DNS Media | Latest News, Breaking News And Update In Telugu

చిన్న జీయర్ పర్యవేక్షణలో అంగరంగ వైభవంగా వాసుదేవుని కళ్యాణం

ఆచార్యుల పర్యవేక్షణలో అద్భుతంగా బ్రహ్మోత్సవాలు 

ఫిబ్రవరి 19 న రధోత్సవం, మహాపూర్ణాహుతి తో సమాప్తి.

(DNS రిపోర్ట్ : SV ఆచార్యులు, స్టాఫ్ రిపోర్టర్,

శ్రీకాకుళం) : . . . . .

మందస /  à°¶à±à°°à±€à°•à°¾à°•à±à°³à°‚, ఫిబ్రవరి 17, 2020 (డిఎన్‌ఎస్‌) : శ్రీకాకుళం జిల్లా మందస గ్రామం లో వేంచేసిన వాసుదేవ పెరుమాళ్ కళ్యాణం à°…à°‚à°—à°°à°‚à°— వైభవంగా జరిగింది.

సోమవారం ఉదయం ఆలయ ప్రాంగణంలో జరిగిన à°ˆ కల్యాణ మహోత్సవం ఉభయ వేదాంత ఆచార్య పీఠాధిపతులు, పరమహంస పరివ్రాజకాచార్య, అపర భగవద్రామనుజులుగా ఖ్యాతిగాంచిన  à°¤à±à°°à°¿à°¦à°‚à°¡à°¿

చిన్న శ్రీమన్నారాయణ రామానుజ జీయర్ స్వామి వారి ప్రత్యక్ష పర్యవేక్షణలో అత్యంత వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా స్వామి వైభవ విశేషాలను జీయర్ స్వామి భక్తులను

వివరిస్తూ అనుగ్రహ భాషణం చేసారు. ఈ కల్యాణ మహోత్సవం లో పాల్గొనేందుకు శ్రీకాకుళం జిల్లా నుంచే కాక, విశాఖపట్నం, విజయనగరం, ఒరిస్సా నుంచి సైతం పెద్ద సంఖ్యలో

భక్తులు హాజరయ్యారు. 

ఈ నెల 13 నుంచి న భూతో న భవిష్యతి అన్న రీతిలో జరుగుతున్న ఈ ఆలయ బ్రహ్మోత్సవాలను త్రిదండి అహోబల రామానుజ జీయర్ స్వామి వారు త్రిదండి దేవనాద

జీయర్ స్వామి వార్లు ప్రత్యక్షంగా పర్యవేక్షిస్తున్నారు.  à°‰à°¦à°¯à°‚, సాయంత్రం యాగ పర్యవేక్షణ అనంతరం భక్తులనుద్దేశించి అనుగ్రహ భాషణం

అందిస్తున్నారు. 

ఉత్సవాల్లో నిత్య కార్యక్రమాలు ఇవే: . . . . 

ఫిబ్రవరి 18 à°¨  : శ్రీవాసుదేవ ( శ్రీకృష్ణ ) పూజ, గోపాల సాగరం లో తెప్పోత్సవం.

ఫిబ్రవరి 19 à°¨  :

రధోత్సవం, గోపాల సాగరంలో చక్రతీర్ధం, హయగ్రీవ పూజ, ద్వాదశారాధన, శ్రీపుష్ప యాగం, మహాపూర్ణాహుతి. 

ఫిబ్రవరి 20 à°¨  : శ్రీవాసుదేవ స్వామి అభిషేకం, రామానుజ

పూజ. 

ప్రతి రోజు జరిగే వాహన సేవలు : . . . 

బ్రహ్మోత్సవాల్లో ఉదయం సాయంత్రం వివిధ వాహనాల్లో వేంచేసి, స్వామి, అమ్మవార్లు తిరువీధిలో వేడుకల్లో

పాల్గొంటారు. 

ఫిబ్రవరి 17 న ఉదయం : కల్యాణ మహోత్సవం, సాయంత్రం : గరుడ వాహనం.

ఫిబ్రవరి 18 న ఉదయం : పొన్న వాహనం, సాయంత్రం : అశ్వ వాహనం, తిరుమంగై అల్వార్ దోపిడీ

ఉత్సవం,

ఫిబ్రవరి 19 న ఉదయం : రధోత్సవం , సాయంత్రం : మహాపూర్ణాహుతి.

ప్రవచన, సాంస్కృతిక కార్యక్రమాలు: . . .

ప్రముఖ వేదపండితులు, ఆధ్యాత్మిక వేత్తలు యాగ

ప్రాంగణం లో ప్రతి రోజు ప్రచనలు అనుగ్రహించనున్నారు.  à°ªà±à°°à°¤à°¿à°°à±‹à°œà±‚ ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం ప్రముఖ సంగీత నాట్య కళాకారులచే సంగీత, నృత్య ప్రదర్శనలు జరుగనున్నాయి.

 

మందస ఆలయ ప్రాశస్త్యం - వైభవం : . . . 

శ్రీకాకుళం జిల్లా మందస లో వేంచేసిన శ్రీ వాసుదేవ స్వామి ఆలయానికి, స్థల ప్రాశస్త్యం ఎంతో ఉంది. 14 వ శతాబ్దానికి చెందిన ఈ

ఆలయం ప్రాంగణం లోనే చిన్న జీయర్ స్వామి ఆచార్యులు, విశిష్టాద్వైత వైభవ సాధనా సారధి టికే గోపాలాచార్యులు (తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం వాస్తవ్యులు)

భగవద్రామానుజుల గ్రంధాలను అధ్యయనం చేసిన పవిత్ర స్థలం. ఎందరో వేద పండితులు, విశిష్టాద్వైత ప్రవర్తకులు à°ˆ ఆలయాన్ని మంగళాశాసనం చేసిన ప్రాంగణం. 

1988 లో

శ్రీకాకుళం ప్రాంతంలో విశ్వ శాంతిని కాంక్షిస్తూ చిన్న జీయర్ స్వామి చేపట్టిన పాదయాత్ర సందర్భంగా ఈ మందస గ్రామానికి రావడం జరిగింది. అంత పవిత్రమైన ఈ ఆలయం

శిథిలావస్థకు చేరుకోవడంతో చలించిన చిన్న జీయర్ స్వామి ఉభయ వేదాంత ఆచార్య పీఠం ద్వారా ఈ ఆలయాన్ని జీర్ణోద్ధరణ కావించి, పున: వైభవాన్ని అందించారు. ఈ మహోత్సవం

జరిగిన తదుపరి ప్రతి ఏటా అత్యంత వైభవంగా బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం జరుగుతున్నది 11 à°µ బ్రహ్మోత్సవాలు.   

మందస ఆలయానికి చేరుకునే మార్గం :  .

. . 

విశాఖపట్నం నుంచి, శ్రీకాకుళం నుంచి మందస కు నేరుగా బస్సు మార్గం ద్వారా చేరుకోవచ్చు. మందస గ్రామం పలాస రైల్వే స్టేషన్ కి 19 కి. మీ. దూరంలో ఉంది. మందస రోడ్

రైల్వే స్టేషన్ లో కూడా కొన్ని ట్రైన్స్ ఆగుతాయి. మందస రోడ్ రైల్వే స్టేషన్ నుండి మందస శ్రీ వాసుదేవ స్వామి ఆలయము 5 à°•à°¿.మీ. దూరంలో ఉంది.  

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam