DNS Media | Latest News, Breaking News And Update In Telugu

వేదవిద్యా వారధి మాధవ శర్మ కు డా. అబ్దుల్ కలాం జాతీయ పురస్కారం

మాధవ శర్మ కు మాననీయ à°¡à°¾. అబ్దుల్ కలాం జాతీయ పురస్కారం 

 

స్మార్త వేదవిద్యా వారధి, విజ్ఞాన గనికి సర్వ శ్రేష్ఠ సమ్మానం  

 

దశాబ్ద కాలంగా సబ్బవరం

ప్రాంతంలో ఉచిత వేద విద్యా భోదన

( DNS రిపోర్ట్ : సాయిరాం CVS , బ్యూరో , విశాఖపట్నం) : . . .

విశాఖపట్నం, ఫిబ్రవరి 19, 2020 (డిఎన్‌ఎస్‌) : విశాఖపట్నం శివారు ప్రాంతమైన సబ్బవరం

ప్రాంతంలో ఉచిత వేదవిద్య అందిస్తున్న సప్తఋషి చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపక చైర్మన్, వేదవిద్యా నిధి మావిళ్ళపల్లి మాధవ శర్మ (30 సంవత్సరాలు) కు మాననీయ డాక్టర్.

 à°…బ్దుల్ కలాం జాతీయ పురస్కారం లభించినట్టు సప్తఋషి చారిటబుల్ ట్రస్ట్ ప్రతినిధులు తెలిపారు. 

వేద ప్రచారమే తన జీవనంగా జీవితాన్ని సాగిస్తున్న మాధవ శర్మ

సప్తఋషి చారిటబుల్ ట్రస్ట్ పేరిట తన 20 వ ఏటనే వేద విద్య సంస్థ ను నెలకొల్పి గత దశాబ్ద కాలంలో ఎందరో విద్యార్థులకు ఉచితంగా స్మార్త, వేదవిద్యను అందిస్తూ తన

జీవితాన్ని సార్ధకత చేకూర్చుంటున్న మాధవశర్మ మరింత గా ప్రోత్సహించేందుకు బహుజన సాహిత్య అకాడమీ నేషనల్ కమిటీ ఈయనను డాక్టర్ అబ్దుల్ కలాం జాతీయ పురస్కారానికి

ఎంపిక చేయడం జరిగిందని ట్రస్ట్ ప్రతినిధులు తెలియచేస్తున్నారు.  à°ˆ విద్యాలయం లో విద్యను అభ్యసించేందుకు ఆంధ్ర ప్రదేశ్ నుంచే కాక, ఇతర రాష్ట్రాలకు చెందిన వారు

కూడా వస్తుండడం గమనార్హం. వేద విద్య ప్రచారానికే తన జీవితాన్ని కొనసాగిస్తున్నట్టు మాధవ శర్మ తెలియచేసారు. ప్రస్తుత సమాజానికి మంచి జరగాలి అంటే వేద నాదం నిరంతరం

కొనసాగుతూనే ఉండాలి అనే సంకల్పంతో తమ వద్దకు వచ్చిన ప్రతి విద్యార్థికీ ఉచితంగానే స్మార్త, వేద విద్యను అందిస్తున్నట్టు తెలియచేసారు. 

ఈ పురస్కారాన్ని

మార్చి నెల 15 à°¨ సప్త గిరీశుని సన్నిధి తిరుపతిలో జరిగే కార్యక్రమం లో వేదమూర్తి  à°®à°¾à°§à°µ శర్మకు అందించి వేదమాతకు పుష్పార్చన కావించనున్నారు. à°ˆ కార్యక్రమం బహుజన

సాహిత్య అకాడమీ జాతీయ అధ్యక్షులు నల్లా రాధాకృష్ణ, ప్రధాన కార్యదర్శి డాక్టర్ à°ˆ. సుబ్రహ్మణ్యన్ చేతుల మీదుగా అందించనున్నారు.  

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam