DNS Media | Latest News, Breaking News And Update In Telugu

దిశా చట్టం లేకుండా  పీఎస్ లు పెట్టి ఉపయోగం ఏంటి?

ప్రజలను, చట్టాలను ప్రక్కదారి పట్టించడమే, 

అసెంబ్లీ లోనే న్యాయం జరగలేదు, ఇక పీఎస్ లో వస్తుందా?

రాజమండ్రి ఎమ్మెల్యే ఆదిరెడ్డి భావాన్ని

మండిపాటు

(DNS రిపోర్ట్ : పి. రాజా, Spl కరస్పాండెంట్ అమరావతి): . . .

అమరావతి, ఫిబ్రవరి 10, 2020 (డిఎన్‌ఎస్‌) : ఆంధ్ర ప్రదేశ్ దిశా చట్టం ఇంకా అమలు లోకి రాకుండా పోలీస్

స్టేషన్లు పెట్టి చట్టాన్ని, ప్రజలకు తప్పుదారి పట్టిస్తున్నారంటూ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పై రాజమహేంద్రవరం ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవాని ( తెలుగుదేశం)

మండిపడ్డారు. సోమవారం రాజమండ్రి లోని రెండు రోజుల క్రితం ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రారంభించిన దిశా పోలీస్ స్టేషన్ లో తనపై సోషల్ మీడియా లో తనపై

అసభ్యకర కామెంట్స్ చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేసారు. ఈ సందర్బంగా ఆ స్టేషన్ లోని డిఎస్పీ కి ఫిర్యాదు అందించారు. అనంతరం మీడియా తో మాట్లాడుతూ

సాధారణ పోలీస్ స్టేషన్ కి దిశా పీఎస్ కు తేడా లేదన్నారు. ఇదే విషయం డిఎస్పీ చెప్పినట్టు తెలిపారు. ప్రస్తుతం దిశా చట్టం ఇంకా అమలు లోకి రాలేదని, కేంద్రం నుంచి

ఆమోదం రావాల్సి ఉందన్నారు. తాడూ బొంగరం లేకుండా ఇలా ఊరికి ముందు లక్షలు ఖర్చు చేసి పీ ఎస్ లు కట్టెయ్యడం ఏంటని ప్రశ్నించారు. సోషల్ మీడియా లో తనపై అసభ్యకర

కామెంట్స్ చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని సాక్షాత్తు తానూ శాసన సభా స్పీకర్ కు ఫిర్యాదు చేసానని, అయన చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారని, నేటికీ చర్యలు

లేవన్నారు. శాసన సభలోనే ఉలుకు పలుకూ లేకపోతె, ఇక పోలీస్ స్టేషన్ ఏమి ఉంటుందన్నారు. ఇప్పడికే పలు కేసులు ఈ స్టేషన్ లో నమోదు అయ్యాయన్నారు. వాటిని కూడా సాధారణ

కేసుల్లాగానే చూస్తున్నారన్నారు. ఇక రెండు రోజుల క్రితం జరిగిన ఈ పీఎస్ ప్రారంభోత్సవానికి తానూ హాజరు కాకపోడానికి కారణం కూడా ఇదేనన్నారు. తనపై సోషల్ మీడియా లో

చేసిన అసభ్య వ్యాఖ్యలపై చర్యలు తీసుకొని కారణంగానే తాను హాజరు కాలేదన్నారు. 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam