DNS Media | Latest News, Breaking News And Update In Telugu

పవన్ పోరాట యాత్ర : వెనుకబాటు తనం పై ఏసి గదుల్లో రహస్య సమాలోచనలు

ప్రచారం అవసరం . . . పాత్రికేయులు అవసరం లేదు. 

నేటి నుంచి  మలివిడత పోరాట యాత్ర . . . 

మీడియా సహా ఇతరులకు అనుమతి లేదు, 

విశాఖపట్నం, జూన్ 27 , 2018 (DNS Online ): ఉత్తరాంధ్ర

వెనుకబాటు తనం పై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బుధవారం మేధావులతో విశాఖనగరం లో చర్చాగోష్టి నిర్వహించనున్నారు. ఈ మేరకు జనసేన కార్యాలయం నుంచి విడుదలైన ప్రకటన

ప్రకారం విశాఖపట్నం బీచ్ రోడ్ లో గల సాయిప్రియ రిసార్ట్స్ లో కొందరు మేధావులు, విద్యావంతులతో పాటు, స్వయం ప్రకటిత మేధావులతో నేడు ఉత్తరాంధ్ర వెనకబాటు తనం పై ఏ సి

గదుల్లో చర్చలు జరుగనున్నాయి. ఈ కార్యక్రమం లో ఎవరు పాల్గొంటారో తెలియని స్థితి నెలకొంది. ఈ కార్యక్రమం లో పాల్గొనేందుకు మీడియా ప్రతినిధులకు సైతం అనుమతి

లేకపోవడం గమనార్హం. సమావేశం అంతా రహస్తంగానే జరుగనున్నట్టు తెలుస్తోంది. అయితే మీడియా అనుమతి లేకపోవడం తో ఇది పూర్తిగా అంతర్గత సమావేశం గానే పరిగణింప

బడుతోంది. వెనుకబాటు తనం పై ఏ సి గదుల్లో చర్చలేంటి అనే అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. కేవలం పార్టీ వర్గాలు ప్రసారం చేసే వీడియో ప్రసారం తప్ప మరొక్క విషయం

బయటకు వచ్చే అవకాశం లేకుండా అన్ని కట్టుదిట్టమైన చర్యలూ తీసుకుంటున్నారు. సమావేశం అనంతరం మీడియా ఇంటరాక్షన్ కూడా ప్రస్తుతానికి లేకపోవడం పై పార్టీలో

ప్రజల్లో వ్యక్తమవుతున్న అనుమానాలకు బలం చేకూరుతోంది. సమావేశం ఎలా జరిగినా ఉత్తరాంధ్ర ప్రాంత వాసులకు ఒక్క శాతం మేలు జరిగే చర్చలు జరిగినా పవన్ ఉత్తరాంధ్ర

పర్యటన సఫలం అయినట్టేనని భావిస్తున్నారు ఆశావహులు. 

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 20, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam