DNS Media | Latest News, Breaking News And Update In Telugu

చిన్న, మధ్యతరహా పత్రికలకు ప్రాణజీవం పోస్తాం: 

కేంద్ర సమాచార శాఖ ఏడీజీ  à°®à±à°°à°³à±€à°®à±‹à°¹à°¨à± వెల్లడి  

ఏపీజేఎఫ్ వార్షిక సమావేశంలో పాత్రికేయులకు à°Šà°°à°Ÿ   

దందాలు - చందాలు సంస్కృతి పై ప్రక్షాళన అవసరం:

పెంటపాటి రాజా

(DNS రిపోర్ట్ : పి. రాజా, Spl కరస్పాండెంట్ అమరావతి): . . .

అమరావతి, ఫిబ్రవరి 09, 2020 (డిఎన్‌ఎస్‌) : కేంద్ర ప్రభుత్వం ద్వారా చిన్న, మధ్య తరహా పత్రికలకు చేయూత

నివ్వడం ద్వారా  à°ªà±à°°à°¾à°£ జీవం పోసి ఆదుకుంటామని, భారత ప్రభుత్వ సమాచార శాఖ (పిఐబి) అదనపు డైరెక్టర్ జనరల్ à°¡à°¿.మురళీమోహన్ హామీ ఇచ్చారు. ఆదివారం తూర్పుగోదావరి జిల్లా

కాకినాడలో జరిగిన ఆంధ్రప్రదేశ్ జర్నలిస్ట్స్ యూనియన్ ( ఏపీజేయూ) తూర్పు గోదావరి జిల్లా కమిటీ సమావేశం లో ముఖ్య అతిధిగా పాల్గొన్న ఆయన మాట్లాడుతూ

చిన్నపత్రికలకు భారత ప్రభుత్వం జారీచేసే ప్రకటనల విషయంలో నిబంధనలు సడలించి ప్రకటనలు డిఏవిపి ద్వారా ఇచ్చే విషయం లో కొంత సడలింపు ఇచ్చే విషయం ముందడుగు

వేస్తామన్నారు. అదే విధంగా పదవి విరమణ చేసిన పాత్రికేయులకు జాతీయ పెన్షన్ మంజూరు చేసే అంశం కేంద్ర  à°ªà±à°°à°­à±à°¤à±à°µà°‚ దృష్టిలో ఉందని,  à°…లాగే మరికొన్ని సమస్యలు రాష్ట్ర

ప్రభుత్వం దృష్టికి తీసుకెళతామని తెలిపారు. 

à°ˆ కార్యక్రమంలో అఖిలభారత వార్తా పత్రిక ఉద్యోగుల సమాఖ్య  ( ఏఐఎన్ఈఏఫ్) జాతీయ ఉపాధ్యక్షులు సీహెచ్.పూర్ణచంద్ర

రావు మాట్లాడుతూ పాత్రికేయులు దశాబ్దాల తరబడి పోరాటం చేసి విసిగి పోయారన్నారు. ఒక ప్రక్క సమాచార సేకరణలోని, విధి నిర్వహణ లోనూ తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటు ఎన్నో

సమస్యలకు లోనవుతున్నారన్నారు. వీరికి తగిన à°Šà°°à°Ÿ కల్గించవలసిన భాద్యత ప్రభుత్వానిదేనన్నారు. 

దందాలు - చందాలు సంస్కృతి పై ప్రక్షాళన అవసరం: à°ªà±†à°‚టపాటి రాజా. . .

.

దందాలు  à°šà°‚దాలు సంస్కృతి మీడియా సమాజం నుంచి పోవాలంటే వ్యక్తిగత ప్రక్షాళన అవసరం అని ఏపీజేయు అదనపు కార్యదర్శి పెంటపాటి రాజా అభిరప్రాయపడ్డారు.  à°‡à°Ÿà±€à°µà°²

కాలంలో వెలుగు చూస్తున్న ఎన్నో కేసులలో పాత్రికేయుల గుణగణాలు చాలా అభ్యంతరకరంగా ఉన్నాయని,  à°•à±Šà°‚తమంది చేసే పనుల వల్ల మొత్తం పాత్రికేయ వ్యవస్థకే మచ్చ

తీసుకువస్తోందన్నారు. అయితే దీని పట్ల నిబద్ధత కలిగిన పాత్రికేయులు సమాజంలో తలెత్తుకుని తిరిగే పరిస్థితి కనబడడం లేదని ఆవేదన వ్యక్తం చేసారు. ప్రతి మీడియా

సంస్థ తమ సిబ్బంది పట్ల పూర్తి బాధ్యత వహించాల్సిన అవసరం ఉందన్నారు. 

కొన్ని సంస్థలు ప్రత్యేకించి సమాజంలో దందాలుచేసే పని కోసమే తాము మీడియా లో ఉన్నాం అనే

సందేశాన్ని ఇచ్చే విధంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ఇలాంటి వాటి పట్ల మొత్తం పాత్రికేయ వ్యవస్థ భ్రష్టు పట్టి పోయింది మొత్తం ఈ వ్యవస్థను కూలంకషంగా

ప్రక్షాళన చేయవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉంది దీని పట్ల కొందరు తాత్కాలికంగా ఇబ్బంది పడినప్పటికీ మొత్తం వ్యవస్థ గాడిలో పడుతుందన్నారు. 

ఈకార్యక్రమం లో

ఏపీజేయూ ప్రధానకార్యదర్శి టి.పార్ధసారధి వరప్రసాద్, తూర్పు గోదావరి జిల్లా, ఇతర జిల్లాలకు చెందిన సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Recent News

Latest Job Notifications

Panchangam - May 20, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam