DNS Media | Latest News, Breaking News And Update In Telugu

సదా సింహాద్రి నాధుని సేవలో తరిస్తాం: గంట్ల శ్రీనుబాబు 

సింహాద్రి నాధునికి స్వర్ణ తులసి దళార్చన ఆరంభం 

మాఘ శుద్ధ (భీష్మ) ఏకాదశి వైభవం తో à°ˆ సేవలు ఆరంభం 

(DNS రిపోర్ట్ : సాయిరాం CVS , బ్యూరో , విశాఖపట్నం) : . . .

.

విశాఖపట్నం, ఫిబ్రవరి 05, 2020 (డిఎన్‌ఎస్‌) : మాఘ శుద్ధ ఏకాదశి ( భీష్మ ఏకాదశి ) పర్వ దినోత్సవాన్ని పురస్కరించుకొని సింహాచలం క్షేత్రం లో వెలసిన శ్రీ వరాహాలక్ష్మీ

నృసింహ స్వామి కి స్వర్ణ తులసి అర్చనలు ఆరంభించారు. బుధవారం ఉదయం ఆలయ అనువంశిక ధర్మ కర్తలు పూసపాటి అశోక్ గజపతి రాజు దంపతులు పాల్గొని, అత్యంత వైభవంగా తొలిపూజ

నిర్వహించారు. వీరితో పాటు అనుసరిస్తూ వారు కుటుంబ సభ్యులు, తదితరులు బేడా మండపం చుట్టూ ప్రదక్షిణు నిర్వహించారు. స్వర్ణ బంగారు తులసీ దళాలతో పాటు వివిధ రకాల

పూజాది ద్రవ్యాలను స్వామి గర్భాలయం లోకి తీసుకువెళ్లారు. 

సుమారు 60 మంది దాతలు 138 బంగారు తులసీదళాలను స్మామికి విరాళంగా అందజేశారు.  à°µà±€à°Ÿà°¿  à°µà°¿à°²à±à°µ సుమారు కోటి

రూపాయలు ఉంటుంది. ఈ కార్యక్రమం లో వేద మంత్రోశ్చరణలు, మృదుమధుర మంగళవాయిద్యాల నడుమ స్వామి సన్నిధిలో బంగారు తులసీదళాలతో అత్యంత వైభవంగా సహస్ర నామార్చన

నిర్వహించారు. 

à°ˆ కార్యక్రమంలో పాల్గొన్న దాతలకు ఆలయంలో అర్చనలు అనంతరం దాతలందరికి వేద సంప్రదాయం ప్రకారం ఆశీర్వచనం చేసారు. 

ఈ కార్యక్రమంలో

అత్యధిక బంగారు తులసీదళాలు సమర్పించిన బోకం శ్రీనివాస్‌, జాతీయ పాత్రికేయ సంఘం కార్యదర్శి, వైజాగ్ జర్నలిస్ట్ ఫోరమ్ అధ్యక్షులు గంట్ల శ్రీనుబాబు సేవలో

పాల్గొన్నారు.  

ఈ సందర్భంగా గంట్ల శ్రీనుబాబు మాట్లాడుతూ స్వామి సన్నిధిలో ఇంతవరకూ తమ కుటుంబం తరపున స్వామి నిత్యన్నదాన పథకానికి రూ. 3 లక్షలు, బంగారు

సంపెంగులు, ఇప్పుడు బంగారు తులసీ దళాలకు దేవస్థానానికి అందజేయడం జరిగిందన్నారు. భవిష్యత్తులో దేవస్థానం చెపట్టబోయే మరికొన్నిఅభివృద్ధి పనులకు తాను సహకారం

అందించడంతో పాటు మరికొంత మంది దాతలను కూడా సమాయత్తం చేస్తామన్నారు. 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam