DNS Media | Latest News, Breaking News And Update In Telugu

రమణ దీక్షితులు బయటకు పంపడం లో కీలక పాత్ర డాలర్ దే న?

వెంకన్న పై డాలర్ శేషాద్రి మితి మీరిన పెత్తనం.  . .  à°ªà±†à°¦à±à°¦à°²à°•à±‚ చేదు అనుభవం..

తిరుమల, జూన్  25, 2018 (DNS Online ) : తిరుమల తిరుపతి దేవస్థానం లో జరుగుతున్న పరిస్థితుల నేపధ్యం లో

ప్రధాన అర్చకుల మార్పులు, పాలక మండలి ఆధిపత్యం పరిణామాల్లో డాలర్ శేషాద్రి ఆరాధిపత్యాన్ని పెంచుకుంటూ పోతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇటీవల జరిగిన

పరిణామాల్లో అత్యంత కీలకమైన ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు ఆలయం నుంచి బయటకు పంపడంలో  à°¡à°¾à°²à°°à± శేషాద్రి కీలక పాత్ర పోషించినట్టు à°—à°¾ అభియోగాలూ

వినిపిస్తున్నాయి. గత దశాబ్దాల క్రితం సాధారణ ఉద్యోగి గా తిరుమల ఆలయం చేరిన డాలర్ శేషాద్రి, ఆనతి కాలం లోనే పాతుకుపోయి నేడు ఉన్నతాధికారులనే శాసించే స్ట్యాయికి

చేరిపోయినట్టు ఆలయ ఉన్నతాధికారులే చెప్పగలుగుతున్నారంటే అయన ఆధిపత్యం ఏ స్థాయిలో ఉందొ తెలుస్తుంది.  2006 లోనే పదవి విరమణ చేసినా డాలర్ కు జాతీయ స్థాయిలో ఉన్న

పలుకుబడి కారణం గానే ప్రత్యేక అధికారి హోదాలో మరో మారు ఆలయంలోనే తిష్ట వేయగలిగారు. అనంతరం నాలుగు మార్లు పదవి కాలం పొడిగింపు తో పాటు, పాలక మండలి పై పూర్తి పట్టు

సాధించగలిగారు. ప్రస్తుతం ఆలయం లో ఏ నిర్ణయం తీసుకోవాలన్నా డాలర్ పాత్ర కీలకంగా మారింది అనడం అతి శయోక్తి కాదు. 

దర్శనాల్లో బ్రేక్  : ....

అధికార

తెలుగుదేశం పార్టీ తిరుపతి నగర అధ్యక్షులు దంపూరు భాస్కర్‌ యాదవ్‌ రెండు రోజుల క్రితం విఐపి విరామ సమయంలో శ్రీవారి దర్శనానికి వెళ్లారు. ఎల్‌-1 టికెట్టుపొంది

కుటుంబ సమేతంగా శ్రీవారి దర్శించుకునెందుకు ఆలయంలోకి ప్రవేశించిన దంపూరుకు చేదు అనుభవం ఎదురయింది.  à°•à±à°¯à±‚లో ముందుగా వెళుతున్న దంపూరు భాస్కర్‌ యాదవ్‌ ని

డాలర్‌ శేషాద్రి చెయ్యి గట్టిగా పట్టుకుని ఆపేసి….మరోచేత్తో వెనుక ఉన్న ముగ్గురు మహిళలను ( ఆయనకు కావాల్సినవారు ) ముందుకు లాక్కుని, నిలబెట్టి దర్శనం చేయించారు.

స్వామివారి సన్నిధిలో ఏమీ మాట్లాడలేక మౌనంగా వచ్చేశారు భాస్కర్‌ యాదవ్‌. అధికార పార్టీ నగర అధ్యక్షులంటే ఎంఎల్‌ఏతో సమానం. అటువంటి వ్యక్తితోనే డాలర్‌ శేషాద్రి

అమర్యాదగా వ్యవహరించడం ఆశ్చర్యం కలిగిస్తుంది. స్థానికుడైన అధికార పార్టీకి చెందిన తనతోనే ఇలా వ్యవహరిస్తే…ఇక బయటివారితో ఎలా ప్రవర్తిస్తారోనని దంపూరు

ఆవేదన చెందుతున్నారు. శ్రీవారి ఎదుట ఆయన పెత్తనం ఏమిటని దంపూరు ప్రశ్నిస్తున్నారు. తాను ఈ ఉదంతంపై టిటిడి ఉన్నతాధికారులకు, ముఖ్యమంత్రికి ఫిర్యాదు చేస్తానని

భాస్కర్‌ చెబుతున్నారు. అయినా…శేషాద్రికి అంతటి పెత్తనం ఎవరిచ్చారు? విఐపి బ్రేక్‌ దర్శనాల సమయంలో, ఆలయంలో ఆయనకు ఏంపని? ఇటువంటి ప్రశ్నలన్నీ ఇప్పుడు

ముందుకొస్తున్నాయి.

అన్నీ వివాదమే : 

డాలర్‌ శేషాద్రి తీరు మొదటి నుంచి వివాదాస్పదంగానే ఉంటోంది. డాలర్ల కుంభకోణంలో శేషాద్రిని నిందితునిగా చేర్చడం,

ఆ తరువాత కోర్టు తీర్పుతో బయటపడటం తెలిసిన విషయాలే. నైతిక ప్రవర్తన విషయంలోనూ ఆయనపై ఆరోపణలు ఉన్న సంగతి తెలిసిందే.
ఎక్స్‌టెన్సన్‌పై కొనసాగుతున్న శేషాద్రి తన

పరిధులు, పరిమితులు మరచిపోయి వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు తరచూ వినిపిస్తున్నాయి. ఉదయం విఐపి బ్రేక్‌ దర్శనాల సమయంలో, అదీ ఎల్‌1, ఎల్‌2 దర్శనాలు పూర్తయ్యేదాక ఉండి,

తమకు కావాల్సిన వారికి దగ్గరుండి దర్శనం చేయించి వెళతారట. విఐపిల్లోనూ తమకు కావాల్సిన విఐపిలకు ప్రత్యేక మర్యాదలు చేస్తారన్నమాట. ఇందుకు సాక్ష్యం దంపూరు

భాస్కర్‌ యాదవే.  

శ్రీవారి సన్నిధిలోనే తుదిశ్వాస విడిచేయాలన్నది తన కోరికని శేషాద్రి చెబుతుంటారు…టిటిడిలో పనిచేసే వేలాది మంది ఉద్యోగులకూ అటువంటి

కోరిక ఉంటుంది. మరి అందరికీ అవకాశం ఇస్తారా? 65 ఏళ్లు నిండాయని రమణ దీక్షితులను తొలగించారు. ఇందులో తప్పులేదు. మరి శేషాద్రిని ఎందుకు కొనసాగిస్తున్నారు? ఇలాంటి

ప్రశ్నలూ వస్తున్నాయి. వీటికి టిటిడి అధికారులు ఏమని సమాధానం చెబుతారు? శేషాద్రి కొనసాగింపును ఎలా సమర్థించుకుంటారు

 

For more details Click Here. All Copy Rights Reserved with DNS Media.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam