DNS Media | Latest News, Breaking News And Update In Telugu

సిట్ బృందానికి అదనంగా మరో ముగ్గురు సభ్యులు నియామకం

సిట్ బృందం అధ్యక్షులు విజయ్ కుమార్

(DNS రిపోర్ట్ : సాయిరాం CVS , బ్యూరో , విశాఖపట్నం): . . .

విశాఖపట్నం, ఫిబ్రవరి 15, 2020 (డిఎన్‌ఎస్‌) : విశాఖ భూ కుంభ కోణం దర్యాప్తు

చేసేందుకు నియమించబడిన  à°¸à°¿à°Ÿà± బృందానికి అదనంగా మరో ముగ్గురు సభ్యులను ప్రభుత్వం నియమించిందని సిట్ బృందం అధ్యక్షులు విజయ్ కుమార్ వెల్లడించారు. శనివారం

కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో సిట్ బృందం  à°µà°¿à°²à±‡à°–రులతో మాట్లాడారు. à°ˆ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జనవరి నెలతో సిట్ బృందం గడువు ముగియడంతో మరో మూడు నెలలు

ప్రభుత్వం పెంచినట్లు పేర్కొన్నారు. దర్యాప్తు త్వరితగతిన చేసేందుకు అదనంగా మరో ముగ్గురు సభ్యులను ప్రభుత్వం నియమించినట్లు చెప్పారు. ఇందులో అదనంగా

రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఛత్తీస్ఘడ్ కేడరు కు చెందిన కె. దుర్గానంద్ ప్రసాద్ రావు, నగర పోలీసు కమిషనర్ రాజీవ్ కుమార్ మీనా, అటవీ శాఖ చీఫ్ కన్జ్ర్వేట్ ఆఫ్ ఫారెస్టు

రాహుల్ పాండే లను నియమించినట్లు తెలిపారు. ఏప్రిల్ తో గడువు ఉందన్నారు. సిట్ కు మొత్తం 1400 దరఖాస్తులు రాగా ఇప్పటి వరకు 400 దర్యాప్తు చేసినట్లు చెప్పారు. ఇంకా 1000

దరఖాస్తులు దర్యాప్తు చేయాల్సి ఉందన్నారు. దర్యాప్తు త్వరితగతిన చేయనున్నట్లు తెలిపారు.
అంతకు ముందు అధికారులతో సిట్ బృందం సమీక్షించింది.  à°ˆ సమావేశంలో సిట్

బృందం సభ్యులు వై. వి. అనూరాధ, టి. భాస్కరరావు, జిల్లా కలెక్టర్ వి వినయ్ చంద్, నగర పోలీసు కమిషనర్ రాజీవ్ కుమార్ మీనా, జివిఎంసి కమిషనర్ డాక్టర్ జి సృజన, విఎంఆర్డిఏ

కమిషనర్ కోటేశ్వరరావు, సిసిఎజిల్లా అటవీ అధికారి సెల్వం, డిసిపి రంగారెడ్డి, జిల్లా రెవెన్యూ అధికారి ఎం శ్రీదేవి, ఉప కలెక్టర్ శైలజ, తదితరులు పాల్గొన్నారు.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam