DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ప్రతి కుటుంబంలో ఒక్కరైనా ఉన్నత విద్య చదవాలి: సీఎం 

జగనన్న వసతి దీవెన  à°ªà°¥à°•à°‚ ప్రారంభం లో వైఎస్ జగన్ వెల్లడి 

(DNS రిపోర్ట్ : SV ఆచార్యులు, స్టాఫ్ రిపోర్టర్, శ్రీకాకుళం ). .

శ్రీకాకుళం, ఫిబ్రవరి 24, 2020 (డిఎన్‌ఎస్‌) :

ప్రతి కుటుంబంలో ఒక్కరైనా ఉన్నత విద్య తప్పకుండా చదవాల్సిన అవసరం ఉందని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పిలుపునిచ్చారు. సోమవారం విజయనగరం లో

జగనన్న వసతి దీవెన  à°ªà°¥à°•à°‚ ను ఆయన ప్రారంభించారు. à°ˆ సందర్బంగా ఆయన మాట్లాడుతూ  à°¸à±à°µà°¾à°¤à°‚త్య్రం వచ్చి ఇన్నేళ్లైనా పేద కుటుంబంలో ఉన్న వారు పేదరికం దాటి ముందుకు

అడుగు వేయలేదని, à°ˆ పరిస్థితి మారాలన్నారు. అందుకు ఏకైక మార్గం, à°† పేద కుటుంబం అప్పులపాలు కాకుండా, à°† కుటుంబం నుంచి à°’à°• ఇంజనీరు, డాక్టర్‌ లేదా కలెక్టర్‌ అయినా

కావాలని తెలిపారు.

పెద్ద చదువులు చదవాలి,  à°®à°‚à°šà°¿ ఉద్యోగాలు పొందాలి, వారు సంపాదించిన దాంట్లో కొంత ఇంటికి పంపాలి, అప్పుడే పేదరికం పోతుందన్నారు. రాష్ట్రంలో

ఇప్పటికీ 33 శాతం నిరక్షరాస్యులున్నారని,  à°…దే సమయంలో దేశంలో అది 27 శాతం మాత్రమే, అంటే జాతీయస్థాయి కంటే దిగువన మనం ఉన్నాం అని ఆవేదన వ్యక్తం చేసారు, 

గ్రాస్‌

ఎన్‌రోల్‌మెంట్‌ రేషియో (జీఈఆర్‌) కూడా కేవలం 23 శాతమే ఉందని, à°ˆ పరిస్థితి మారడం కోసం దేశంలో ఎక్కడా లేని విధంగా చదువుల విప్లవానికి శ్రీకారం చుట్టాం

అన్నారు. 

అందులో భాగంగా ఇవాళ ఇక్కడి నుంచి వసతి దీవెన ప్రారంభిస్తున్నందుకు గర్వపడుతున్నానన్నారు.  à°à°Ÿà°¾ రూ.2.5 లక్షల కంటే తక్కువ ఆదాయం ఉన్న పేద

విద్యార్థులకు రూ.20 వేల వరకు హాస్టల్, మెస్‌ ఛార్జీల à°•à°¿à°‚à°¦ ఇస్తాం అని, జనవరి, ఫిబ్రవరిలో మొదటి వాయిదా à°•à°¿à°‚à°¦ రూ.10 వేలు, జూలై, ఆగస్టులో మరో రూ.10 వేలు డిగ్రీ, à°† పై కోర్సులు

అభ్యసించే విద్యార్థుల తల్లుల ఖాతాల్లో జమ చేస్తాం అని తెలిపారు. 

వీరే కాకుండా ఐటిఐ విద్యార్థులకు రెండు విడతల్లో రూ.10 వేలు, పాలిటెక్నిక్‌ విద్యార్థులకు

కూడా రెండు విడతల్లో రూ.15 వేలు ఇస్తాం అని, à°’à°• కుటుంబంలో ఎందరు పిల్లలు చదివినా అందరికీ ఇస్తాం అని తెలిపారు. దాదాపు 11.87 లక్షల మంది పిల్లలకు à°’à°• బటన్‌ నొక్కగానే, ఆయా

మొత్తాల్లో సగం ఆ విద్యార్థుల తల్లుల ఖాతాల్లో నేరుగా దాదాపు రూ.1100 కోట్లు జమ అవుతాయన్నారు. వసతి దీవెన కోస ఏటా రూ.2300 కోట్లు ఖర్చు చేస్తుండగా, విద్యా దీవెన కోసం ఏటా

మరో రూ.3700 ఖర్చు చేయబోతున్నాం అనగానే అందరిలోనూ ఉత్సాహం రేకెత్తింది. 

ఇవే కాకుండా అమ్మ ఒడి పథకంలో అక్షరాలా 42 లక్షల మంది తల్లులకు, తద్వారా 82 లక్షల మంది

పిల్లలకు మేలు జరుగుతుందన్నారు. ఆ తల్లుల ఖాతాల్లోకి రూ.15 వేల చొప్పున, రూ.6400 కోట్లు జమ చేశాం అని, ఈ మూడు పథకాలకే రూ.12400 కోట్లు ఖర్చు చేస్తున్నామని గర్వంగా

చెబుతున్నామన్నారు. నాడు–నేడు మనబడి ద్వారా మూడేళ్లలో అన్ని స్కూళ్ల రూపురేఖలు మార్చబోతున్నాం అని ప్రకటించారు.  à°®à°§à±à°¯à°¾à°¹à±à°¨ భోజన మెనూలో పూర్తి మార్పులు

చేశామని, దానికి అదనంగా రూ.200 కోట్లు ఖర్చైనా లెక్క చేయకుండా భరిస్తున్నాం అన్నారు. నాడు నేడు మనబడిలో 45 వేల స్కూళ్లు, 471 జూనియర్‌ కళాళాలలు, 3287 హస్టళ్లు, 148 డిగ్రీ కళాశాలల

రూపురేఖలు మారుతాయని తెలిపారు. 

దీనికి దాదాపు రూ.13 వేల కోట్లు ఖర్చైనా భరించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని, అయితే ప్రతి పిల్లవాడు చదవడమే కాదు, భావి తరంతో

పోటీ పడాలని పిలుపునిచ్చారు. à°…ందుకే వచ్చే విద్యా సంవత్సరం నుంచి ప్రతి ప్రభుత్వ పాఠశాలలో 1 నుంచి 6à°µ తరగతి వరకు ఇంగ్లిష్‌ మీడియమ్‌ ప్రవేశపెడుతున్నాం అని

ప్రకటించారు. ఇవాళ చదువుకుంటున్న పిల్లలు ప్రపంచంలో పోటీ పడాలి. దీన్ని à°ˆ ప్రభుత్వం గుర్తించి, అనేక కార్యక్రమాలు, పథకాలు అమలు చేస్తోందన్నారు. 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam