DNS Media | Latest News, Breaking News And Update In Telugu

దేశంలోనే మొదటి దిశా పీఎస్ రాజమహేంద్రి లో ప్రారంభం. 

జాం పేట లో ప్రారంభించిన సీఎం వైఎస్ జగన్  

ప్రతి జిల్లాలో ప్రత్యేకంగా దిశ కోర్టులు ఏర్పాటు   

చట్టం మరింత కఠినతరం, సత్వర న్యాయానికి కృషి

 

మహిళా స్టేషన్, మహిళలే ప్రారంభించాలి: à°µà±ˆà°Žà°¸à± జగన్ . .

(DNS రిపోర్ట్ : పి. రాజా, Spl కరస్పాండెంట్ అమరావతి) : . . . . 

అమరావతి, ఫిబ్రవరి 08, 2020 (డిఎన్‌ఎస్‌) : రాష్ట్రంలో

బాలికలు, మహిళల రక్షణే తమ ప్రభుత్వ లక్ష్యం అని ప్రకటించిన రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆచరణలో చేసి చూపించారు. దేశంలోనే మొట్ట మొదటి దిశా పోలీస్

స్టేషన్ తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం లోనే ప్రారంభించారు. శనివారం ఉదయం జరిగిన à°ˆ కార్యక్రమం లో రాష్ట్ర హోమ్ శాఖామంత్రి మేకతోటి  à°¸à±à°šà°°à°¿à°¤, రాష్ట్ర ప్రధాన

కార్యదర్శి నీలం సాహ్నే, డీజీపీ గౌతం సవాంగ్‌, మంత్రులు తానేటి వనిత, కాకినాడ లోక్ సభ సభ్యురాలు వంగా గీత, ఆంధ్ర ప్రదేశ్ పరిశ్రమలు మౌలిక వనరుల సంస్థ చైర్ పెర్సన్ ,

నగరి ఎమ్మెల్యే ఆర్ కె రోజా, ఆంధ్ర ప్రదేశ్ మహిళా కమిషన్‌ చైర్‌ పర్సన్‌ వాసిరెడ్డి పద్మ,  à°¸à°¹à°¾ దిశ చట్టం పర్యవేక్షణా అధికారులు దీపిక పాటిల్, కృతికా శుక్లా

పాల్గొన్నారు. 

మహిళా స్టేషన్, మహిళలే ప్రారంభించాలి: à°µà±ˆà°Žà°¸à± జగన్ . . . 

మహిళల రక్షణ కోసం నెలకొల్పిన దిశా పోలీస్ స్టేషన్ ను మహిళలే ప్రారంభించాలి అని

ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మహిళా మంత్రులను,  à°ªà±à°°à°§à°¾à°¨ కార్యదర్శి నీలం సాహ్నేలతో రిబ్బన్ కట్ చేయించారు. à°ˆ క్రమం లో ముందుకు రావడానికి కొంచెం వెనకడుగు

వేసిన నీలం సాహ్నెను చెయ్యి పట్టుకు మరీ ముందుకు తీసుకువచ్చి మహిళలే à°ˆ రాష్ట్రానికి సారధులు అని సీఎం నిరూపించడం గమనార్హం. 

ఏపీ లో దిశ చట్టంలో

ప్రత్యేకతలు: . . .

మహిళలు, బాలికల రక్షణ కోసం ఏర్పాటు చేసిన దిశా చట్టం లో వివిధ విభాగాల్లో మహిళల పట్ల జరుగుతున్నా అన్ని తరహాల వేధింపుల పైనా తగిన శిక్షలు

విధించే విధంగా చట్టాన్ని చాలా కఠినంగా రూపొందించారు. ఈ చట్టం లో పొందుపరచబడింది అంశాల్లో ప్రధానమైనవి :

దిశ చట్టం కింద నమోదైన కేసులను డీఎస్పీ స్థాయి

అధికారి పర్యవేక్షిస్తారు, దర్యాప్తు కోసం రాష్ట్రంలో 18 ప్రత్యేక దిశ పోలీస్‌ స్టేషన్లు ఏర్పాటు చేసారు. కేసును ఏడు రోజుల్లో దర్యాప్తు, 14 పని రోజుల్లో విచారణ

పూర్తి చేయాల్సి యుంటుంది. 
 
లైంగిక దాడులు, వేధింపుల కేసుల్లో ఐపీసీ 354 ఎఫ్, 354 జి సెక్షన్లను అదనంగా చేర్చారు. 

13 మంది ప్రత్యేక పబ్లిక్‌ ప్రాసిక్యూటర్ల

నియామకం

రేప్, గ్యాంగ్‌ రేప్‌లకు పాల్పడితే ఉరిశిక్ష ,  

చిన్నారులపై లైంగిక వేధింపులకు పాల్పడితే జీవితఖైదు

సోషల్‌ మీడియా, డిజిటల్‌ మీడియాలో

సైతం వేధిస్తే మొదటిసారి రెండేళ్లు జైలు శిక్ష. రెండోసారి తప్పు చేస్తే నాలుగేళ్లు జైలు శిక్ష పడుతుంది. 

అత్యాచారం కేసుల్లో శిక్ష పడిన దోషులు అప్పీలు

చేసుకునే గడువు 180 రోజుల నుంచి 45 రోజులకు కుదింపు.

మహిళలు, చిన్నారులపై అకృత్యాలకు పాల్పడే వారి వివరాలను అందరికీ తెలిసేలా డిజిటల్‌ (ఆన్‌లైన్‌) రిజిస్టర్‌లో

నమోదు చేస్తారు.

మంగళగిరి, విశాఖపట్నం, తిరుపతిలో ఫోరెన్సిక్‌ ల్యాబ్‌à°² ఆధునికీకరణ

తిరుపతి, విశాఖపట్నంలో రెండు డీఎన్‌ఏ సెంటర్లు

బయాలజీ,

సెరాలజీ, సైబర్‌ ల్యాబ్‌లు

దిశ పోలీస్‌ స్టేషన్‌లో సిబ్బంది 30 శాతం ప్రత్యేక అలవెన్సు

కేసుల దర్యాప్తునకు నెలకు రూ.లక్ష

మహిళా పోలీస్‌ స్టేషన్ల

హోదా పెంపు, à°’à°• డీఎస్పీ, 3 ఎస్‌ఐ పోస్టులు మంజూరు

ప్రత్యేకంగా ఆసుపత్రుల్లో గైనకాలజీ పోస్టుల భర్తీ

రాష్ట్రంలో ఎక్కడైనా ఫిర్యాదు చేసేలా జీరో

ఎఫ్‌ఐఆర్‌ సౌకర్యం. 

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam