DNS Media | Latest News, Breaking News And Update In Telugu

పక్కాగా ఇంటర్ పరీక్షలు : జిల్లా కలెక్టర్ జె.నివాస్ 

*(DNS రిపోర్ట్ : SV ఆచార్యులు, స్టాఫ్ రిపోర్టర్, శ్రీకాకుళం ). .*

శ్రీకాకుళం, ఫిబ్రవరి 26, 2020 (డిఎన్‌ఎస్‌) : జిల్లాలో ఇంటర్మీడియట్ పరీక్షలను పక్కాగా నిర్వహించాలని

 à°œà°¿à°²à±à°²à°¾ కలెక్టర్ జె.నివాస్ సంబంధిత అధికారులను ఆదేశించారు. బుధవారం ఉదయం కలెక్టర్ ఛాంబర్ లో ఇంటర్మీడియట్ పరీక్షల నిర్వహణపై సమన్వయ సమావేశం జిల్లా కలెక్టర్

అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మార్చి 4 నుండి 23వ తేదీ వరకు జిల్లాలో ఇంటర్మీడియట్ పరీక్షలు జరగనున్నాయని చెప్పారు. ఈ పరీక్షలకు ప్రథమ

ఇంటర్ నుండి 31,024 మంది, ద్వితీయ ఇంటర్ నుండి 31,729 మంది వెరశి 62,753 మంది అభ్యర్ధులు పరీక్షలకు హాజరుకానున్నారని పేర్కొన్నారు.  à°‡à°‚దుకు 98 పరీక్షా కేంద్రాలను ఏర్పాటుచేయడం

జరిగిందని, ప్రతీ కేంద్రంలో  à°¤à°ªà±à°ªà°¨à°¿à°¸à°°à°¿à°—à°¾ సి.సి కెమెరాలను ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. అదేవిధంగా విద్యుత్, తాగునీరు, మరుగుదొడ్లు, మెడికల్ కిట్

తదితర ఏర్పాట్లు ఖచ్చితంగా ఉండాలన్నారు. విద్యార్ధులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లుచేయాలని, అభ్యర్ధులు పరీక్షలు వ్రాసేందుకు వీలుగా అవసరమైన

టేబుళ్లు, కుర్చీలు ముందుగానే  à°à°°à±à°ªà°¾à°Ÿà±à°šà±‡à°¸à±à°•à±‹à°µà°¾à°²à°¨à±à°¨à°¾à°°à±. హాల్ టికెట్లను అభ్యర్ధులు ఆన్ లైన్ నుండి డౌన్ లోడ్ చేసుకోనట్లయితే కళాశాలల్లో హాల్ టికెట్లను

జారీచేయాలని కలెక్టర్ సూచించారు. దూరప్రాంతాల నుండి వచ్చే అభ్యర్ధులు à°—à°‚à°Ÿ ముందే  à°ªà°°à±€à°•à±à°·à°¾ కేంద్రాలకు చేరుకునేలా బస్సులను ఏర్పాటుచేయాలని పేర్కొన్నారు. ప్రతీ

ప్రైవేటు, ప్రభుత్వ కళాశాలల్లో అన్ని వసతులు ఉండేలా చర్యలు చేపట్టాలని, ప్రతీ కళాశాలకు సిబ్బందిని పంపి వసతులను ముందుగానే పరీశీలించి, లేనిచోట

ఏర్పాటుచేసుకోవాలన్నారు. ఇందుకు మండల విద్యాశాఖాధికారుల సహకారాన్ని పొందాలని కలెక్టర్ తెలిపారు. ప్రతీ పరీక్షా కేంద్రాల్లో ఓ.ఆర్.ఎస్ ప్యాకెట్లు, మందులు

అందుబాటులో ఉంచాలని, గట్టి పోలీసు బందోబస్తును ఉంచాలని తెలిపారు. జిల్లాలో 10 ఫ్లైయింగ్ స్క్వాడ్ లను ఏర్పాటుచేసినందున ప్రతీ కళాశాలను పరిశీలించేలా చర్యలు

తీసుకోవాలన్నారు. ప్రతీ కళాశాలకు చీఫ్ సూపరింటెండెంట్లు, అసిస్టెంట్ సూపరింటెండెంట్లు,  à°‡à°¨à±à°µà°¿à°œà°¿à°²à±‡à°Ÿà°°à±à°²à°¨à± నియమించి వారికి ముందుగానే శిక్షణ ఇవ్వాలని

అన్నారు. పరీక్షా కేంద్రాల వివరాలను సంబంధిత మండల తహశీల్ధారు, మండలపరిషత్ అభివృద్ధి అధికారులకు ముందుగానే తెలియజేయాలని చెప్పారు. ఎక్కడా ఎటువంటి అవాంఛనీయ

సంఘటనలకు తావులేకుండా పక్కాగా ఏర్పాట్లు ఉండాలని అధికారులను ఆదేశించారు.  
    à°ˆ సమావేశంలో ప్రాంతీయ తనిఖీ అధికారి యస్.రుక్మాంగధరరావు, జిల్లా వైద్య ఆరోగ్య

శాఖాధికారి డా. యం.చెంచయ్య, జిల్లా విద్యాశాఖాధికారి కె.చంద్రకళ, జిల్లా ఒకేషనల్ విద్యాశాఖాధికారి కె.ప్రకాశరావు,ఏ.పి.ఈ.పి.డి.సి.ఎల్ పర్యవేక్షక ఇంజినీర్ ఎన్.రమేశ్,

ప్రజా రవాణాశాఖ ఉప కమీషనర్ జి.వరలక్ష్మీ, పి.ఆర్.ఓ బి.యల్.పి రావు, ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ యస్.తవిటినాయుడు, పాలకొండ, శ్రీకాకుళం జూనియర్ కళాశాలల

ప్రిన్సిపాల్స్ ఆర్.సత్యనారాయణ, బి.ప్రసాదరావు ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు. 

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam