DNS Media | Latest News, Breaking News And Update In Telugu

మాఘ మాసం అత్యంత పవిత్రం : చిన్న జీయర్ స్వామి 

సూర్య ఆరాధన, హిందూధర్మ వైశిష్ట్యం పై అనుగ్రహ భాషణం 

స్వామిజి మందస బ్రహ్మోత్సవాలకు  à°ªà±à°°à°¯à°¾à°£à°‚ :. .. 

(DNS రిపోర్ట్ : సాయిరాం CVS , బ్యూరో , విశాఖపట్నం) ; . . .

.

విశాఖపట్నం, ఫిబ్రవరి 16, 2020 (డిఎన్‌ఎస్‌) : మాసాల్లో అత్యంత పవిత్రమైన మాసం మాఘమాసమని ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త, ఉభయ వేదాంత ఆచార్య పీఠాధిపతులు చిన్న జీయర్ స్వామి

తెలిపారు. ఆదివారం విశాఖపట్నం నగరంలోని ఎంవిపి కొలని లో à°—à°² à°’à°• 
ఆలయ 25 à°µ  à°µà°¾à°°à±à°·à°¿à°•à±‹à°¤à±à°¸à°µ వేడుకలలో అయన పాల్గొన్నారు. à°ˆ సందర్బంగా ఆయన భక్తులనుద్దేశించి హిందూ ధర్మ

వైశిష్ట్యం - సూర్య ఆరాధన పై అనుగ్రహ భాషణం చేసారు.  à°ˆ సందర్భంగా ఆయన మాట్లాడుతూ à°ˆ మాసం లో సూర్య ఆరాధన చేయడం వలన లభించే ఫలితాలను వివరించారు. పూర్వకాలం నుంచి

మహర్షులు సూర్య ఆరాధన చేయడం ద్వారా ఎన్నో దైవానుగ్రహ శక్తులను సాధించగలిగారన్నారు. నేటికీ ఆరోగ్యం కోసం సూర్య నమస్కారాలు చెయ్యాలని, సూర్యోదయానికి ముందే

నిద్ర లేచి, కాలకృత్యాలు తీర్చుకుని, ఉదయించే సూర్యునికి ఎదురుగా నిలబడడం ద్వారా డి విటమిన్ లభించి, మనిషి మంచి ఆరోగ్యం లభిస్తుందన్నారు. అంతకు ముందు అర్చకులు

స్వామిజి à°•à°¿ పూర్ణకుంభం స్వాగతం పలికారు. అనంతరం ఆలయంలోని మూలవరులను, ఇతర పరివారదేవతల దర్శనం చేసుకున్నారు. 

స్వామిజి మందస బ్రహ్మోత్సవాలకు  à°ªà±à°°à°¯à°¾à°£à°‚ : . .

à°ˆ ఆలయం లో కార్యక్రమం అనంతరం చిన్న జీయర్ స్వామిజి శ్రీకాకుళం జిల్లా లోని మందస గ్రామం లో వేంచేసిన స్వామిజి మందస వాసుదేవ పెరుమాళ్ ఆలయ 11  à°µ

బ్రహ్మోత్సవాలలో పాల్గొనేందుకు ప్రయాణమయ్యారు. 14 వ శతభిడానికి చెందిన మందస ఆలయాన్ని చిన్న జీయర్ స్వామి ప్రత్యక్ష పర్యవేక్షణ లో జీర్ణోద్ధరణ చేసి, ఆలయంలో

ఆరాధనలు జరిగే విధంగా ఏర్పాట్లు చేసారు. ప్రస్తుతం వీరి శిష్యులు జీయర్ల పర్యవేక్షణలో  à°ˆ నెల 13 నుంచి à°† ఆలయంలో బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. సోమవారం జరుగనున్న

కల్యాణ మహోత్సవం లో పాల్గొనున్నారు.    

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam