DNS Media | Latest News, Breaking News And Update In Telugu

" సన్ " స్ట్రోక్ - ప్రజలకు తగ్గింది, నేతలకు మొదలైంది. 

వచ్చే ఎన్నికల్లో వీళ్ళ సన్ స్ట్రోక్ ముంచుతుందా? తెంచుతుందా ?

ఎండలు తగ్గినా సన్ స్ట్రోక్ తప్పదా ?

విశాఖపట్నం, జూన్ 26 , 2018 (DNS Online ): ఇటీవల కాలం లో రాజకీయ నాయకులు

( అనేకంటే పార్టీల కోటరీ నేతలు అనడం సబబు) తమ వారసులను ప్రత్యక్ష ఎన్నికల్లోకి దింపే ప్రయత్నాలు విస్తృతం చేస్తున్నారు. వీళ్ళు సాధించేశారు, ఇక వారసులు సాధించాలి

అనే ధోరణిలో భిన్న అభిప్రాయాలూ వ్యక్తమవుతున్నాయి. వేసవి లో మండే ఎండలు తగ్గడంతో సన్ స్ట్రోక్ బారీన పడకుండా తప్పించుకున్నాం అనే ఆనందం లో ప్రజలు ఉంటే, నేతల

వారసుల రంగ ప్రవేశం తో ఆ సన్ స్ట్రోక్ రాజకీయ ప్రతినిధులకు తగులుకుంది. దశాబ్దాల కాలం రాజీకీయంగా ఉన్నాం అనుకునే వీరి వాళ్ళ ప్రజలకు ఎంతవరకూ మేలు జరిగిందో

తెలియాలి అంటే వీళ్ళ వారసుల పై ప్రజలు చూపించే ఆదరణే తెలియచేస్తుంది. ఇప్పడికే రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు వారసుడు లోకేష్ మంత్రిగా భాద్యతలు చేపట్టగా,

విశాఖ జిల్లా పరిధిలో పెందుర్తి ఎం ఎల్ ఏ బండారు సత్యనారాయణ మూర్తి కొడుకు అప్పల నాయుడు ఇప్పడికే నియోజకవర్గం లో పాగా వేయడం జరిగింది. యలమంచిలి నియోజకవర్గం

సీనియర్ నేత కన్నబాబు కుమారుడు ఇప్పడికే సహకార బ్యాంకు అధ్యక్షునిగా రంగ ప్రవేశం చేసేసారు. ఈ నేపథ్యం లో రాష్ట్ర మానవ వనరుల శాఖా మంత్రి గంటా శ్రీనివాసరావు

వారసునిగా గంటా రవి సోమవారం ముహూర్తం పెట్టుకుని మరీ భీమిలి నియోజక వర్గం లోని కార్యాలయం లో ప్రజా ప్రతినిధులు, పార్టీ ప్రతినిధులతో సమావేశం మొదలెట్టేసారు.

వారసులైతే రంగ ప్రవేశం చేశారు గానీ, వీళ్ళని ఎంతవరకూ ప్రజలు ఆదరిస్తారు అనేది అనుమానం గానే ఉంది. అత్యంత రసవత్తర పోటీ నెలకొనియున్న నేపధ్యం లో మా తాతలు నేతులు

త్రాగారు మా మూతులు వాసన చూడండి అంటే వినే రోజులు కావివి. ఎవరి వరకూ వారే ఈ ప్రజాక్షేత్రం లో నెగ్గుకు రావాల్సిన పరిస్థితులు. మహా మహులుగా చెప్పుకునే నేతలకే

ఎన్నికల్లో చుక్కలు చూపించిన ఘనులు ఓటర్లు. పార్టీ కార్యక్రమాల వరకూ అయితే వినడానికి బాగానే ఉంటుంది. ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ అంటే నే చుక్కలు కనపడే

అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాల పరిస్థితి ఏమంత సానుకూలంగా లేవు. పైగా విభక్త ఆంధ్ర ప్రదేశ్ లో పరిస్థితులు వీళ్ళకి ఏమాత్రం అనుకూలంగా లేవు అనే

చెప్పాలి. కేంద్రం సహకారం లేకుంటే రాష్ట్రం లో నెగ్గుకు రావడం కష్టమే, రాజకీయ సమీకరణాలు మారినా, మూడో కూటమి ప్రాంతీయ పార్టీలకు అనుకూలంగా ఉంటుంది అని

చెప్పేందుకు ససేమిరా అంటున్నాయి రాజకీయ పార్టీలు. 

కాలం మారింది... :

గత దశాబ్ద కాలం క్రితం పరిస్థితులను పరిశీలిస్తే. . . .ప్రజల్లో ఎనలేని ఆదరణ ఉన్న నాటి

అగ్రనేతలు రాజీవ్ గాంధీ / సోనియా వారసునిగా à°°à°‚à°—à°‚ లోకి వచ్చిన రాహుల్ గాంధీ,,  à°¨à±‡à°Ÿà°¿à°•à±€ విజయం సాధించలేక పోయారన్నది సత్య దూరం కాదు.  à°‡à°• ఆంధ్ర ప్రదేశ్ లో అత్యంత ఆదరణ

కల్గిన నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి వారసునిగా రాజకీయ రంగ ప్రవేశం చేసిన వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి, ఈ ప్రజా క్షేత్రం లో నిలదొక్కుకునేందుకు నాటి నుంచి విశ్వ

ప్రయత్నం చేస్తూనే ఉన్నాయి. అయినప్పటికీ విజయం సాధించారా అంటే చెప్పడం కష్టమే. అలాంటిది ఏ మాత్రం ఆదరణ లేని మంత్రులు, స్థానిక ఎం ఎల్ ఏ ల వారసులకు రానున్న కాలం

గడ్డుకాలమనే చెప్పాలి. ఏటికి ఎదురొడ్డి తే తప్ప నిలదొక్కుకోవడం, ఆపై విజయం సాధించడం దాదాపు అసాధ్యమే అని విశ్లేషకుల అభిప్రాయం.

 

 

pix : Courtesy to whom so ever it may concern

For more details Click Here. All Copy Rights Reserved with DNS Media.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam