DNS Media | Latest News, Breaking News And Update In Telugu

మహాశివరాత్రి కి గోదావరి ప్రాంతం లో భారీ ఏర్పాట్లు 

రాజమహేంద్రవరం అన్ని ఘాట్ల లోనూ భద్రత తీవ్రతరం  

(DNS రిపోర్ట్ : పి. రాజా, Spl కరస్పాండెంట్ అమరావతి): . . .

అమరావతి, ఫిబ్రవరి 13, 2020 (డిఎన్‌ఎస్‌) : భక్తులకు ఎటువంటి

అసౌకర్యం కలుగకుండా మహా శివరాత్రి ఏర్పాట్లు చేయాలని తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్ డి.మురళీధర్ రెడ్డి సూచించారు.గురువారం రాజమహేంద్రవరం సబ్ కలెక్టర్

కార్యాలయంలో మునిసిపల్, రెవెన్యూశాఖ, పోలీస్ శాఖ, ఆర్ అండ్ బి శాఖ, దేవాదాయ ధర్మదాయ శాఖ అధికారులతో మహా శవరాత్రి పండుగ ఏర్పాట్లు సమీక్షించారు.ఈ సందర్భంగా

కలెక్టర్ మాట్లాడుతూ పుష్కరఘాట్, కోటిలింగాల ఘాట్ ఇంకా గోదావరి పరివాహక ప్రాంతాలలో భక్తులకు స్నానాలు చేయుటకు అనువుగా ఉండేలా చూడాలని తెలిపారు.అవసరమైన చోట్ల

బారికేడ్లు ఏర్పాటు చేయాలని అన్నారు.శివాత్రి రోజు తెల్లవారుజామున భక్తులకు స్నానాలు చేయడం జరుగుతుంది ఆ సమయనికి అవసరాన్ని బట్టి విద్యుత్ లైట్లు ఏర్పాటు

చేయాలని అన్నారు.గజాఈత గాళ్లను ముందుగా నియమించు కోవాలని సూచింనచారు.దేవాలయాలు వద్ద దర్శనానికి,ప్రసాదాలు ఎటువంటి ఇబ్బందులు ఎదురవ్వకుండ జాగ్రత్తలు

తీసుకోవాలి అన్నారు.పట్టిసీమ దేవాలయానికి వెళ్లే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూడాలని అన్నారు.అక్కడ పోలీస్ సిబ్బంది,రెవిన్యూ సిబ్బంది మోనోటరింగ్

చేయాలని అన్నారు.ఎక్కడ ఎటువంటి అవాంతరాలు లేకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలి అన్నారు. అవసరమైన చోట మెడికల్ క్యాంపు ఏర్పాటు చేయాలని అన్నారు.కార్యక్రమంలో

రాజానగరం శాసన సభ్యులు జక్కంపూడి రాజా, సబ్-కలెక్టర్ ఆర్.మహేష్ కుమార్, కమిషనర్ అభిశక్తి కిషోర్, అర్బన్ ఎస్.పి.షిమోషీ బాజిపై, ఆకుల వీరాజు, డి.ఎస్.పి - సంతోష్, ఆర్&బి

ఈ.ఈ- టి.సత్యనారాయణ,డాక్టర్లు పి.కోమలి, వినూత్న, అర్బన్ తహసీల్దార్ సుస్వాగతం తదితరులు పాల్గొన్నారు.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam