DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ఎంపీ హరిబాబు ఔదార్యం... ఇతర ప్రాంతాల వారికీ బ్యాటరీ సైకిళ్ళు  

దివ్యాంగుల్లో పెల్లుబికిన à°†à°¨à°‚దం

విశాఖపట్నం, జూన్ 27 , 2018 (DNS Online ): విశాఖపట్నం పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోనే కాకుండా ఈ ప్రాంతాల్లో ఉన్న అర్హులైన

దివ్యాంగులకు బ్యాటరీతో నడిచే మూడు చక్రాల సైకిళ్ళు అందిస్తామని విశాఖపట్నం ఎం పీ డాక్టర్ కె. హరిబాబు ప్రకటించారు. బుధవారం నగరం లోని తన కార్యాలయం లో

నిర్వహించిన దివ్యాంగుల స్క్రీన్ టెస్ట్ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు, దివ్యంగులకు ఎం పీ హరిబాబు ఇస్తున్న బ్యాటరీ సైకిళ్లకు అధిక ఆదరణ లభించడం తో విశాఖ

పట్నం జిల్లా నుంచే కాక శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల వారు కూడా దరఖాస్తు చేసుకునేందుకు బుధవారం విశాఖ ఎం పీ కార్యాలయానికి చేరుకున్నారు. అయితే నిబంధనల

ప్రకారం విశాఖపట్నం పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోని వారికి మాత్రం ఇవ్వ డం జారుతుందని నిర్వాహకులు ప్రకటించినప్పటికీ, అనకాపల్లి, విజయనగరం, శ్రీకాకుళం

జిల్లాలకు చెందిన వారు సైతం అధిక సంఖ్యలో దరఖాస్తు చేసుకునేందుకు రావడం తో వారిని వెనక్కి వెళ్లిపోవాల్సిందిగా నిర్వాహకులు ప్రకటించారు. 

ఇదే సమయం లో ఈ

కార్యక్రమం లో పాల్గొనేందుకు ఎం పీ హరిబాబు వస్తున్న సమయం లో కొందరు దివ్యాంగులు బయటకు వెళ్లిపోవడం కనిపించింది. వీరిని ఎందుకు వెనక్కి వెళ్లిపోతున్నారని

ప్రశ్నించడం తో తాము ఇతర ప్రాంతాల వారమని, తమకు ఇవ్వడం కుదరదని చెప్పడం తో వెనుదిరిగినట్టు వివరించారు. దీంతో ఎంపీ వెంటనే సంబంధిత అధికారులతో మాట్లాడి, ఇతర

ప్రాంతాల వారైనా సరే అర్హులైతే బ్యాటరీ మూడు చక్రాల సైకిళ్ళు అందించాలని సూచించారు.à°ˆ విషయం పై కేంద్ర సామాజిక సాధికారిత మంత్రి  à°ªà°µà°°à± చాంద్ గెహ్లాట్ తో

మాట్లాడతానని తెలిపారు. ముందు వీరి దరఖాస్తులు పరిశీలించాలని తెలిపారు. దీంతో దరఖాస్తు కై వచ్చిన దివ్యాంగుల్లో ఆనందం పెల్లుబికింది. 

For more details Click Here. All Copy Rights Reserved with DNS Media.

Recent News

Latest Job Notifications

Panchangam - May 20, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam