DNS Media | Latest News, Breaking News And Update In Telugu

బిజెపి జనసేన సంయుక్త గానే ఎన్నికల్లో పోటి చేస్తాయి: సునీల్ దేవధర్

వైకాపా, టిడిపి అందరూ ప్రత్యర్థులే, మిత్రులు కారు 

ఒక రాష్ట్రం - ఒకటే రాజధానికే కట్టుబడి ఉన్నాం:. .

రాష్ట్ర  à°¬à±€à°œà±‡à°ªà±€ ఇంచార్జి సునీల్ దేవధర్

ప్రకటన 

త్వరలోనే పట్టాలెక్కనున్న రైల్వే జోన్ :.  . .

మండలి రద్దు - సమంజసం కాదు : మాధవ్. .

(DNS రిపోర్ట్ : సాయిరాం CVS , బ్యూరో , విశాఖపట్నం): . . .

విశాఖపట్నం,

ఫిబ్రవరి 15, 2020 (డిఎన్‌ఎస్‌) : త్వరలో జరగనున్న స్థానిక ఎన్నికలు మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ జనసేన సంయుక్తంగా కలిసి పోటీ చేస్తాయని బిజెపి

ఆంధ్రప్రదేశ్ ఇంచార్జి సునీల్ దేవధర్ ప్రకటించారు.  à°¶à°¨à°¿à°µà°¾à°°à°‚ విశాఖ పర్యటనకు వచ్చిన ఆయన స్థానిక పార్టీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో

మాట్లాడుతూ తమ పార్టీ పవన్ కళ్యాణ్ నాయకత్వంలోని జనసేన పార్టీ తోనే ప్రత్యక్ష సన్నిహిత సంబంధాలను కలిగి ఉందని ఇతర పార్టీలతో తమకు ఎటువంటి సంబంధం లేదని తేల్చి

చెప్పారు. గత రెండు రోజుల క్రితం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి భారత ప్రధానమంత్రి నరేంద్రమోడీని కలవడం తదుపరి నిన్నటి రోజున హోం శాఖ మంత్రి

అమిత్ à°·à°¾ ను కలవడం రాష్ట్ర రాజకీయాల్లో పెను దుమారం లేపింది అన్నారు. అయితే రాజకీయ విశ్లేషకులు ప్రతిపక్ష పార్టీల సొంత ఆలోచనలను బీజేపీ  à°…ంటకట్టే విధంగా

బిజెపి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీతో కలిసి పనిచేసే  à°•à°¾à°°à±à°¯à°¾à°šà°°à°£ అనడం హాస్యాస్పదంగా ఉందన్నారు. à°’à°• ముఖ్యమంత్రి ప్రధాన మంత్రిని కలిసిన హోం శాఖ మంత్రిని కలిసిన

అది రాష్ట్ర ప్రయోజనాల కోసమే ఉంటుంది తప్ప పార్టీల కొనసాగింపు కోసం కాదన్నారు. 
ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ కు కేంద్రం నుంచి రావాల్సిన ప్రాజెక్టులు నిధులు అన్నీ

చేశామన్నారు.  à°—తంలో నాటి ప్రధాన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన కుటిల బుద్ధితో అవాకులు చవాకులు మీడియా ద్వారా నోటికి వచ్చిన అబద్ధాలు అని చెప్పడం ద్వారా à°ˆ

రాష్ట్ర ప్రజలు ప్రధానమంత్రి ప్రధానమంత్రి పట్ల కొంత వ్యతిరేక భావం చోటు చేసుకుందన్నారు. అయితే నరేంద్ర మోడీ చేపట్టిన కార్యాచరణతో చంద్రబాబు నాయుడు చేసిన విష

ప్రచారాన్ని ప్రజలు పటాపంచలు చేశారన్నారు. దేశ భద్రత కోసం నరేంద్ర మోడీ చేసిన కార్యాచరణ ద్వారా దేశ ప్రజలు అందరిలోనూ ఆయనకు ఉన్నత స్థానం లభించింది అన్నారు. 
/> ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తమ బిజెపికి తెలుగుదేశం ఎంత దూరంలో ఉంటుందో అధికార వైయస్సార్ కాంగ్రెస్ కూడా అంతే దూరంలో ఉంటుంది అన్నారు రాష్ట్ర ప్రయోజనాల కోసం ఏ

పార్టీతో ఆయా సందర్భాలను బట్టి మాత్రమే బిజెపి వ్యక్తం చేస్తున్నారు చంద్రబాబు నాయుడు ఐదేళ్ల కాలంలో రూ. 250000 కోట్లు అప్పులు చెయ్యగా వైయస్ జగన్మోహన్ రెడ్డి ఏడు

నెలల కాలంలోనే 50 వేల కోట్లకు పైగా అప్పులు చేశారన్నారు.  à°•à±‡à°‚ద్రం à°ˆ అప్పులకు బాధ్యత వహించ దన్నారు.  à°‡à°ªà±à°ªà°Ÿà°¿à°•à±‡ కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన

ప్రాజెక్టులు కేటాయించడం జరిగిందన్నారు. 

ఒక రాష్ట్రం - ఒకటే రాజధానికే కట్టుబడి ఉన్నాం:. .

భారతీయ జనతా పార్టీ మొదటి నుంచే ఒక మాటకే కట్టుబడి ఉందని, ఒక

రాష్ట్రం - ఒక్కటే రాజధాని అని అన్నారు. అమరావతి ని అభివృద్ధి పరచవలసిన అవసరం ఎంతైనా ఉందన్నారు. రైతులకు అన్యాయం జరుగకుండా త్వరలోనే బీజేపీ ప్రత్యక్ష

కార్యాచరణకు దిగుతుందన్నారు. 

మండలి రద్దు - సమంజసం కాదు : మాధవ్. . .

అర్ధాంతరం గా శాసన మండలి రద్దు ప్రక్రియ సమంజసం కాదని, ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీ పివిఎన్

మాధవ్ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం మూడు రాజధానుల అంశాన్ని మండలి లో అడ్డుకున్నందుకు రద్దు ప్రక్రియను తెరపైకి తెచ్చిందన్నారు. 

త్వరలోనే

పట్టాలెక్కనున్న రైల్వే జోన్ :.  . .

నరేంద్ర మోడీ గత ఎన్నికల్లో ఇచ్చిన హామీ విశాఖపట్నం కేంద్రంగా ప్రత్యేక రైల్వే జోన్. ఆ మాటను నిలబెట్టుకుంటూ గత న్నికల

సమయంలోనే విశాఖపట్నం కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే ను కేటాయిస్తున్నట్టు మోడీ ప్రభుత్వం ప్రకటన చేసిందన్నారు. ఇప్పడికే ఈ జోన్ కు సంబంధించి సంపూర్ణ సమగ్ర

ప్రణాళిక ( డిపిఆర్) ను కేంద్రానికి సమర్పించడం జరిగిందన్నారు. త్వరలోనే దక్షిణ కోస్త రైల్వే పట్టాలెక్కనుందన్నారు. 

ఈ సమావేశంలో మాజీ ఎంపీ దగ్గుబాటి

పురంధరేశ్వరి మాజీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు,  à°¤à°¦à°¿à°¤à°°à±à°²à± పాల్గొన్నారు.

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam