DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ప్రపంచం మెచ్చిన మేధావి పీవీకి ఘన నివాళి 

విశాఖపట్నం, జూన్ 28 , 2018 (DNS Online ):

ప్రపంచం మెచ్చిన, కొనియాడిన మేధావి పాములపర్తి వెంకట నర్శింహారావు ( పీవీ) 98 వ జయంతి ని పురస్కరించుకుని విశాఖ నగర ప్రముఖులు అయనకు ఘన

నివాళి అర్పించారు. గురువారం వైజాగ్ బ్రాహ్మిన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యవం లో విశాఖపట్నం నగరం లోని సిరిపురం కూడలి వద్ద గల పీవీ సర్కిల్ వద్ద జరిగిన

కార్యక్రమంలో ఉత్తరాంధ్ర జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గం ఎం ఎల్ సి పివిఎన్ మాధవ్, ఎమ్మెల్సీ ఎం, వివి ఎస్ మూర్తి, మాజీ ఎం ఎల్ ఏ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్

కార్యదర్శి ద్రోణంరాజు శ్రీనివాస్ ,  à°¤à°¦à°¿à°¤à°°à±à°²à± అతిధులుగా పాల్గొన్నారు . à°ˆ సందర్భంగా మాధవ్ మాట్లాడుతూ ప్రపంచం లోని మేధావులందరిచే కొనియాడబడిన అమర మేధావి పీవీ

ఒక రాజకీయ నేతగానే కాకుండా, రచయితగా, ఆర్ధిక సంస్కర్త గానే కాకుండా, దాదాపు 18 స్వదేశీ, విదేశీ భాషల్లో అనర్గళంగా మాట్లాడగలిగిన ఏకైక వ్యక్తిగా నాటికీ నేటికీ

చరిత్ర సృష్టించారన్నారు. అయన ప్రధానిగా ఈ దేశానికి అందించిన వర ప్రసాదం ఆర్ధిక సంస్కరణాలేనన్నారు. నాటి రిజర్వ్ బ్యాంకు గవర్నర్ గా ఉన్న డాక్టర్ మన్మోహన్ సింగ్

ను భారత దేశ ఆర్ధికమంత్రి గా నియమించి, అట్టడుగున ఉన్న భారత ఆర్ధిక వ్యవస్థను ప్రపంచం లోనే అగ్రగామిగా నిలబెట్టారన్నారు. అలాంటి మేధావులు రాజకీయ పార్టీలకు

అతీతమన్నారు. తన గురువు గా భావించే విశ్వనాధ సత్యనారాయణ రచించిన వేయిపడగలు కావ్యాన్ని, పీవీ మరాఠీ లోనూ, తదుపరి హిందీ లోనూ అనువదించి, ఉత్తరాది వారి అభిమానాన్ని

చూరగొన్నారన్నారు. మరో ఎం ఎల్ సి మూర్తి మాట్లాడుతూ తెలుగువారి విజ్ఞాన సంపద పీవీ అని, తెలుగువారి తో రాజకీయ పార్టీలకు అతీతంగా అందరితో సన్నిహిత సంబంధాలు

నెలకొల్పారన్నారు. అయన ప్రధానమంత్రి గా భాద్యతలు చేపట్టిన తర్వాత లోక్ సభకు ఆంధ్రా నుంచే పోటీ చేసిన సమయంలో నాటి ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం

అధ్యక్షులు ఎన్ టి రామారావు పీవీకి పోటీ కూడా అభ్యర్థిని నిలబెట్టలేదని గుర్తు చేశారు. కార్యక్రమం లో విశిష్ట అతిధిగా పాల్గొన్న మాజీ ఎం ఎల్ ఏ ద్రోణంరాజు

శ్రీనివాస్ మాట్లాడుతూ తెలుగువారి వాడి, వేడి, పీవీ గళం లో నిరంతరం ప్రస్ఫుటంగా ఉండేదన్నారు. తానూ ఆంధ్ర ప్రదేశ్ కు చెందినవాడిగానే నిరంతరం ప్రకటించుకున్నారని,

దేశానికి ప్రధాని ( రాజు ) అయినా, ఆంధ్ర కు బిడ్డనే అని చెప్పుకున్న ఏకైక మహనీయులన్నారు. ఈ కార్యక్రమంలో వైజాగ్ బ్రాహ్మిన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షులు

టి ఎస్ ఆర్ ప్రసాద్, అధ్యక్షులు కావూరి చరణ్, ప్రముఖ న్యాయవాది కె. నర్సింహమూర్తి, బిజెపి సీనియర్ నాయకులు పివి నారాయణ రావు, హిమాంశు ప్రసాద్, శంకర్ నీలు తదితరులు

పాల్గొన్నారు. 

For more details Click Here. All Copy Rights Reserved with DNS Media.

Recent News

Latest Job Notifications

Panchangam - May 20, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam