DNS Media | Latest News, Breaking News And Update In Telugu

22 నుంచి న్యాయవాదుల సంఘం జాతీయ సభలు

భారత లాయర్ల సంఘం రాష్ట్ర అధ్యక్షులు ముప్పాళ్ళ 

(DNS రిపోర్ట్ : పి. రాజా, Spl కరస్పాండెంట్ అమరావతి): . . .

అమరావతి, ఫిబ్రవరి 19, 2020 (డిఎన్‌ఎస్‌) : భారత న్యాయవాదుల సంఘం

జాతీయ మహా సభలు ఈనెల 22వ తేదీ నుంచి 24వ తేదీ వరకు విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రం పద్మనాభ రెడ్డి నగర్లో జరుగుతాయని భారత న్యాయవాదుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు,

ఏపీ బార్ కౌన్సిల్ సభ్యులు ముప్పాళ్ళ సుబ్బారావు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 22వ తేదీ ఉదయం 11 గంటలకు జరిగే ప్రారంభోత్సవ సభకు సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి

 à°œà°¸à±à°Ÿà°¿à°¸à± ఆఫ్తాబ్ ఆలం ముఖ్య అతిథిగా విచ్చేస్తారని, సుప్రీంకోర్టు మాజీ  à°¨à±à°¯à°¾à°¯à°®à±‚ర్తి జస్టిస్ పీ.బి.సవాంత్, ఎపి హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సి.ప్రవీణ్ కుమార్

గౌరవ అతిథులుగా విచ్చేస్తారని అన్నారు. అలాగే à°ˆ సభలో ఐఎఎల్ జాతీయ అధ్యక్షులు జితేందర్ సింగ్ సీమ, ఉపాధ్యక్షులు  à°¨à±€à°²à±‹à°«à°°à± భగవత్, ఏపీ బార్ కౌన్సిల్ చైర్మన్ à°—à°‚à°Ÿà°¾

రామారావు, ఎపి హైకోర్టు అడ్వకేట్స్ అసోసియేషన్ అధ్యక్షులు వై.వి.రవికుమార్, స్కూల్ ఆఫ్ లా బెన్నెట్ యూనివర్సిటీ డీన్ ప్రొఫెసర్ మాడభూషి శ్రీధర్ తదితరులు

ప్రసంగిస్తారని అన్నారు.  à°ˆ సభల్లో దేశ వ్యాప్తంగా న్యాయవాదులు ఎదుర్కొంటున్న సమస్యలు, న్యాయ వ్యవస్థ ఎదుర్కొంటున్న సమస్యలు , దేశవ్యప్తంగా ప్రజల రాజ్యాంగ పరమైన

హక్కుల పరిరక్షణకు సంబందించిన అంశాలు , ప్రస్తుతం ప్రభుత్వాలు చేస్తున్న ప్రజా వ్యతిరేక చట్టాలు, హక్కుల ఉల్లంఘనలు, దేశవ్యాప్తంగా మేధావులపై జరుగుతున్న దాడులు,

న్యాయ స్థానాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీ తదితర అంశాలపై చర్చించడం జరుగుతుందన్నారు. మూడు రోజుల పాటు జరిగే ఈ జాతీయ సభలకు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతో పాటు భారత

దేశం లోని అన్ని రాష్ట్రాల నుండి అధిక సంఖ్యలో ప్రతినిధులు, న్యాయవాదులు హాజరవుతారని పేర్కొన్నారు. ఈ సభలకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న భారత న్యాయవాదుల సంఘ

ప్రతినిధులు, న్యాయవాదులంతా హాజరయ్యి ఈ జాతీయ మహా సభలను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు.

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam