DNS Media | Latest News, Breaking News And Update In Telugu

స్థానిక ఎన్నికల నుంచే ప్రక్షాళన మొదలు :మంత్రి పెద్దిరెడ్డి

అవకతవకలు జరిగితే ఎన్నిక రద్దు, జైలు 

పంచాయతీరాజ్ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి

(DNS రిపోర్ట్ : పి. రాజా, Spl కరస్పాండెంట్ అమరావతి): . . .

అమరావతి,

ఫిబ్రవరి 12, 2020 (డిఎన్‌ఎస్‌) : స్థానిక ఎన్నికల నుంచే రాష్ట్రంలో ప్రక్షాళన మొదలు పెడుతున్నట్టు రాష్ట్ర పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖామాత్యులు

పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. మంత్రిమండలి సమావేశం అనంతరం గ్రామా స్థాయి లో జరిగే అన్ని కార్యాచరణాలను మీడియా ముఖంగా వివరించారు. పంచాయతీరాజ్,

మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో మంత్రివర్గం లో ఎన్నికల నియమావళిలో మార్పులు తీసుకువచ్చినట్లు వెల్లడించారు. ఇప్పటికే గ్రామ సచివాలయ వ్యవస్థను అమలులోకి

వచ్చిందని, ప్రతీ 50 ఇళ్లకు à°’à°• వలంటీర్, ప్రతీ 2వేల కుటుంబాలకు గ్రామ సచివాలయ వ్యవస్థలను ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. 

స్థానికంగా నివాసం ఉన్నవారికే

పోటీ చేసే అవకాశం ఇవ్వాలన్న లక్ష్యంతో ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారని వివరించారు. స్థానిక సంస్థల ఎన్నికలు గ్రామాలు,

మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో ప్రజల సమస్యలను గుర్తించి, వారి ఆకాంక్షలను నెరవేర్చే వ్యక్తులే ప్రజాప్రతినిధులుగా ముందుకు సాగాలన్నది ఉద్దేశమని తెలిపారు.

 

పంచాయతీ ఎన్నికల్లో ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు అభ్యర్ధులు మద్యం, డబ్బు పంపిణీకి పాల్పడినట్లు రుజువైతే, ఆ వ్యక్తులు గెలిచిప్పటికీ ఆ పదవుల్లో

కొనసాగేందుకు అనర్హులుగా మారతారని పేర్కొన్నారు. ఎన్నికల నియమావళి సెక్షన్ 211 ప్రకారం అక్రమ మార్గాల ద్వారా  à°ªà±à°°à°¤à±à°¯à°•à±à°·à°‚à°—à°¾ కానీ, పరోక్షంగా గానీ ఓటర్లను ప్రలోభ

పరచడం, ఎన్నికల ప్రక్రియలో పాల్గొనకుండా చేయడం వంటి నేరాలకు పాల్పడితే 3 సంవత్సరాల వరకు జైలు శిక్ష, రూ.10వేల వరకు జరిమానా విధించేలా మార్పులను

తీసుకువచ్చామన్నారు. 

ఎంపిటిసి, జెడ్పీటిసి ఎన్నికలు 18 రోజుల్లో నిర్వహించాలని, గ్రామపంచాయతీ ఎన్నికలు 13 రోజుల్లో నిర్వహించాలని నిర్ణయించామన్నారు.

పంచాయతీరాజ్‌ చట్టం సెక్షన్ -25 à°•à°¿ సవరణలు చేయడం ద్వారా గ్రామపంచాయతీ సర్పంచ్ లకు అదనపు బాధ్యతలు అప్పగించేలా మార్పులు తెచ్చామన్నారు. పారిశుధ్య నిర్వహణ, మొక్కల

పెంపకం, పర్యావరణ పరిరక్షణ బాధ్యతలను సర్పంచ్ లకు అప్పగించాలని నిర్ణయించినట్లు మంత్రి వెల్లడించారు. సర్పంచ్ పంచాయతీ పరిధి గ్రామంలోనే నివసించాల్సి

ఉంటుందన్నారు. పంచాయతీ కార్యాలయానికి క్రమం తప్పకుండా సర్పంచ్ హాజరు కావాల్సి ఉంటుందన్నారు.

గిరిజన జనాభా ఉన్న పంచాయతీల్లో గ్రామ సర్పంచ్ పదవిని,  à°µà°¾à°°à±à°¡à±

సభ్యుల పదవులను అన్నింటిని గిరిజనులకే రిజర్వు చేస్తూ నిర్ణయం తీసుకోవడం జరిగిందని తెలిపారు. 

ఎన్నికల తేదీ ప్రకటించగానే భారీఎత్తున మద్యాన్ని పల్లెలకు

తరలించి, తాగించి, డబ్బుపంపిణీతో ప్రలోభాలకు గురి చేయకుండా తగిన విధంగా మార్పులను తెచ్చామన్నారు. 

గతంలో స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ వ్యవధిని గతంలో 24

రోజులు ఉంటే దానిని 13 నుంచి 17 రోజులకు తగ్గించామన్నారు. ఎన్నికల ప్రచార కాలపరిమితిని 5 నుంచి 7 రోజులకు పరిమితం చేశామన్నారు. ఈ సందర్భంగా అభివృద్థి వికేంద్రీకరణతో

మూడు ప్రాంతాల్లోని ప్రజలకు మేలు జరుగుతుందని మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు.

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam