DNS Media | Latest News, Breaking News And Update In Telugu

విశాఖలో  గో ఆధారిత ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తుల ప్రదర్శన  

7 నుంచి మూడు రోజుల పాటు రైతులకు శిక్షణ,    

8 à°¨ మిద్దె తోట, సేంద్రియ వ్యవసాయం పై సదస్సులు 
 
9 న స్వతంత్ర శాస్త్రవేత్త డాక్టర్ ఖాదర్ వలి పై శిక్షణ శిబిరం

  

(DNS రిపోర్ట్ : సాయిరాం CVS , బ్యూరో , విశాఖపట్నం): . . . . 

విశాఖపట్నం, ఫిబ్రవరి 04, 2020 (డిఎన్‌ఎస్‌) : స్వచ్ఛమైన ఆహారాన్ని ప్రజలకు అందరికీ అందించాలని అనే సంకల్పం తో గో

ఆధారిత వ్యవసాయ పద్దతులను రైతులు, ప్రజలకు తెలియచేసే విధంగా మూడు రోజుల పాటు జాతీయ ప్రదర్శన నిర్వహిస్తున్నట్టు గో ఆధారిత  
ప్రకృతి వ్యవసాయదారుల సంఘం

ప్రతినిధి స్వామి తెలియచేసారు. మంగళవారం విశాఖపట్నం లోని ఏ ఎస్ రాజా క్రీడా మైదానం లో (శిబిరం వేదిక)  à°¨à°¿à°°à±à°µà°¹à°¿à°‚à°šà°¿à°¨ విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ మూడు రోజుల

పాటు జరుగుతున్న ఈ శిబిరంలో ప్రకృతి అందించిన పద్దతుల ద్వారా స్వయంసిద్ద పద్దతులతో వ్యవసాయం చేయడం ద్వారా ఉత్పత్తుల్లో ఎటువంటి విపరీత ఫలితాలు ఉండవన్నారు.

పూర్వకాలంలో ఇదే తరహాలో వ్యవసాయం చేసేవారని, అయితే నేడు అధిక ఉత్పత్తి, డబ్బుల కోసం రసాయన ఎరువులను వాడుతూ, కృత్రిమ పద్దతులతో వ్యవసాయం చేస్తున్నారన్నారు.

తద్వారా పంట పండించిన వాళ్ళు, ఆ ఉత్పత్తులు తిన్నవాళ్ళు కూడా ఆసుపత్రిపాలవుతున్నారన్నారు. ఈ విధమైన అవస్థలు ఉండకూడదని ఈ గో ఆధారిత వ్యవసాయం పై మూడు రోజుల సదస్సు

నిర్వహించి, రైతులకు, ప్రజలకూ కూడా ఈ సంప్రదాయ పద్దతులపై పూర్తి వివరణ ఇవ్వడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమం లో పెద్ద సంఖ్యలో ప్రజలు

పాల్గొనాలన్నారు. 

కార్యక్రమ నిర్వహణ కమిటీ చైర్మన్ సత్తి రామకృష్ణ రెడ్డి మాట్లాడుతూ యాంత్రిక జీవనాన్ని సాగిస్తున్న ప్రజలు యంత్రాలు మారిపోతూ,

కలుషితమైన ఆహారం తినడం ద్వారా అనారోగ్యాల పాలవుతురన్నారు. వీటిని అరికట్టేందుకు ఈ నెల 7 నుంచి 9 వరకూ మూడు రోజులపాటు విశాఖ నగరంలోని ఎంవిపి కోలనీ లో గల ఏఎస్ రాజా

క్రీడా మైదానం లో శిక్షణ శిబిరం జరుగుతుందన్నారు. ఈ నెల 7 న ఉదయం 10 గంటలకు రైతు సమ్మేళనం జరుగుతుందని, ఈ కార్యక్రమం లో గో ఆధారిత ప్రకృతి వ్యవసాయం చేసే రైతులు,

వ్యవసాయ శాఖా అధికారులు, వ్యవసాయ శాస్త్రవేత్తలు, రైతు శాస్త్రవేత్తలు, పెద్ద సంఖ్యలో రైతులు పాల్గొంటారన్నారు. రెండవ రోజైన 8 వ తేదీన మధ్యాహ్నం 2 గంటలకు

గృహవాసాల్లో నివసించే సాధారణ ప్రజల కోసం ప్రత్యేకంగా మిద్దె తోట పై అవగాహనా, శిక్షణ అందిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమం లో ప్రతి ఇంటిలోని, అపార్ట్మెంట్ ల లోని

మేడ పై చిన్న చిన్న కుండీల్లో మొక్కలు ఎలా పెంచాలి అంశం పై శిక్షణ, సూచనలు ఇవ్వడం జరుగుతుందని తెలిపారు.  à°®à±‚à°¡à°µ రోజు 9 à°µ తేదీ à°¨ ఉదయం 10 à°—à°‚à°Ÿà°² నుంచి ప్రముఖ స్వతంత్ర

శాస్త్రవేత్త డాక్టర్ ఖాదర్ వలి పాల్గొని రైతులకు, ప్రజలకు విశ్లేషణాపూర్వక సూచనలు అందించనున్నట్టు తెలిపారు. ఈయన ఆహారపదార్థాలపై ప్రభావం చూపుతున్న ఏజంట్,

ఆరెంజ్, డయాక్సిన్లు వంటి విషతుల్య రసాయనాలను నిర్వీర్యం చేయడంపై పరిశోధనలు చేయడం జరిగింది. అయన తో పాటు ఇతర ప్రముఖులు కూడా హాజరు కానున్నట్టు తెలిపారు. మూడు

రోజుల శిక్షణా శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరారు. ఇప్పడికే విశాఖ నగర పరిధిలో ప్రకృతి ఆధారిత వ్యవసాయం ద్వారా పండించిన ఉత్పత్తులు కొన్ని

విక్రయ కేంద్రాల్లో లభ్యం అవుతున్నాయన్నారు. ఈ విలేకరుల సమావేశంలో పర్యావరణ పరిరక్షణ కార్యకర్త రత్నం, శిక్షణ శిబిరం నిర్వాహకులు రాజు, సురేష్ తదితరులు

పాల్గొన్నారు.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam