DNS Media | Latest News, Breaking News And Update In Telugu

అమరావతి ప్రాంత రైతుల భాద్యత మాదే, సీఎం హామీ

ముఖ్యమంత్రి  à°µà±ˆà°Žà°¸à± జగన్‌తో రాజధాని రైతుల భేటీ 

(DNS రిపోర్ట్ : పి. రాజా, Spl కరస్పాండెంట్ అమరావతి): . . . .

అమరావతి, ఫిబ్రవరి 04, 2020 (డిఎన్‌ఎస్‌) : రాజధాని అమరావతి

ప్రాంతానికి చెందిన రైతుల సమస్యలు పరిష్కరించే బాధ్యత తనదని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ మోహన్ రెడ్డి హామీ ఇచ్చినట్టు అమరావతి ప్రాంత పలువురు రైతులు తెలియచేసారు.

మంగళవారం  à°®à°‚గళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి (ఆర్కే) ఆధ్వర్యంలో నిడమర్రు, ఉండవల్లి, పెనుమాక, తాడేపల్లి గ్రామాలకు చెందిన రైతులు సీఎంతో సమావేశమయ్యారు.

భేటీ ముగిసిన అనంతరం ఎమ్మెల్యే ఆర్కే మీడియాతో మాట్లాడారు. బలవంతపు భూసేకరణ నుంచి తమ గ్రామాలకు మినహాయింపు కల్పించాలని రైతులు సీఎం జగన్‌ను కోరారని.. దీనిపై

సీఎం సానుకూలంగా స్పందించారన్నారు. 10 రోజుల్లో భూసేకరణ ఆదేశాలు ఉపసంహరించాలని అధికారులను ఆయన ఆదేశించినట్లు ఆర్కే చెప్పారు. మంగళగిరి, తాడికొండ

నియోజకవర్గాల్లో బలవంతంగా భూసేకరణ చేశారని.. 5వేల ఎకరాల భూసేకరణ ఆదేశాలను వెనక్కి తీసుకోవాలని సీఎం ఆదేశించారని వివరించారు. మంగళగిరి-తాడేపల్లి నీటి పథకాలకు

రూ.8కోట్లు కేటాయించాలని జగన్‌ అధికారులకు ఆదేశాలు జారీ చేశారని ఆర్కే తెలిపారు. అనంతరం పలువురు రైతులు మాట్లాడుతూ భూసేకరణ నోటిఫికేషన్లు అన్నీ తొలగిస్తామని

సీఎం హామీ ఇచ్చారన్నారు. 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam