DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ఆయుష్ వైద్య శాలలు బలోపేతం చేస్తాం: ఉష కుమారి.

(DNS రిపోర్ట్ : పి. రాజా, Spl కరస్పాండెంట్ అమరావతి)

అమరావతి, ఫిబ్రవరి 14, 2020 (డిఎన్‌ఎస్‌) : డిస్పెన్సరీలన్నింటిని బలోపేతం చేసేందుకు అన్ని చర్యలు తీసుకుంతున్నామని

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆయుష్ వైద్య శాఖ కమీషనర్ పి.ఉష కుమారి అన్నారు.శుక్రవారం తూర్పుగోదావరి, పచ్ఛిమగోదావరి జిల్లాల (జోన్-2 ) ఆయుష్ డాక్టర్లకు అవగాహనా సదస్సు

తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం లోని ఆనంద రీజెన్సీ నందు కమీషనర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాష్ట్రంలో ఉన్న ఆయుష్

డిస్పెన్సరీలన్నింటిని బలోపేతం చేయడం జరుగుతుందని వీటి అవసరాలను ఉపయోగించుకొంటు ప్రజలకు మెరుగైన వైద్య సేవల అందించాలని అన్నారు.డిస్పెన్సరీల నుండి

ఓ.పి.శాతం పెంచాలని ప్రజలకు అవగాహన కల్పించాలని అన్నారు.డిస్పెన్సరీ పరిసర ప్రాంతాలలో క్యాంపు లు నిర్వహించాలని అన్నారు.గతంలో ఆయెర్వేదం,హోమోయోపతి కి ఎంతో

పేరు ఉండేదని ఇంగ్లీష్ మందులు వచ్చాక వాటికి ఆదరణ తగ్గిందని అన్నారు.ఆయుర్వేదం,హోమియోపతి వైద్యం పెంచేందుకు అన్నివిధాల కృషి చేయాలని అన్నారు.డిస్పెన్సరీలకు

సకాలంలో డాక్టర్లు, సిబ్బంది చేరుకొని వచ్చిన వారికి మెరుగైన వైద్య సేవలు అందించా గలగాలని అన్నారు. భాద్యత యుతంగా ఉండి పూర్తి సేవల ప్రజలకు అందించాలని అన్నారు.

రాష్ట్రంలో 729 ఆయుష్ డిస్పెన్సరీలు పనిచేస్తున్నాయని తెలిపారు.రాష్ట్ర,కేంద్ర ప్రభుత్వలనుండి వచ్చే నిధులతో స్థానికంగా అవసరమైన మందులు కు ఉపయోగించాలని

అన్నారు.డిస్పెన్సరీలకు అవసరమగు ప్రాథమిక ప్రాధాన్యతలపై మాకు తెలుయజేయలని అన్నారు. కార్యక్రమంలో ఆయుష్ వైద్య శాఖ అదనపు డైరెక్టర్ డాక్టర్ శాస్ట్రీ,

ఆర్.డి.డి.డాక్టర్ ప్రసాద్, రాజమహేంద్ర వరం హోమియోపతి కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ స్వామి, డాక్టర్ కే. విజయకుమారి తదితరులు పాల్గొన్నారు.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam