DNS Media | Latest News, Breaking News And Update In Telugu

బాబు రాజకీయ చరిత్ర చరమాంకానికి వచ్చేసింది : మంత్రి బొత్స 

(DNS రిపోర్ట్ : సాయిరాం CVS , బ్యూరో , విశాఖపట్నం )

విశాఖపట్నం, ఫిబ్రవరి 14, 2020 (డిఎన్‌ఎస్‌) : చంద్రబాబు, ఆయన బినామీల పై వస్తున్న ఆరోపణలు, వేల కోట్ల రూపాయల కుంభకోణాలు

తదితర అంశాల బట్టి చొస్ట్ బాబు రాజకీయ చరిత్ర చరమాంకానికి వచ్చేసిందని రాష్ట్ర మునిసిపల్ శాఖామంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. శుక్రవారం విశాఖపట్నం లోని

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో అయన మాట్లాడుతూ వీటిపై సమగ్రంగా విచారణ జరపాలని ఈ కుంభకోణాలపై చంద్రబాబే తనకు తానుగా

విచారణ కోరాల్సియుందన్నారు.   రూ. 2 వేల కోట్ల అక్రమాలు బయటకు రావడంతో తండ్రీ కొడుకులిద్దరూ హడావుడిగా హైదరాబాద్ వెళ్ళారన్నారు. ఇప్పటికైనా చంద్రబాబు నోరు

విప్పాలని, తన మాజీ వ్యక్తిగత సహాయకుని పై ఐటీ దాడులకు టీడీపీకి  à°¸à°‚బంధం ఏమిటి అని మాట్లాడుతున్న వాళ్ళకు కూడా బాగా తెలుసునన్నారు. పట్టుబడిన వాళ్లంతా ఎవరని,  à°ˆ

కంపెనీలు ఎవరివని . శ్రీనివాస్ ఎవరు.. ఈ అంశాలన్నీ అందరికి తెలిసిన విషయమేనన్నారు. దీనిపై సమగ్ర విచారణ జరిగితే చంద్రబాబు ఎక్కడ ఉంటారో.. ఐటీ సోదాలపై టీడీపీ

అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు, ఆయన తనయుడు లోకేష్‌ ఏం సమాధానం చెప్తారని మున్సిపల్‌ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ప్రశ్నించారు. విజయవాడ,హైదరాబాద్ సహా ఢిల్లీ,

పుణెలలో కూడా సోదాలు జరిగాయని, మొత్తం 40కిపైగా ప్రాంతాల్లో ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారన్నారు. 
చంద్రబాబు మాజీ పీఎస్‌ వద్దనే రూ. 2 వేల కోట్లు బయటపడితే..

అక్రమాలు ఏ స్థాయిలో జరిగాయో గమనించాలని ప్రజలను కోరారు. చంద్రబాబు, టీడీపీ నేతలు పంచభూతాలను పంచుకుని తినేశారని విమర్శించారు. చంద్రబాబు చేసేవన్నీ దొంగ పనులని

విమర్శించిన బొత్స.. అక్రమ లావాదేవీలపై ఆయన నోరు విప్పాలని సవాలు విసిరారు. చంద్రబాబు రాజకీయ జీవితం ముగిసిందన్నారు.

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam