మిగిలిపోతారన్నారు.  

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam