DNS Media | Latest News, Breaking News And Update In Telugu

సకల విద్యా ప్రవీణ రామారెడ్డి విద్యా కిరీటంలో మరో డాక్టరేట్ 

మానసిక వైద్యునికి న్యాయ ప్రవీణ - బంగారు పురస్కారం 

ఆధ్యాత్మికత లోనూ అగ్రగామే. పవర్ పాయింట్ లో అర్చరాది మార్గం 

(DNS రిపోర్ట్ : పి. రాజా, Spl కరస్పాండెంట్

అమరావతి)

అమరావతి, ఫిబ్రవరి 27, 2020 (డిఎన్‌ఎస్‌) : సకల విద్యా ప్రవీణునిగా పేరుగాంచిన  à°¤à±‚ర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరానికి చెందిన ప్రముఖ మానసిక వైద్యులు

డాక్టర్ కర్రి రామారెడ్డి à°•à°¿ న్యాయ శాస్త్రంలో ప్రొ|| à°à°•à°¸à°¿à°°à°¿ రాజా హరగోపాల్‌రెడ్డి, à°µà°¿à°œà°¯ లక్ష్మీ బంగారు పతకం లభించింది. గురువారం ఆచార్య నాగార్జున విశ్వ

విద్యాలయం లో జరిగిన 35వ మరియు 36వ స్నాతకోత్సవంలో రాష్ట్ర గవర్నర్ బిశ్వ భూషణ్ హరిచందన్ న్యాయశాస్త్రంలో నాలుగు ఎల్ ఎల్ ఎం కోర్సుల్లోనూ ప్రధమ స్థానం లభించినందుకు

రామారెడ్డి కి బంగారు పతకం ప్రదానం చేసారు.

67 ఏళ్ళ ఈ మానసిక వైద్యుడు నిత్యం విద్యార్ధిగానే తన విద్యాభ్యాసాన్ని నేటికీ కొనసాగిస్తున్నారు. దేశంలోని పలు

విశ్వ విద్యాలయాల్లో ఎన్నో పిహెచ్ à°¡à°¿ లు, పీజీ లు,  à°¡à°¿à°—్రీలు, డిప్లమోలు అత్యధిక మార్కులతో దిగ్విజయంగా పూర్తిచేసి, ఆయా విద్యాలయాల్లో తన పేరును నమోదు

చేస్తున్నారు. ఈయన సహాధ్యాయుల్లో 18 ఏళ్ళ వయసు నుంచి 60 ఏళ్ళు పైబడిన వారి వరకూ వివిధ ప్రాంతాలకు చెందిన వారు ఉన్నారు. 

ఇప్పడికే సాధారణ వైద్య విద్యా పట్టాను

పొందిన రామారెడ్డి తనదైన శైలిలో వైద్య సేవను ప్రజలకు అందిస్తూనే. . . కంప్యూటర్ రంగంలో ఎం సి ఏ ను పూర్తి చేసారు, ఇంజనీరింగ్, జర్నలిజం, ఆంగ్లం, తదితర అన్నిరంగాలనూ

పట్టాలు పొందేశారు. అత్యధికంగా  à°ªà±‚ర్తి చేసారు. 

తానూ నేర్చుకున్న విద్యను యధాతధంగా సాధారణ జీవన విధానంలో అమలు చేసే à°ˆ à°¸à°•à°² విద్యా ప్రవీణ ఆధ్యాత్మిక

రంగంలోనూ తనదైన మార్కు ను లిఖించారు. మనిషి à°ˆ లోకాన్ని వీడిన తర్వాత పరవపదానికి చేరుకునే మార్గాన్ని ఆధ్యాత్మికరంగంలో అర్చరాది మార్గం  à°…ని పేరు. జీవి

పరమాత్మను చేరుకునే విధానాన్ని పవర్ పాయింట్ చిత్రీకరణ ద్వారా, అత్యంత హృద్యంగా రూపొందించి, ఎందరికో అందించారు. ఎందరో సాధువులు, పీఠాధిపతుల సమక్షంలో ఈ

ఆధ్యాత్మిక ప్రదర్శనను దృశ్యరూపంగా అందించారు. ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త ఉభయ వేదాంత ఆచార్య పీఠాధిపతులు త్రిదండి చిన్న జీయర్ స్వామి మంగళశాసనలను సైతం

అందుకున్నారు రామారెడ్డి.   

విద్యార్థుల పాలిట కల్పతరువు :. . .
  
స్వతహాగా మానసిక వైద్యులైన రామారెడ్డి ప్రతి సంవత్సరం జిల్లాలో వివిధ పాఠశాలల్లో పదవ తరగతి,

ఇంటర్ మీడియట్ పరీక్షలకు హాజరవుతున్న విద్యార్థిని విద్యార్థులకు పరీక్ష ఒత్తిడిని సునాయాసంగా ఎదుర్కొనే విద్యానాలను, సూచనలు ఉచితంగానే అందిస్తున్నారు.

ఇప్పటికే వందలాది à°—à°¾ సదస్సులను పూర్తి చేసారు. ఇప్పడికీ ఆయనను ఆహ్వానిస్తే సేవలు అందించేందుకు సిద్దం అంటుంటారు à°ˆ సకల విద్యా ప్రవీణ.  

ఈ స్నాతకోత్సవ

వేదికపై రాష్ట్ర విద్యాశాఖామాత్యులు ఆదిమూలం సురేష్, ఉప కులపతి డాక్టర్ రాజశేఖర్, రిజిష్ట్రార్ డా. రోశయ్య, ప్రముఖ పాత్రికేయులు డా. ఏబీకే ప్రసాద్ ఉన్నారు.

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam