DNS Media | Latest News, Breaking News And Update In Telugu

మహిళలు, బాలికల రక్షణే మా ధ్యేయం: సీఎం వైఎస్ జగన్. 

వేధించాలన్న తలపు కూడా రాకూడదనే à°•à° à°¿à°¨ చట్టాలు చేసాం  

పటిష్టమైన దిశ పోలీసు వ్యవస్థను ఏర్పాటు చేసాం. . . 

ఆవేదనతో చట్టాన్ని ఎవరూ చేతిలోకి

తీసుకోవద్దు, 

(DNS రిపోర్ట్ : SV ఆచార్యులు, స్టాఫ్ రిపోర్టర్, శ్రీకాకుళం): . . . . .

శ్రీకాకుళం, ఫిబ్రవరి 08, 2020 (డిఎన్‌ఎస్‌): రాష్ట్రం లో మహిళలు, బాలికలకు సంపూర్ణ రక్షణ

కల్పించాలనే ధ్యేయం తో దిశా చట్టాన్ని తీసుకు వఛ్చినట్టు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రకటించారు. శనివారం తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం లోని

నన్నయ విశ్వ విద్యాలయం లో జరిగిన దిశ యాప్ విడుదల కార్యక్రమం లో ఆయన మాట్లాడుతూ దిశ చట్టం రూపకల్పన విధి విధానాలను తెలియచేసారు. మహిళలు, బాలికలపై ఎవరైనా వేధింపులు

జరపాలనే తలంపు కూడా ఎవరికీ రాకుండా ఉండే విధంగా దిశ చట్టాన్ని రూపొందించామన్నారు.  à°¹à±ˆà°¦à°°à°¾à°¬à°¾à°¦à±‌లో జరిగిన దిశ ఘటన దేశవ్యాప్తంగా భయానక వాతావరణం ఏర్పడిందని, వయసు

తో ప్రమేయం లేకుండా చిన్నారులపై కూడా అఘాయిత్యాలు జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. 

మద్యం సేవించి కొందరు రాక్షసులుగా మారి అత్యాచారాలకు

పాల్పడుతున్నారని, అలాంటి క్రూరులను శిక్షించాలని ప్రతీ ఒక్కరికీ ఉంటుందన్నారు. అయితే సినిమాల్లో చూపించినట్లుగా ప్రజా వ్యవస్థలో స్వేచ్ఛ ఉండదని, ఎవరు పడితే

వారు చట్టాన్ని చేతిలోకి తీసుకోకూడదన్నారు. 

నేరం చేస్తే శిక్ష పడుతుందనే భయం ఉన్నపుడే అకృత్యాలు తగ్గుతాయన్నారు. నేరాలను అదుపులోకి తెచ్చి వ్యవస్థలో

మార్పులు చేసేందుకే దిశ చట్టాన్ని తీసుకువచ్చామని తెలిపారు.  

నేరం చేసిన వాళ్లు ఎవరైనా సరే వారిని శిక్షించడం కోసం ఈ చట్టం ఉపయోగపడుతుందన్నారు. అంతకు

ముందు రాజమహేంద్రవరం లోని జామ్ పేట లో దేశంలోనే మొట్టమొదటి దిశ’ పోలీస్‌ స్టేషన్‌ను ఆయన ప్రారంభించారు. 

ఈ కార్యక్రమంలో మంత్రులు మేకతోటి సుచరిత, ఉప

ముఖ్యమంత్రి పుష్పశ్రీ వాణి, తానేటి వనిత, డీజీపీ గౌతం సవాంగ్‌, ఏపీ ఐఐసీ చైర్ పర్సన్ ఆర్కే రోజా, రాజమహేంద్రవరం ఎంపీ మార్గాని  à°­à°°à°¤à±, కాకినాడ ఎంపీ వంగా గీత, ఇతర

ఎమ్మెల్యే లు తదితరులు పాల్గొన్నారు. దిశ చట్టం లో రూపొందించిన అంశాలు ఆయన చదివి వినిపించారు. .

 à°ˆ చట్టం లో పొందుపరచబడింది అంశాల్లో ప్రధానమైనవి :

దిశ

చట్టం à°•à°¿à°‚à°¦ నమోదైన కేసులను డీఎస్పీ స్థాయి అధికారి పర్యవేక్షిస్తారు, దర్యాప్తు కోసం రాష్ట్రంలో 18 ప్రత్యేక దిశ పోలీస్‌ స్టేషన్లు ఏర్పాటు చేసారు. కేసును ఏడు

రోజుల్లో దర్యాప్తు, 14 పని రోజుల్లో విచారణ పూర్తి చేయాల్సి యుంటుంది. 
 
లైంగిక దాడులు, వేధింపుల కేసుల్లో ఐపీసీ 354 ఎఫ్, 354 జి సెక్షన్లను అదనంగా చేర్చారు. 

13

మంది ప్రత్యేక పబ్లిక్‌ ప్రాసిక్యూటర్ల నియామకం

రేప్, గ్యాంగ్‌ రేప్‌లకు పాల్పడితే ఉరిశిక్ష ,  

చిన్నారులపై లైంగిక వేధింపులకు పాల్పడితే

జీవితఖైదు

సోషల్‌ మీడియా, డిజిటల్‌ మీడియాలో సైతం వేధిస్తే మొదటిసారి రెండేళ్లు జైలు శిక్ష. రెండోసారి తప్పు చేస్తే నాలుగేళ్లు జైలు శిక్ష

పడుతుంది. 

అత్యాచారం కేసుల్లో శిక్ష పడిన దోషులు అప్పీలు చేసుకునే గడువు 180 రోజుల నుంచి 45 రోజులకు కుదింపు.

మహిళలు, చిన్నారులపై అకృత్యాలకు పాల్పడే వారి

వివరాలను అందరికీ తెలిసేలా డిజిటల్‌ (ఆన్‌లైన్‌) రిజిస్టర్‌లో నమోదు చేస్తారు.

మంగళగిరి, విశాఖపట్నం, తిరుపతిలో ఫోరెన్సిక్‌ ల్యాబ్‌à°²

ఆధునికీకరణ

తిరుపతి, విశాఖపట్నంలో రెండు డీఎన్‌ఏ సెంటర్లు

బయాలజీ, సెరాలజీ, సైబర్‌ ల్యాబ్‌లు

దిశ పోలీస్‌ స్టేషన్‌లో సిబ్బంది 30 శాతం ప్రత్యేక

అలవెన్సు

కేసుల దర్యాప్తునకు నెలకు రూ.లక్ష

మహిళా పోలీస్‌ స్టేషన్ల హోదా పెంపు, à°’à°• డీఎస్పీ, 3 ఎస్‌ఐ పోస్టులు మంజూరు

ప్రత్యేకంగా ఆసుపత్రుల్లో

గైనకాలజీ పోస్టుల భర్తీ

రాష్ట్రంలో ఎక్కడైనా ఫిర్యాదు చేసేలా జీరో ఎఫ్‌ఐఆర్‌ సౌకర్యం.

Recent News

Latest Job Notifications

Panchangam - May 20, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam