DNS Media | Latest News, Breaking News And Update In Telugu

మహా శివరాత్రి కి విశాఖ జిల్లా పుణ్యక్షేత్రాలు సిద్ధం. . 

150 ప్రత్యేక బస్సులు నడుపనున్న ఆర్టీసీ 
 
సముద్ర స్నానాలకు ప్రత్యేక ఏర్పాట్లు   

(DNS రిపోర్ట్ : సాయిరాం CVS , బ్యూరో , విశాఖపట్నం): . . .

విశాఖపట్నం, ఫిబ్రవరి 18, 2020

(డిఎన్‌ఎస్‌) : à°ˆ నెల 21 à°¨ మహాశివరాత్రి పర్వదినోత్సవాన్ని పురస్కరించుకుని విశాఖపట్నం జిల్లాలోని అన్ని శైవ క్షేత్రాలు సిద్ధమవుతున్నాయి. అధిక సంఖ్యలో భక్తులు

రానున్నందున, ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా, మంచినీరు, ప్రసాద వితరణ, సేద తీరేందుకు చలువ పందిళ్లు, షామియానాలు తదితర అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ క్షేత్రాలకు

భక్తులు చేరుకునేందుకు వీలుగా ప్రజా రవాణా సంస్థ ( ఆర్టీసీ) జిల్లా పరిధిలో 150 కి పైగా అదనపు బస్సులను నడుపనుంది. విశాఖపట్నం జిల్లా కేంద్రం నుంచి జిల్లాలోని పలు

పుణ్యక్షేత్రాలకు, సాగరతీర  à°•à±à°·à±‡à°¤à±à°°à°¾à°²à°•à± à°ˆ అదనపు బస్సులు సేవలు అందించనున్నాయి. విశాఖపట్నం జిల్లాలోని అనకాపల్లి, పంచదార్ల, పుణ్యగిరి ( ఎస్ కోట దరి), సహా అన్ని

ప్రముఖ ఆలయాలకూ భక్తులు సులభంగా చేరుకునే విధంగా వివిధ వేళల్లో బస్సులను నడుపనుంది. విశాఖ జిల్లా నుంచి ఇతర జిల్లాలోని ప్రముఖ శైవ క్షేత్రాలకూ కొన్ని బస్సులను

అందుబాటులో ఉంచింది. ఈ ప్రత్యేక సర్వీస్ లను ఏ ఏ రూట్లలో నడపాలి అనేది ఇంకా నిర్ణయం కాలేదు. గత సంవత్సరం ఆర్టీసీ సేవలకు ప్రయాణీకుల నుంచి మంచి స్పందన లభించింది. ఈ

పర్యాయం పంచదార్ల, రుషికొండ, అనకాపల్లి, చోడవరం, అనంతగిరి, పాడేరు, తదితర ప్రాంతాలకు కూడా ఈ సేవలు విస్తరించనున్నాయి. అదే విధంగా శివరాత్రి జాగరణ తదుపరి సముద్ర

స్నానాలు చేసుకునే భక్తుల సౌకర్యార్ధం à°ˆ సేవలు అందుబాటులో ఉండనున్నాయి. 

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam