DNS Media | Latest News, Breaking News And Update In Telugu

విశాఖలో గో ఆధారిత పంట ఉత్పత్తుల ప్రదర్శన ప్రారంభం

గోమాత ఆరాధనలతో పూజతో సదస్సు ఆరంభం. . .. 

*7 నుంచి మూడు రోజుల పాటు రైతులకు శిక్షణ,*    

*8 à°¨ మిద్దె తోట, సేంద్రియ వ్యవసాయం పై సదస్సులు* 

*9 న స్వతంత్ర

శాస్త్రవేత్త డాక్టర్ ఖాదర్ వలి పై శిక్షణ శిబిరం*   

100 కి పైగా స్టాల్స్ లో వ్యవసాయ ఉత్పత్తులు ప్రదర్శన

*(DNS రిపోర్ట్ : సాయిరాం CVS , బ్యూరో , విశాఖపట్నం): . . .

.*

విశాఖపట్నం, ఫిబ్రవరి 07, 2020 (డిఎన్‌ఎస్‌) : à°¸à±à°µà°šà±à°›à°®à±ˆà°¨ ఆహారాన్ని ప్రజలకు అందరికీ అందించాలని అనే సంకల్పం తో గో ఆధారిత వ్యవసాయ పద్దతులను రైతులు, ప్రజలకు

తెలియచేసే విధంగా మూడు రోజుల పాటు జాతీయ ప్రదర్శన విశాఖ నగరం లో ప్రారంభమయ్యింది. విశాఖ నగరంలోని ఎంవిపి కాలనీ లో ఏ ఎస్ రాజా మైదానం లో జరుగుతున్న ప్రకృతి వ్యవసాయ

ఉత్పత్తుల మేళాకు విశాఖ వాసుల నుంచి మంచి స్పందన లభించింది. ఆంధ్ర ప్రదేశ్ గో ఆధారిత  à°ªà±à°°à°•à±ƒà°¤à°¿ వ్యవసాయదారుల సంఘం ఆధ్వర్యవం లో జరుగుతున్న à°ˆ సదస్సును విశాఖపట్నం

మెట్రో ప్రాంత అభివృద్ధి సంస్థ (వి à°Žà°‚ ఆర్ à°¡à°¿ ఏ)  à°šà±ˆà°°à±à°®à°¨à± ద్రోణంరాజు శ్రీనివాస్, విశాఖపట్నం లోక్ సభ మాజీ సభ్యులు డాక్టర్ కె. హరిబాబులు సందర్శించారు. à°ˆ సందర్బంగా

వారు మాట్లాడుతూ ఇటీవల కాలంలో ఆహారం పూర్తిగా కలుషితం అవుతోందని, రసాయనాలు కలిపిన ఉత్పత్తులు మాత్రమే విరివిగా లభ్యమవుతున్నాయన్నారు. ఈ నేపథ్యంలో ప్రకృతి

అందించిన పద్దతుల ద్వారా స్వయంసిద్ద పద్దతులతో వ్యవసాయం చేయడం ద్వారా ఏ విధమైన ఉత్పత్తులను పొందవచో అందరికీ తెలియచేసేందుకు ఏర్పాటు చేసిన ఈ శిబిరం లో పెద్ద

ఎత్తున ఆంధ్ర ప్రదేశ్ నుంచి వివిధ ప్రాంతాల్లోని రైతులు పాల్గొనడం అభినందనీయమన్నారు. స్వచ్ఛమైన ఆహారం తినడం ద్వారా అనారోగ్యాలకు దూరం గా ఉండగలుగుతామన్నారు. ఈ

సందర్బంగా నిర్వాహకులను వారు అభినందించారు.  

పూర్వకాలంలో ఇదే తరహాలో వ్యవసాయం చేసేవారని, అయితే నేడు అధిక ఉత్పత్తి, డబ్బుల కోసం రసాయన ఎరువులను వాడుతూ,

కృత్రిమ పద్దతులతో వ్యవసాయం చేస్తున్నారన్నారు. తద్వారా పంట పండించిన వాళ్ళు, ఆ ఉత్పత్తులు తిన్నవాళ్ళు కూడా ఆసుపత్రిపాలవుతున్నారన్నారు. ఈ విధమైన అవస్థలు

ఉండకూడదని ఈ గో ఆధారిత వ్యవసాయం పై మూడు రోజుల సదస్సు నిర్వహించి, రైతులకు, ప్రజలకూ కూడా ఈ సంప్రదాయ పద్దతులపై పూర్తి వివరణ ఇవ్వడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమం

లో పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొనాలన్నారు. 

కార్యక్రమ ఆహ్వాన సంఘం అధ్యక్షులు సత్తి రామకృష్ణారెడ్డి,  à°­à°¾à°°à°¤à±€à°¯ కిసాన్ సంఘ్ జాతీయ కార్యవర్గ సభ్యులు జె

కుమారస్వామి,  à°—ో ఆధారిత వ్యవసాయం దారుల సంఘం విశాఖ జిల్లా అధ్యక్షులు à°Žà°‚ ఎస్ ఎన్ రాజు, ప్రముఖ పారిశ్రామిక వేత్త ఎస్. విజయ్ కుమార్,   ఇతర ప్రముఖులూ

పాల్గొన్నారు.

మూడు రోజుల గో ఆధారిత ఉత్పత్తుల సదస్సును సంప్రదాయ బద్దంగా గోమాతను పసుపు కుంకుమలతో ఆరాధించి, ప్రారంభించారు. గో పృష్టం ను తాకి సదస్సును

శుభప్రదం చేసి, ఎక్కువమందికి à°ˆ ప్రకృతి సిద్ద వ్యవసాయం పై అవగాహనా లభించాలని నిర్వాహకులు ఆశించారు.  

à°ˆ మూడు రోజుల శిబిరంలో :. .  . 

ఈ నెల 7 నుంచి 9 వరకూ మూడు

రోజులపాటు విశాఖ నగరంలోని ఎంవిపి కోలనీ లో à°—à°² ఏఎస్ రాజా క్రీడా మైదానం లో శిక్షణ శిబిరం జరుగుతుందన్నారు. 
ఈ నెల 7 న ఉదయం 10 గంటలకు రైతు సమ్మేళనం జరుగనుంచి. ఈ

కార్యక్రమం లో గో ఆధారిత ప్రకృతి వ్యవసాయం చేసే రైతులు, వ్యవసాయ శాఖా అధికారులు, వ్యవసాయ శాస్త్రవేత్తలు, రైతు శాస్త్రవేత్తలు, పెద్ద సంఖ్యలో రైతులు

పాల్గొంటారన్నారు. 

రెండవ రోజైన 8 వ తేదీన మధ్యాహ్నం 2 గంటలకు గృహవాసాల్లో నివసించే సాధారణ ప్రజల కోసం ప్రత్యేకంగా మిద్దె తోట పై అవగాహనా, శిక్షణ

అందిస్తున్నారు. ఈ కార్యక్రమం లో ప్రతి ఇంటిలోని, అపార్ట్మెంట్ ల లోని మేడ పై చిన్న చిన్న కుండీల్లో మొక్కలు ఎలా పెంచాలి అంశం పై శిక్షణ, సూచనలు ఇవ్వడం

జరుగుతుందని తెలిపారు. ఇరవై సంవత్సరాలుగా మిద్దె తోటల సాగు చేస్తున్న నిపుణులు పాల్గొంటారు. మిద్దె తోట కి అవసరమైన పనిముట్లు, ఎరువు తయారీ, విత్తనాల ఎంపిక మొక్కల

పెంపకం పై శిక్షణ ఇస్తారు. ప్రకృతి ఆధారిత సౌందర్య సాధనాలపై కూడా నిపుణుల ప్రసంగం వుంటుంది. రాత్రి స్లోపాయిజన్ చిత్ర ప్రదర్శన జరుగుతుంది. 

మూడవ రోజు 9 వ తేదీ

న ఉదయం 10 గంటల నుంచి ప్రముఖ స్వతంత్ర శాస్త్రవేత్త డాక్టర్ ఖాదర్ వలి పాల్గొని రైతులకు, ప్రజలకు విశ్లేషణాపూర్వక సూచనలు అందించనున్నట్టు తెలిపారు. ఈయన

ఆహారపదార్థాలపై ప్రభావం చూపుతున్న ఏజంట్, ఆరెంజ్, డయాక్సిన్లు వంటి విషతుల్య రసాయనాలను నిర్వీర్యం చేయడంపై పరిశోధనలు చేయడం జరిగింది. అయన తో పాటు ఇతర ప్రముఖులు

కూడా హాజరు కానున్నారు.  à°ªà±à°°à°•à±ƒà°¤à°¿ పంటల ద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకునే విధానాలను వివరిస్తారు. à°ˆ సందర్భంగా సహజ ఆహర వంటకం పోటీలు జరుగుతాయి.

మూడు రోజుల

శిక్షణా శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా నిర్వాహకులు కోరుతున్నారు. సుమారు వంద కు పైగా ఉత్పత్తులు ప్రదర్శన, విక్రయ కేంద్రాల్లో ఏర్పాటు చేసిన పలు

ఉత్పత్తులను చూసి, తెలుసుకుని, అవసరమైన సమాచారాన్ని తెలుసుకోవాల్సిందిగా సూచిస్తున్నారు.  

ప్రతిరోజు ఉదయం 10 గంటల నుంచి రాత్రి పది గంటల వరకు ఈ స్టాల్స్

తెరిచి ఉంటాయి. ప్రవేశం పూర్తిగా ఉచితం.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam