DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ఫిబ్రవరి 14  వాలెంటైన్స్ డే కాదు సైనిక వందనం చెయ్యండి 

విచ్చలవిడి విశృంఖల వాలెంటైన్స్ డేను బహిష్కరించండి   

పుల్వామా ఘటనలో అమర సైనికులకు ఘన నివాళి అర్పించండి 

వాలంటైన్స్ డే కు  à°›à±€ కొట్టు - అమర

సైనికులకు జై కొట్టు. . . 

ప్రేమ అంటే బరితెగించి వ్యభిచరించడం కాదు, 

దీనివల్ల కుటుంబాలు ఛిద్రమైపోతున్నాయి, గమనించండి 

కుటుంబ సభ్యులను

ప్రేమించండి, బాగుపడతారు  

సోషల్ మీడియా నూ ప్రధాన సాధనంగా: . . . . .

యువతకు జన జాగరణ సమితి ప్రతినిధులు పిలుపు  

(DNS రిపోర్ట్ : సాయిరాం CVS , బ్యూరో , విశాఖపట్నం) : . . .

.

విశాఖపట్నం, ఫిబ్రవరి 13, 2020 (డిఎన్‌ఎస్‌) : ఫిబ్రవరి 14 అనగానే ప్రతి ఒక్క భారతీయుడూ తలుచుకోవాల్సింది భారతీయ సైనికుల త్యాగమని à°—à°¤ ఏడాది క్రితం కాశ్మీర్ లోయలోని

పుల్వామా ప్రాంతంలో ముష్కర ఉగ్రవాదులు జరిపిన దాడిలో అమరులైన భారతీయ సైనికులకు ఘన నివాళి అర్పించాలని జన జాగరణ సమితి ప్రతినిధులు పిలుపునిచ్చారు. పుల్వామా

ప్రాంతం నుంచి వెళ్తున్న భారతీయ సైనిక వాహనాలపై దేశ ద్రోహ ఉగ్రవాదులు ఆత్మాహుతి బాంబుల దాడి కారణంగా సుమారు 40 మందికి పైగా అమాయక సైనికులు

అమరులయ్యారన్నారు. 

విశాఖపట్నం లోని వైయస్సార్ పార్క్ వద్ద గురువారం నిర్వహించిన వాలెంటైన్స్ డే అవగాహన నిషేధం కార్యక్రమంలో భాగంగా వాలంటైన్స్ డే కు ఛీ

కొట్టు - సైనికులకు జై కొట్టు కార్యక్రమ పోస్టర్ ను విడుడల చేసారు.  à°ˆ సందర్భంగా జన జాగరణ సమితి రాష్ట్ర కన్వీనర్ కన్వీనర్ మాట్లాడుతూ  à°«à°¿à°¬à±à°°à°µà°°à°¿ 14  - వేలంటైన్స్ డే,

భారతీయ సంస్కృతికి సంప్రదాయాలకు విరుద్ధమైన వాలెంటైన్స్ డే భారతదేశంలో యువత పూర్తిగా నిషేధించాలని పిలుపునిచ్చారు. 
 à°¦à±‡à°¶ వ్యాప్తంగా అరువు తెచ్చుకున్న

పాశ్చాత్య పైత్య ప్రకోపాలా, విచ్చలవిడి దినం పేరు చెప్పగానే తక్షణం గుర్తుకు వచ్చేది లక్షలాదిగా ఛిద్రమైపోయిన కుటుంబాలు అని ఇలాంటి విశృంఖల వాలెంటైన్స్ డేను

బహిష్కరించండి అని జనజాగరణ సమితి పిలుపునిచ్చింది. దేశ వ్యాప్తంగా యువతి యువకులు, వివాహితులు సైతం బరితెగించి రోడ్డెక్కి చిందులేసే దినంగా ఇది భారత దేశం లో

బాగా ఖ్యాతి చెందిందని తెలియచేసింది. ఈ మేరకు విశాఖ మహా నగరం లోని వైఎస్సార్ పార్క్ సాక్షిగా యువతకు జన జాగరణ సమితి సూచనలు చేసింది. ఈ రోజున యువతను తప్పుదారి

పట్టించే విధంగా విదేశీ నమస్కారము దిక్కుమాలిన సంస్కారాన్ని సంప్రదాయాన్ని బలవంతంగా భారతీయ యువతపై రుద్దుతున్నారనిమండిపడ్డారు. 
ఈ ఒక్కరోజు దేశవ్యాప్తంగా

à°…à°­à°‚ శుభం తెలియని à°“ అమాయక యువకులు యువతులు విద్యార్థిని విద్యార్థులు పాశ్చాత్య పోకడలకు బలవుతున్నారన్నారు. 

తల్లిదండ్రులను ప్రేమించలేని వాళ్ళు

జీవచ్ఛవాలే :. . .

ఈ వయసులో తమ భవిష్యత్ కు మంచి బాట వేసేందుకు నిరంతరం కష్టపడుతున్న తల్లిదండ్రులను ప్రేమించలేని వాళ్ళు బ్రతికి ఉన్న జీవచ్ఛవాలేనన్నారు. యువతీ

యువకులు విద్యార్థులు తమ భవిష్యత్తుకు అండగా నిలిచిన తల్లిదండ్రులు కుటుంబ సభ్యుల పట్ల ప్రేమగా ఉండాలి తప్ప తమ తోటి యువతి యువకులతో సన్నిహితం, స్నేహం పేరుతొ

ఒక్కటిగా ఉంటూ బహిరంగ వ్యభిచారానికి పాల్పడడం భారతీయ సంస్కృతికి పూర్తి విరుద్ధమన్నారు. ఇటీవల కాలంలో విశాఖ నగరంలో పాశ్చాత్య పైత్య ప్రకోపాలకు బలవుతున్న

చిన్నారులు కోకొల్లలుగా ఉన్నారు ఈ సంవత్సరం వాలెంటైన్స్ డే రోజున ఒకరితో కనిపించిన యువతి లేదా యువకుడు వచ్చే సంవత్సరం వేరే వాళ్ళతో కలవడం కనిపించడం

సర్వసాధారణంగా మారిందన్నారు.   

à°ˆ విధమైన  à°ªà±ˆà°¤à±à°¯ ప్రకోప వింత పోకడలకు ప్రలోభ పది భారతీయ సంస్కారం సంప్రదాయాలు పూర్తిగా తుంగలోకి తొక్కుతున్నారన్నారు.

 à°µà±à°¯à°¾à°ªà°¾à°°à°¸à±à°¤à±à°²à± తమ వ్యాపార లాభం కోసం ఆధునిక విధాలుగా, యువతను ఆకర్షించే విధంగా వస్తువులను తయారు చేసి యువతను తప్పుదారి పట్టిస్తున్నారన్నారు. చాలా కేసుల్లో

వాళ్ళ పిల్లలు కూడా ఇలాంటి విపరీత పోకడలకు లోనైనా సందర్భాలు కూడా ఉన్నాయన్నారు. 

సోషల్ మీడియా నూ ప్రధాన సాధనంగా: . . . . . . 

ముక్కు మొహం కూడా తెలియని వాళ్ళతో

సోషల్ మీడియా ద్వారా ఆడ, మొగ కూడా పరిచయాలు పెంచుకుని, వారిని వీలయితే శారీరకంగానూ, ఆర్ధికంగానూ వినియోగించుకుంటున్న సందర్భాలు ఎన్నో ఉన్నాయన్నారు. ప్రతి రోజూ

à°’à°• చోట ఇలాంటి సోషల్ మీడియా ద్వారా జీవితాలను నష్టపోయిన ఆడా , మొగ  à°•à±‚à°¡à°¾ పోలీసు స్టేషన్ల చుట్టూ తిరుగుతున్నారన్నారు.  

వివాహితులు కూడానూ : . . . 

ఈ పైత్యం

కేవలం విద్యార్థులకే పరిమితం కాలేదని వివాహితులు సైతం బరితెగించి పెళ్లి చేసుకుని తన బాంధవ్యాన్ని హత్య చేసే వరకూ దారితీస్తోంది అన్నారు ఈ విధమైన చర్యల వల్లే

దేశవ్యాప్తంగా బాలికలు మహిళలపై అఘాయిత్యాలు చోటుచేసుకుంటున్నాయన్నారు. 

ఎట్టి పరిస్థితుల్లోనూ తమ పిల్లలను ఫిబ్రవరి 14న ఇంటి నుంచి బయటకు ఒంటరిగా

పంపవద్దని విశాఖ నగరంలోని తల్లిదండ్రులకు జన జాగరణ సమితి సూచిస్తోంది. ఈ రోజున ఒంటరిగా వెళ్ళినవాళ్ళు మరునాడు జంటగా వచ్చిన ఆశ్చర్యపోనక్కర్లేదు అన్నారు.

పిల్లల బాధ్యత పూర్తిగా చేపట్టవలసిన తల్లిదండ్రులు సైతం నేడు తమ బాధ్యతలను విస్మరించి బిజీ పనుల్లో ఉండటం కారణంగా పర్యవసానాలు విపరీతంగా వస్తున్నాయన్నారు

తాము రాష్ట్ర వ్యాప్తంగా అన్ని విద్యా సంస్థలు పాఠశాలలు లోని పిల్లలకు ఈ పై ఈ విపరీతాలకు దూరంగా ఉండే విధంగా అవగాహన కల్పిస్తున్నామన్నారు.

ఈ కార్యక్రమంలో

జన జాగరణ సమితి ప్రతినిధులు à°¦à°¾à°®à±‹à°¦à°° గుప్త, రత్నాల లోకేష్, ప్రకాష్, చైతన్య, సూర్య, జాన్ à°ªà±†à°¦à±à°¦ సంఖ్యలో విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam