DNS Media | Latest News, Breaking News And Update In Telugu

విగ్రహాలు కూల్చిన వాళ్లపై చర్యలు లేకుంటే ఉద్యమిస్తాం 

ఈ ప్రభుత్వం మైనారిటీలకు పనిచేస్తుందా?

ఆంధ్రా లో ఆలయాలు కూలుస్తున్న చలనం లేదా?  

సాధుపరిషత్ అధ్యక్షులు స్వామి శ్రీనివాసానంద సూటి ప్రశ్న 

(DNS

రిపోర్ట్ : సాయిరాం CVS , బ్యూరో , విశాఖపట్నం): . . . 

విశాఖపట్నం, ఫిబ్రవరి 12, 2020 (డిఎన్‌ఎస్‌) : ఆంధ్ర ప్రదేశ్ లో కొందరు అసాంఘిక శక్తులు హిందూ దేవాలయాలను కూల్చడమే పనిగా

పెట్టుకున్నాయని, పిఠాపురం లోను, రొంపిచర్లలోనూ విగ్రహాలను కూల్చిన వారిని ఐదు రోజుల్లోగా అరెస్ట్ చేసి కఠిన చెర్యలు తీసుకోకుంటే రాష్ట్ర వ్యాప్తంగా

ఉద్యమిస్తామని ఉత్తరాంధ్రా సాధుపరిషత్ అధ్యక్షులు స్వామి శ్రీనివాసానంద సరస్వతి హెచ్చరించారు. 

గుంటూరు జిల్లా నర్సారావు పేట నియోజకవర్గంలోని

రొంపిచర్ల గ్రామం లోని 1400 ఏళ్ళ క్రితం నాటి ప్రఖ్యాత మదన గోపాలస్వామి ఆలయం లోని మూల విరాట్ విగ్రహాలకు డ్రిల్లింగ్ మిషన్లతో కూల్చిన ఘటనపై ఆయన మండిపడ్డారు. నాలుగు

రోజుల క్రితం జరిగిన ఈ ఘటన పై పూర్తి వివరాలు తెలుసుకుందుకు సాధు పరిషత్ సభ్యులు, ఇతర సాధువులు, భక్తులతో కలిసి మంగళవారం ఆలయాన్ని సందర్శించినట్టు తెలిపారు. ఈ

మేరకు ఒక ప్రకటన విడుదల చేసారు. ఆయన తెలిపిన అంశాల ప్రకారం అక్కడ దృశ్యాలు హృదయ విదారకంగా ఉన్నాయన్నారు. ఈ రాష్ట్రంలో హిందువులకు, ఆలయాలకు రక్షణ కల్పించడం

ప్రభుత్వం ఘోరంగా విఫలం చెందిందని మండిపడ్డారు.

à°ˆ రాష్ట్రం లో ప్రభుత్వం, అధికారులు కేవలం మైనారిటీల కోసమే పనిచేస్తారా,  à°¹à°¿à°‚దువులు కూడా ఇక్కడే ఉన్నాడనే

విషయం కూడా పట్టించుకునే తీరిక లేదా అని ఉత్తరాంధ్ర సాధుపరిషత్ అధ్యక్షులు స్వామి శ్రీనివాసానంద సరస్వతి సూటిగా ప్రశ్నిస్తున్నారు. తూర్పు గోదావరి జిల్లా

పిఠాపురం పట్టణంలో 23 ఆలయాల్లోని విగ్రహాలను నిర్దాక్షిణ్యంగా కూల్చిన ఘటన పై చర్యలు తీసుకోవాలి అంటూ హిందూ సమాజం రోడ్డెక్కి ఘోషిస్తున్న సమయంలోనే గుంటూరు

జిల్లా రొంపిచర్లలోని మదన గోపాల స్వామి ఆలయంలోని మూల విరాట్ నే డ్రిల్లింగ్ మిషన్లు పెట్టి కూల్చి వెయ్యడం ఘటన చూస్తుంటే ఈ ప్రభుత్వం హిందువులకు, హిందువుల

ఆలయాలకు ఏమాత్రం రక్షణ కల్పించే ఉద్దేశం లో ఉన్నట్టు కనపడడం లేదన్నారు. పైగా స్థానిక ప్రజా ప్రతినిధులు సైతం తమకు ఏమాత్రం సంబంధం లేనట్టుగా వ్యవహరిస్తున్నారని

మండిపడ్డారు. 

ఐదు రోజుల్లోగా ఈ అసాంఘిక శక్తులపై చర్యలు తీసుకోకుంటే రాష్ట్రవ్యాప్తంగా హిందూ సమాజం ఉద్యమిస్తుందని హెచ్చరించారు. దీనికి భాద్యత

పూర్తిగా ప్రభుత్వానిదేనన్నారు. పిఠాపురం లో ఘటన జరిగిన నాడు చర్య తీసుకుని ఉంటె రొంపిచర్ల ఘటన జరిగి ఉండేది కాదన్నారు. స్వామి వెంట స్వామి శ్రీనివాసానంద, భారీ

సంఖ్యలో భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam