DNS Media | Latest News, Breaking News And Update In Telugu

పుల్వామా అమరులకు విశాఖలో జవాన్ల స్మృతి ర్యాలీ 

అమర వీరులకు జనసేన à°‰à°·à°¾à°•à°¿à°°à°£à± ఘన నివాళి. . .

(DNS రిపోర్ట్ : BVS గణేష్, స్టాఫ్ రిపోర్టర్, విశాఖపట్నం) : . . .

విశాఖపట్నం, ఫిబ్రవరి 15, 2020 (డిఎన్‌ఎస్‌) : గతేడాది ఫిబ్రవరి 14, à°¨ లో

జరిగిన కాశ్మీర్ లోని  à°«à±‚ల్వామా లో భారత సైనికుల స్థావరాలపై జరిగిన దాడిలో మరణించిన 40 మంది అమర జవాన్ల కు విశాఖపట్నం ఉత్తర నియోజకవర్గ జనసైనికులు ఘననివాళి

అర్పించారు. శుక్రవారం విశాఖపట్నం లోని అక్కయ్యపాలెం లో గల 80 అడుగుల రోడ్డులో జరిగిన కార్యక్రమం లో జనసేన ఇంచార్జి పి ఉషాకిరణ్ నేతృత్వంలో జనసైనికులు జై జవాన్

జై భారత్ నినాదాలు చేసారు. వీరికి నివాళిగా జవాన్ల స్మృతి ర్యాలీ ని గత ఏడాది ఘటన జరిగిన సమయంలోనే మధ్యాహ్నం 3 గంటల 15 నిమిషాలకు జనసేన పార్టీ అక్కయ్యపాలెం 80 ఫీట్

రోడ్డు జంక్షన్ నుండి అక్కయ్యపాలెం మహారాణి పార్లర్ జంక్షన్ వరకు ర్యాలీను నిర్వహించారు. 
ఈ సందర్బంగా ఉత్తర నియోజకవర్గ జనసైనికులు, వీరమహిళలు, విద్యార్ధులతో

పాల్గొన్న ఈ ర్యాలీ లో పసుపులేటి ఉషాకిరణ్ మాట్లాడుతూ... దేశం కోసం జవాన్లు చేసిన త్యాగాలు ను గుర్తించి వారిని స్మరిస్తూ మన భావితరాలకు వారి సేవ ను , వారి

కుటుంబాలకు రక్షణ గా 130 కోట్ల దేశ ప్రజలు ఉంటారని విశ్వాసం కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో బొడ్డేపల్లి రఘు గారు మాట్లాడుతూ ... దేశ రక్షణ లో శత్రువులకు భారత

ఆర్మీ ధీటుగా జవాబు చెవుతున్నారని, వారి విధి నిర్వహణలో 40 మందీని మానవ బాంబు తో పేల్చిన ఫూల్వామా ఘటన ను దేశ ప్రజలు మర్చిపోరని , వారిని సదా స్మరించుకుని , కాశ్మీర్ లో

రాత్రి పగలు తేడా లేకుండా దేశ రక్షణ లో భాగస్వామ్యం అయిన వారికి జనసైనికులు , దేశ ప్రజలు , అభిమానులు, ప్రజలు అందరూ పాదాభివందనం చేస్తున్నారని తెలిపారు. ఈ 80 ఫీట్

రోడ్డు జంక్షన్ వరకు జరిగిన ర్యాలీ లో సినీయర్ నాయకులు విఠల్ , జనసైనికులు పి. పరమేష్, కృష్ణమరాజు, మోహన్ శివరాం, సతీష్ , అనిల్, శాంత కుమార్, ఆంటోనీ, భాషా, స్కూల్

విద్యార్థులు, జనసేన ఉత్తర నియోజకవర్గం కార్యకర్తలు పాల్గొన్నారు.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam