DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ఆలయాలపై దాడిలో ప్రభుత్వ చర్యలు శూన్యం : ఏపీ సాధుపరిషత్  

మరి స్వామీజీలు రోడ్డెక్కు ఎందుకు నిరసనలు చేస్తున్నట్టో ?

చర్యలు తీసుకుంటే మేం రోడ్డెక్కి నిరసన ఎందుకు చేస్తాం ? 

మంత్రి వ్యాఖ్యలు ఖండించిన

అధ్యక్షులు స్వామి శ్రీనివాసానంద సరస్వతి 

(DNS రిపోర్ట్ : సాయిరాం CVS , బ్యూరో , విశాఖపట్నం )

విశాఖపట్నం, ఫిబ్రవరి 26, 2020 (డిఎన్‌ఎస్‌) : ఆంధ్ర ప్రదేశ్ లోని హిందూ

దేవాలయాలపై దాడులు చేసిన వారిపై చర్యలు తీసుకున్నామని రాష్ట్ర మునిసిపల్ శాఖా మంత్రి బొత్స సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలపై ఆంధ్ర ప్రదేశ్ సాధు పరిషత్ రాష్ట్ర

అధ్యక్షులు స్వామి శ్రీనివాసానంద సరస్వతి మండిపడ్డారు. బుధవారం విశాఖ లో మంత్రి విలేకరుల సమావేశంలో దేవాలయాలపై దాడి చేసిన వారిపై వెంటనే చెర్యలు తీసుకున్నామని

చెప్పడం పూర్తిగా అవాస్తవమన్నారు.  à°µà°¾à°³à±à°³à± చర్యలు తీసుకుంటే డజన్లకొద్దీ స్వామీజీలు, వందలాదిగా సాధుపరిషత్ సభ్యులు, వేలాదిగా హిందూ సమాజం à°ˆ రోజు న్యాయం చేయమంటూ

రోడ్డెక్కి నిరసనలు ఎందుకు చేస్తున్నామన్నారు. హైందవేతర మతోన్మాద ముష్కరులు కేవలం హిందూ ధర్మాన్ని భ్రష్టు పట్టించేందుకు లక్ష్యంగా చేసుకుని ఆలయాలపై

విచ్చలవిడిగా భౌతిక దాడులు చేస్తుంటే ఈ ప్రభుత్వం కళ్ళు మూసుకు పోయిందన్నారు. ప్రజల నుంచి వస్తున్నా విమర్శల నుంచి తప్పించుకునేందుకు ప్రభుత్వం, మంత్రులు తూతూ

మంత్రంగా ప్రకటనలు చేస్తున్నారన్నారు. తూర్పు గోదావరి జిల్లా పిఠాపురం లో 23 దేవీ దేవత విగ్రహాలు కూల్చిన వారంలోగా గుంటూరు జిల్లా రొంపిచర్లలో మదన గోపాల స్వామి

ఆలయ మూల విరాట్ ను డ్రిల్లింగ్ చేసి విరగొట్టారన్నారు. నెల్లూరు జిల్లా లోని వెంకటేశ్వర స్వామి ఆలయ రధాన్ని నిరుద్క్షిన్యంగా కాల్చివేశారన్నారు. ఆ వెంటనే

పశ్చిమ గోదావరి జిల్లా ఉండ్రాజవరం లో గ్రామదేవత ఆహ్వాన ముఖ ద్వారం కూల్చేశారని మండిపడ్డారు. 
ఈ ప్రభుత్వం పిఠాపురం లో ఆలయాల పై దాడి చేసిన రోజునే కఠిన చర్యలు

తీసుకోలేనందునే నేడు రాష్ట్రం లో హిందువుల పరిస్థితి దీనాతి దీనంగా ఉందన్నారు. తోటకూర దొంగతనం చేసిన నాడే శిక్షించి ఉంటె అనే సామెత ఈ రాష్ట్ర ప్రభుత్వానికి

అతికినట్టు సరిపోతుందన్నారు. 

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam