DNS Media | Latest News, Breaking News And Update In Telugu

శాసన మండలి కమిటీ సిక్కోలు ఆలయాల దర్శనం 

అరసవల్లి, శ్రీకూర్మం ఆలయాల సందర్శన 

(DNS రిపోర్ట్ : SV ఆచార్యులు, స్టాఫ్ రిపోర్టర్, శ్రీకాకుళం ). .

శ్రీకాకుళం, ఫిబ్రవరి 13, 2020 (డిఎన్‌ఎస్‌) : ఆంధ్ర ప్రదేశ్ శాసన

మండలి పేపర్స్ లైడ్ ఆన్  à°Ÿà±‡à°¬à±à°²à± కమిటీ ఉత్తరాంధ్ర పర్యటనలో భాగంగా శ్రీకాకుళం జిల్లాలోని ఆలయాలను సందర్శించింది. గురువారం శ్రీకాకుళం జిల్లాలోని అరసవల్లి

లోని శ్రీ సూర్యనారాయణ స్వామి ఆలయం, శ్రీకూర్మం లోని శ్రీకూర్మనాధుని ఆలయాలను సందర్శించారు. రెండు రోజుల క్రితం విశాఖపట్నం లోని సింహాచల క్షేత్రాన్ని ఈ కమిటీ

దర్శించింది. 

కమిటీ అధ్యక్షులు ఎమ్మెల్సీ బాబు రాజేంద్రప్రసాద్, సభ్యులు సింగం శెట్టి సుబ్బయ్య (చిత్తూరు), పోతురెడ్డి పీరయ్య(కడప), ఓరందూరు

సురేంద్ర(నెల్లూరు), వినోద్ రాజు (విశాఖపట్నం) తదితరులు పాల్గొన్నారు. à°°à°¾à°·à±à°Ÿà±à°° ప్రజలకు శ్రీకూర్మనాధుని, శ్రీ సూర్య భగవానుని ఆశీస్సులు ఉండాలని కోరుకున్నట్టు

కమిటీ తెలిపింది. రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని,  à°¸à±‚ర్య భగవానుని ఆశీస్సులతో రాష్ట్రం సన్ రైజ్ స్టేట్ à°—à°¾ ఉండాలని కోరారు.  à°’కే రాష్ట్రం, ఒకే

రాజధాని ఉండాలని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఆలయానికి విచ్చేసిన కమిటీ అధ్యక్షులు, సభ్యులకు ఆలయ అర్చకులు వేదమంత్రాలతో స్వాగతం పలికి పూజలు నిర్వహించారు. కమిటీ

అధ్యక్షులు, సభ్యులకు ఆలయ ఈ ఓ వి.హరిసూర్య ప్రకాష్ ప్రసాదాన్ని, స్వామివారి చిత్రపటాన్ని బహుకరించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో ఎం. వి.రమణ, తహశీల్దార్ దిలీప్

చక్రవర్తి తదితరులు పాల్గొన్నారు.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam