DNS Media | Latest News, Breaking News And Update In Telugu

విశాఖ రైల్వే జోన్ కార్యాచరణ ప్రారంభించండి 

రైల్వే బోర్డు చైర్మన్ తో విశాఖ ఎంపీ à°Žà°‚ వివి 

(DNS రిపోర్ట్ : సాయిరాం CVS , బ్యూరో , విశాఖపట్నం) : . . .

విశాఖపట్నం, ఫిబ్రవరి 12, 2020 (డిఎన్‌ఎస్‌) : à°—à°¤ ఏడాది క్రితం

విశాఖపట్నం ప్రధాన à°•à±‡à°‚ద్రంగా ప్రకటించబడిన దక్షిణ కోస్తా రైల్వే జోన్ పూర్తి స్థాయి  à°•à°¾à°°à±à°¯à°¾à°šà°°à°£ త్వరగా ప్రారంభించే ఏర్పాట్లు చెయ్యాలని విశాఖపట్నం లోక్ సభ

సభ్యులు ఎం వివి సత్యనారాయణ రైల్వే బోర్డు చైర్మన్ వినోద్ కుమార్ యాదవ్ ను కోరారు. బుధవారం దేశ రాజధాని ఢిల్లీ లో మర్యాద పూర్వకంగా రైల్వే బోర్డు చైర్మన్ వినోద్

కుమార్ యాదవ్ ను కలిసిన ఎంపీ గతం లోనే విశాఖ కు కేటాయించబడిన రైల్వే ప్రాజెక్ట్ లు చాలా వరకూ కార్యాచరణే మొదలు పెట్టలేదన్నారు. ఇక దశాబ్దాల ఉత్తరాంద్ర ప్రజల

డిమాండ్ మేరకు నాటి భారత ప్రధాని నరేంద్ర మోడీ విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ ను ప్రకటించిన విషయాన్నీ తెలిపారు. అయితే  à°•à±‡à°µà°²à°‚ పేరు మాత్రమే కేటాయింపు జరిగిందని,

అయితే రైల్వే ప్రయాణీకుల ఇబ్బందులు అలాగే ఉన్నాయన్నారు. దేశంలోనే అత్యధికంగా ఆదాయం ఇచ్చే డివిజన్ల లో విశాఖపట్నం నాల్గవ స్థానం లో ఉందన్నారు. అయినప్పటికీ

రైల్వే పరంగా ప్రయాణీకులకు తగినన్ని రైళ్లు లేవని, విశాఖ పట్నం నుంచి బయలు దేరే చాలా రైళ్లను తూర్పు కోస్త రైల్వే భువనేశ్వర్ కు తరలించుకు పోయిందన్నారు. ఈ

బాధలన్నీ తప్పేందుకు సత్వరంగా విశాఖ కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్ కార్యాచరణను మొదలుపెట్టాలని కోరారు. 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam