DNS Media | Latest News, Breaking News And Update In Telugu

పాలనా భాషగా తెలుగుకు ప్రాధాన్యత: డాక్టర్ యార్లగడ్డ 

(DNS రిపోర్ట్ : SV ఆచార్యులు, స్టాఫ్ రిపోర్టర్, శ్రీకాకుళం ). .

శ్రీకాకుళం, ఫిబ్రవరి 17, 2020 (డిఎన్‌ఎస్‌) :  à°ªà°¾à°²à°¨à°¾ భాషగా తెలుగుకు అత్యంత ప్రాధాన్యతను ఇవ్వాలని  à°°à°¾à°·à±à°Ÿà±à°°

అధికార భాషా సంఘం అధ్యక్షులు ఆచార్య యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ అన్నారు. శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ప్రభుత్వ శాఖల్లో చేపడుతున్న ఉత్తర

ప్రత్యుత్తరాల తీరును సోమవారం అధికార భాషా సంఘం పరిశీలించింది. ఈ సందర్భంగా అధ్యక్షులు లక్ష్మీప్రసాద్ మాట్లాడుతూ తెలుగును అత్యధికంగా ఉత్తర

ప్రత్యుత్తరాల్లో వినియోగించాలని అన్నారు. ఆంగ్ల భాషా వ్యామోహంతో ఆంగ్ల భాష వినియోగం అధికంగా చేస్తున్నారని పేర్కొన్నారు. తెలుగును వినియోగించగలిగే

పరిస్ధితిలో ఉండి కూడా ఆంగ్లాన్ని వినియోగించడం జరుగుతుందని దానిని తగ్గించాలని సూచించారు. అన్ని శాఖలు తమ ఉత్తరప్రత్యుత్తరాల్లో ప్రతి నెల కొంత శాతం మేర

పెంచుకుంటూ తద్వారా తెలుగు భాషను పాలనా భాషగా అధికంగా వినియోగించాలని కోరారు. అన్నింటిలో తెలుగు వాడకం చేయవచ్చని ఆయన పేర్కొన్నారు. శంకుస్ధాపనలు,

ప్రారంభోత్సవాల్లో శిలాఫలకాలను తెలుగులో వేయవచ్చని అన్నారు. గత ఐదు సంవత్సరాలుగా అధికార భాషా సంఘం రాష్ట్రంలో లేదని, ముఖ్య మంత్రిగా జగన్ మోహన్ రెడ్డి బాధ్యతలు

చేపట్టిన తరువాత రాష్ట్ర అధికార భాషా సంఘాన్ని నియమించడం జరిగిందని పేర్కొన్నారు. శ్రీకాకుళం మాండలికం గొప్పదని దానిని పరిరక్షించుకోవాలని సూచించారు. తెలుగు

భాషను, సంస్కృతిని పరిరక్షించుకొనుటకు సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహిస్తుండాలని ఆయన అన్నారు. ఈ సందర్భంగా తెలుగు భాష, తెలుగువాడి గొప్పదనాన్ని

తెలియజేస్తు సి.నా.రే రచించిన పద్యాన్ని వినిపించారు.

దస్త్రాల్లో శత శాతం తెలుగు వినియోగిస్తున్న శాఖలకు అభినందనలు : జిల్లాలో శత శాతం తెలుగును ఉత్తర

ప్రత్యుత్తరాలలో, దస్త్రాల్లో వినియోగిస్తున్న సమాచార పౌర సంబంధాల శాఖ (డిపిఆర్ఓ కార్యాలయం), డివిజనల్ పౌరసంబంధాల అధికారి కార్యాలయం, జిల్లా నీటి యాజమాన్య సంస్థ,

వజ్రపు కొత్తూరు ఎంపిడిఓ కార్యాలయాలను అధ్యక్షులు అభినందించారు. ఆర్ అండ్ బి శాఖ కేవలం 10.77 శాతం మాత్రమే వినియోగించడాన్ని ప్రశ్నించారు.
          అంతకముందు జిల్లా

కలెక్టర్ జె నివాస్ తో కలెక్టర్ ఛాంబారులో తెలుగు భాష అమలుపై చర్చించిన భాషా సంఘానికి జిల్లా కలెక్టర్ వివరించారు. తెలుగు భాషను పాలనా భాషగా అధికంగా

వినియోగించుటకు చర్యలు చేపడతామని కలెక్టర్ అన్నారు. ఈ సమావేశంలో రాష్ట్ర భాషా సంఘం సభ్యులు ఆచార్య చందు సుబ్బారావు, మోదుగుల పాపిరెడ్డి, ఆచార్య షేక్ మస్తాన్,

ఆచార్య శరత్ జ్యోత్స్న రాణి, తనిఖీ అధికారి లక్ష్మీ కుమారి, జిల్లా రెవెన్యూ అధికారి బలివాడ దయానిధి, సంఘం సమన్వయ అధికారి మరియు బిసి కార్పొరేషన్ ఇడి జి.రాజారావు,

వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam