DNS Media | Latest News, Breaking News And Update In Telugu

అవ్వను ఆడుకోడానికి కలెక్టరే కదిలి వస్తే. .మెట్లపైనే పరిష్కారం

స్ఫూర్తిగా నిలిచిన జయశంకర్ కలక్టర్ మహ్మద్ అజీమ్ 

(DNS రిపోర్ట్ : పి. రాజా, Spl కరస్పాండెంట్ అమరావతి)

అమరావతి, ఫిబ్రవరి 27, 2020 (డిఎన్‌ఎస్‌) : వృద్ధాప్య పెన్షన్

కోసం రెండేళ్లుగా ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ కాళ్ళు అరిగేలా తిరిగినా అవ్వని పని ఆఖరికి కలెక్టర్ కార్యాలయం గుమ్మం వద్ద శాంక్షన్ అవ్వడం అందరికీ

స్ఫూర్తిగా నిలిచింది. వివరాల్లోకి వెళితే. . . తెలంగాణ లోని జయశంకర్ భూపాలపల్లి జిల్లాకు చెందిన ఒక వృద్ధ మహిళా పెన్షన్ కోసం రెండేళ్ల పాటు పెట్టని దరఖాస్తు లేదు,

తిరగని కార్యాలయం లేదు. అయితే. . ఆమెను పట్టించుకున్న నాధుడే ప్రభుత్వ కార్యాలయాల్లో కరువయ్యాడు. దీంతో విసిగి పోయిన ఆమె ఆఖరికి జిల్లా కలెక్టర్ సుముఖానికి

విన్నవించుకోడానికై కలెక్టర్ కార్యాలయం కు చేరింది. కలెక్టర్ వేరే సమావేశానికి వెళ్లడంతో అక్కడే మెట్ల పై కూర్చుండిపోయింది. కొంత సమయానికి కార్యాలయానికి

వచ్చిన ఒక యువకుడు ఆమెను అక్కడ చూసి ఆమెతో మాట మంతీ కలిపి విషయం తెలుసుకున్నాడు. ఆ వచ్చిన వ్యక్తి ఎవరో తెలియకపోయినా తన గోడు వినేవాడు ఒక్కడు దొరికాడు అని తన

పరిస్థితి ని వివరించింది. అంటే ఉగ్రుడైపోయిన ఆ యువకుడు ఆఘమేఘాలపై అధికారులను ఫోన్ లోనే ఆదేశించారు. తానూ రెండేళ్ల కాలం పాటు ఎవరి కాళ్ళ వెళ్ళా పడిందో అదే

అధికారులు వెంటనే ఆమెకు పెన్షన్ ఇచ్చేస్తామంటూ చెప్పడంతో ఒక్కసారి షాక్ అయ్యింది. అంతవరకూ తానూ ఎవరితో మాట్లాడానో ఆయనే ఆ జిల్లా కలెక్టర్ మొహమ్మద్ అబ్దుల్

అజీం. అంటే ఆ క్షణం ఆమె ఆశ్చర్యంతో కన్నీటి పర్యంతం అయ్యింది. ఆయన నిరాడంబరత్వానికి ఆమె విస్తుపోయింది. ఆయన, వారి కుటుంబం సుఖసంతోషాలతో ఉండాలి అని

ఆశీర్వదించింది. ఇలాంటి అధికారులు ఏ ప్రాంతం లో ఉంటారో . . అక్కడ ప్రజలకు కష్ఠాలు క్షణాల్లో పరిష్కారించబడతాయి అని అక్కడ ఆ దృశ్యాన్ని చూసిన వారు

అభిప్రాయపడుతున్నారు. à°ˆ ఘటన ఫోటోలు సోషల్ మీడియా లో వైరల్ అవుతున్నారు. 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam