DNS Media | Latest News, Breaking News And Update In Telugu

సామాన్య ప్రజానీకానికి భాష అందుబాటులో ఉండాలి: యార్లగడ్డ 

(DNS రిపోర్ట్ : SV ఆచార్యులు, స్టాఫ్ రిపోర్టర్, శ్రీకాకుళం ). .

శ్రీకాకుళం, ఫిబ్రవరి 17, 2020 (డిఎన్‌ఎస్‌) : సామాన్య ప్రజానీకానికి పాలనా భాష అందుబాటులో ఉండాలని రాష్ట్ర

అధికార భాషా సంఘం అధ్యక్షులు ఆచార్య యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ అన్నారు. శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ప్రభుత్వ శాఖల్లో చేపడుతున్న ఉత్తర

ప్రత్యుత్తరాల తీరును సోమవారం అధికార భాషా సంఘం పరిశీలించింది. అనంతరం మీడియా ప్రతినిధులతో అధ్యక్షులు లక్ష్మీప్రసాద్ మాట్లాడుతూ పాలనా భాష సామాన్య

ప్రజానీకానికి అర్ధం కావాలన్నారు. అప్పుడే ప్రతి ఒక్కరికి న్యాయం జరుగుతుందని పేర్కొన్నారు. న్యాయస్ధానాలు, కార్యాలయాల పనుల్లో తెలుగు వాడకం జరగాలని చెప్పారు.

శ్రీకాకుళం జిల్లాలో 75 శాతం మేర పాలనా భాషగా తెలుగు వినియోగం ఉందని ఆ మేరకు సంతృప్తి వ్యక్తం చేసారు. జిల్లాలో శత శాతం తెలుగును ఉత్తర ప్రత్యుత్తరాలలో,

దస్త్రాల్లో వినియోగిస్తున్న సమాచార పౌర సంబంధాల శాఖ (డిపిఆర్ఓ కార్యాలయం), డివిజనల్ పౌరసంబంధాల అధికారి కార్యాలయం, జిల్లా నీటి యాజమాన్య సంస్థ, వజ్రపు కొత్తూరు

ఎంపిడిఓ కార్యాలయాలను అధ్యక్షులు అభినందిస్తున్నట్లు చెప్పారు. ఉత్తరాంధ్ర మూడు జిల్లాల్లో బడుగు బలహీన వర్గాలు, వెనుకబడినవారు ఎక్కువగా ఉన్నారని, అటువంటి

వర్గాలకు తెలుగును అధికార భాషగా ఉపయోగించడం ఎంతో మేలు జరుగుతుందని చెప్పారు. ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను సైతం ప్రజలు సులభంగా అర్ధం చేసుకుని ప్రయోజనం

పొందగలరని పేర్కొన్నారు. తెలుగును అత్యధికంగా ఉత్తర ప్రత్యుత్తరాల్లో పాలనా భాషగా ప్రోత్సహించాలని అన్నారు. ఆంగ్ల భాషా వ్యామోహంతో ఆంగ్ల భాష వినియోగం

అధికంగా చేస్తున్నారని పేర్కొన్నారు. తెలుగును వినియోగించగలిగే పరిస్ధితిలో ఉండి కూడా ఆంగ్లాన్ని వినియోగించడం జరుగుతుందని దానిని తగ్గించాలని సూచించారు.

ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశపెట్టినా తెలుగుని తప్పనిసరి చేసారని అధ్యక్షులు చెప్పారు. బడుగు బలహీన వర్గాల ప్రజలు తమ పిల్లలకు ఆంగ్ల మాధ్యమం

కావాలని కోరారని దానికి స్పందించి ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ప్రవేశ పెట్టారని, తద్వారా తెలుగు భాషకు నష్టం లేదని ఆయన స్పష్టం చేసారు.
 à°ˆ మీడియా ప్రతినిధుల

సమావేశంలో రాష్ట్ర భాషా సంఘం సభ్యులు ఆచార్య చందు సుబ్బారావు, మోదుగుల పాపిరెడ్డి, ఆచార్య షేక్ మస్తాన్, ఆచార్య శరత్ జ్యోత్స్న రాణి, తనిఖీ అధికారి లక్ష్మీ కుమారి,

జిల్లా రెవెన్యూ అధికారి బలివాడ దయానిధి, సంఘం సమన్వయ అధికారి మరియు బిసి కార్పొరేషన్ ఇడి జి.రాజారావు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam