DNS Media | Latest News, Breaking News And Update In Telugu

డయల్ యువర్ కలెక్టర్ కు గ్రామీణుల నుంచి మంచి స్పందన 

(DNS రిపోర్ట్ : SV ఆచార్యులు, స్టాఫ్ రిపోర్టర్, శ్రీకాకుళం ). .

శ్రీకాకుళం, ఫిబ్రవరి 03, 2020 (డిఎన్‌ఎస్‌) :  à°¡à°¯à°²à± యువర్ కలెక్టర్ కార్యక్రమానికి 19 వినతులు వచ్చాయి. సోమవారం

కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో జిల్లా రెవిన్యూ అధికారి బలివాడ దయానిధి డయల్ యువర్ కలెక్టర్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వంగర మండలం

మగ్గూరు నుండి పి.పవన్ ఫోన్ చేసి మాట్లాడుతూ భర్తలు ఉన్న మహిళలు ఒంటరి మహిళ పింఛన్లు అందుకుంటున్నారని, నిజమైన ఒంటరి మహిళలకు పింఛను మంజూరుచేయలేదని ఫిర్యాదు

చేస్తూ, బాధ్యులపై తగు చర్యలు తీసుకోవాలని కోరారు. వీరఘట్టం మండలం తలగాం నుండి యు.ఎర్రప్పయ్య మాట్లాడుతూ తనకు ప్రతీ నెలా అందుతున్న వృద్ధాప్య పింఛను నిలుపుదల

చేసారని, కావున పింఛనును పునరుద్ధరించాలని కోరారు. కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నం మండలం కొడాపల్లి నుండి కె.దుర్గా  à°®à°¾à°Ÿà±à°²à°¾à°¡à±à°¤à±‚ తన రేషన్ కార్డు శ్రీకాకుళం

నగరప్రాంతానికి బదిలీచేయాలని దరఖాస్తు చేసి మూడేళ్లు అయినప్పటికీ ఇంతవరకు బదిలీకాబడలేదని ఫిర్యాదు చేసారు. ఎచ్చెర్ల మండలం తమ్మినాయుడుపేట నుండి బి.సత్యవతి

మాట్లాడుతూ తనకు ఇళ్లు కావాలని దరఖాస్తు చేసుకున్నప్పటికీ ఇంతవరకు మంజూరుచేయలేదని ఫిర్యాదు చేసారు. జి.సిగడాం మండలం టంకాల దుగ్గివలస నుండి కె.రామలక్ష్మీ

మాట్లాడుతూ తన ఆధార్ కార్డు ప్రక్క గ్రామానికి చెందిన భూములకు  à°¸à±€à°¡à°¿à°‚గ్ అయిందని, కావున దానిని తొలగించి తన భూములకు ఆధార్ సీడింగ్ చేయాలని కోరారు. కోటబొమ్మాళి

మండలం మాసాహేబ్ పేట నుండి బి.రవికుమార్ ఫోన్ చేస్తూ రైతు భరోసా కేంద్రం, గ్రామ సచివాలయాలను ప్రక్క గ్రామానికి మార్చాలని చూస్తున్నారని, కావున బాధ్యులపై తగు

చర్యలు తీసుకొని తమ గ్రామంలోనే వాటిని ఏర్పాటుచేయాలని కోరారు. టెక్కలి నుండి పి.చిట్టెమ్మ మాట్లాడుతూ సర్వే నెం.393లోని తన షాపు ప్లానింగ్ కొరకు దరఖాస్తు

చేసుకున్నప్పటికీ ఇంతవరకు మంజూరుచేయలేదని ఫిర్యాదు చేసారు. కోటబొమ్మాళి మాసాహెబ్ పేట నుండి బి.గణేశ్ మాట్లాడుతూ తమ గ్రామంలోని స్మశానవాటికకు రహదారి సదుపాయం

లేదని, దాన్ని కల్పించాలని కోరారు.  à°‡à°šà±à°šà°¾à°ªà±à°°à°‚ నుండి యల్.మంజుల మాట్లాడుతూ అనుమతిలేకుండా ప్రైవేటు బస్సులు తిరుగుతున్నాయని, బాధ్యులపై తగు చర్యలు తీసుకొని

వాటిని నిలుపుదల చేయాలని కోరారు. వంగర మండలం దేవకీవాడ నుండి వి.వెంకటరమణ మాట్లాడుతూ తమ వద్ద ఉన్న ధాన్యాన్ని ఎవరూ కొనుగోలు చేయడంలేదని ఫిర్యాదు చేసారు.

నరసన్నపేట నుండి డి.నారాయణరావు ఫోన్ చేస్తూ పింఛను మంజూరులో జాప్యం జరుగుతుందని, కావున దానిని పరిశీలించి సకాలంలో పింఛను అందేవిధంగా తగు చర్యలు తీసుకోవాలని

కోరారు. నరసన్నపేట మండలం కామేశ్వరీపేట నుండి యన్.చంద్రరావు మాట్లాడుతూ రైతు భరోసా డబ్బులు ఇంతవరకు తన ఖాతాలో పడలేదని, ఇప్పటికైనా తగు చర్యలు తీసుకోవాలని

కోరారు.ఈ కార్యక్రమంలో జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ పథక సంచాలకులు ఎ.కళ్యాణ చక్రవర్తి, జిల్లా నీటియాజమాన్య సంస్థ పథక సంచాలకులు హెచ్.కూర్మారావు, గృహ నిర్మాణ

సంస్థ పథక సంచాలకులు à°Ÿà°¿.వేణుగోపాల్,  à°œà°¿à°²à±à°²à°¾ పరిషత్ ముఖ్యకార్యనిర్వహణ అధికారి జి.చక్రధరరావు , జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి à°¡à°¾. యం.చెంచయ్య,  à°œà°¿à°²à±à°²à°¾ పంచాయతీ

అధికారి వి.రవికుమార్, సాంఘిక సంక్షేమ శాఖ ఉప సంచాలకులు కె.వి.ఆదిత్యలక్ష్మీ, బి.సి.కార్పొరేషన్ కార్యనిర్వాహక సంచాలకులు జి.రాజారావు, యస్.సి.కార్పొరేషన్

కార్యనిర్వాహక సంచాలకులు సిహెచ్.మహాలక్ష్మీ, జిల్లా సరఫరా అధికారి జి.నాగేశ్వరరావు, పౌర సరఫరాల సంస్థ జిల్లా మేనేజర్ ఎ.కృష్ణారావు, ఇతర జిల్లా అధికారులు తదితరులు

పాల్గొన్నారు. 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam