DNS Media | Latest News, Breaking News And Update In Telugu

విశాఖ వేదికగా మరో మహా ఉద్యమానికి శ్రీకారం - సి పీ ఐ రామకృష్ణ 

విశాఖ​పట్నం, జూన్ 25 , 2018 (DNS Online ): ప్రజా సమస్యల ను గాలికి వదిలేసిన కేంద్రం లోని భారతీయ జనతాపార్టీకి వ్యతిరేకంగా, రాష్ట్రం లోని తెలుగుదేశం పార్టీ ల వైఖరికి నిరసనగా

జులై 8  à°¨à±à°‚à°šà°¿ విశాఖపట్నం వేదికగా మరో మహా ఉద్యమానికి శ్రీకారం చుడుతున్నట్టు భారత కమ్యూనిస్ట్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి కె. రామకృష్ణ, హెచ్చరించారు. సోమవారం

నగరం లోని సీపీఐ కార్యాలయం లో నిర్వహించిన విలేకరుల సమావేశం లో అయన మాట్లాడుతూ 2014 ఎన్నికల్లో భాజపా ఇచ్చిన హామీలను తుంగలోకి తొక్కి, విభజన చట్టం లో ఇచ్చిన హామీలను

పూర్తిగా పాతాళానికి తోక్కేసిన విషయం స్థానిక ఎం పీ డాక్టర్ హరిబాబు కు కనపడడం లేదా అని ప్రశ్నించారు. విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ పై కేంద్ర రైల్వే మంత్రి

పీయూష్ గోయల్ మాట్లాడుతూ విభజన బిల్లు లో కేవలం పరిశీలించామని ఉందని, ఇప్పడికే నాలుగేళ్లు పూర్తయ్యిందని, ఇంకా ఎన్నేళ్లు పరిశీలిస్తారని మండిపడ్డారు. ఇక విశాఖ

కేంద్రంగా జరిగిన భూ కుంభకోణాలపై రాష్ట్ర ప్రభుత్వం వేసిన సిట్ బృందం ఎన్ని సంవత్సరాలు దర్యాప్తు చేస్తూ ఉంటుందన్నారు. చంద్రబాబు నాయుడు ధైర్యం ఉంటె సిట్

నివేదిక బయటపెట్టి, నిందితులపై చర్యలు తీసుకోవాలని సవాల్ చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తారో లేదో తెలియదు కానీ

రాష్ట్రాన్ని అవినీతి ఆంధ్రా గా మార్చేసారు అన్నారు. ఏపీకి ప్రత్యేక​ హోదా రాకపోవడానికి చంద్రబాబే కారణమన్నారు. వామపక్షాలు ఉక్కు ఫ్యాక్టరీ కోసం పోరాడితే

అరెస్టులు చేయించారని, ఇప్పుడు దొంగ దీక్షలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు. జూలై 2న అనంతపురంలో నీలం రాజశేఖర్ రెడ్డి శత జయంతి వేడుకలు నిర్వహిస్తున్నట్టు

తెలిపారు. à°ˆ వేడుకలు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతాయన్నారు. 

For more details Click Here. All Copy Rights Reserved with DNS Media.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam