DNS Media | Latest News, Breaking News And Update In Telugu

మహిళా సాధికారతకు ప్రభుత్వం ప్రోత్సాహాన్నిస్తోంది

సిక్కోలు డ్వాక్రా బజారు ప్రారంభించిన మంత్రి

*(DNS రిపోర్ట్ : SV ఆచార్యులు, స్టాఫ్ రిపోర్టర్, శ్రీకాకుళం ). .*

శ్రీకాకుళం, ఫిబ్రవరి 28, 2020 (డిఎన్‌ఎస్‌) :

 à°¶à±à°°à±€à°•à°¾à°•à±à°³à°‚లో సిక్కోలు డ్వాక్రా బజారు ప్రదర్శనను రాష్ట్ర రహదారులు, భవనాల శాఖ మంత్రి ధర్మాన క్రిష్ణదాస్ శుక్ర వారం ప్రారంభించారు. నాబార్డు సౌజన్యంతో జిల్లా

గ్రామీణ అభివృద్ధి సంస్ధ- వెలుగు, మెప్మా మహిళా స్వయం సహాయక సంఘాలు సంయుక్తంగా ఈ ప్రదర్శనను ఎన్.టి.ఆర్.ఎం.హెచ్ స్కూల్ గ్రౌండులో ఏర్పాటు చేసాయి. ఈ ప్రదర్శన మార్చి 5వ

తేదీ వరకు కొనసాగుతుంది. డ్వాక్రా బజారులో జిల్లాలోని డ్వాక్రా సంఘాలతోపాటు తూర్పు గోదావరి జిల్లా ఆత్రేయపురం, కృష్ణా జిల్లా కానూరు, పెనమలూరు, మల్లాంలోని

డ్వాక్రా సంఘాలు, విశాఖపట్నం జిల్లా మాడుగుల డ్వాక్రా సంఘాలు వెరశి 40 స్టాల్స్ ను ఏర్పాటు చేసారు. హల్వాకు ప్రసిద్ధి చెందిన మాడుగుల హల్వా, ఆత్రేయపురం పూతరేకులు,

కానూరు చేనేతలతోసహా సీతంపేట ఐటిడిఏ పరిధిలోని డ్వాక్రా సంఘాలు కుంకుమ, కొండచీపుర్లు, అగర్బత్తీలు, బెజ్జిపురం జౌళి ఉత్పత్తులు ఆకర్షణగా నిలిచాయి.

తినుబండారాలకు ప్రఖ్యాతిగాంచిన చుప్పులు, అప్పడాలు, జంతికలు తదితర అంశాలు, వివిధ పౌడర్లు, పచ్చళ్ళు, సేంద్రియ పంటలు తదితర అనేక వస్తువులను ప్రదర్శన, విక్రయంలో

పెట్టారు. చీరలు, ఖాదీ, చేనేత వస్త్రాలు, ఫ్యాన్సీ, గాజులు తదితర వస్తువులు లభ్యంగా పెట్టారు. బెజ్జిపురం యూత్ క్లబ్, స్వీప్, చిన్నయ ఆదివాసి వికాస సంఘం, ఆర్ట్స్

స్వచ్చంద సంస్ధలు తమ ఆధ్వర్యంలో తయారు చేస్తున్న వస్తువులను డ్వాక్రా బజారులో ఏర్పాటు చేసారు.  à°¡à±à°µà°¾à°•à±à°°à°¾ బజారుకు వెళ్ళి ప్రదర్శనలు చూడటమే కాకుండా ఆహార

స్టాల్స్ ను ప్రత్యేకంగా ఏర్పాటు చేసారు.
          డ్వాక్రా బజారును ప్రారంభించిన మంత్రి అన్ని స్టాల్స్ ను పరిశీలించారు. అనంతరం మీడియా ప్రతినిధులతోమాట్లాడుతూ

మహిళలు అన్ని రంగాల్లో ముందంజలో ఉండాలన్నారు. డ్వాక్రా మహిళలు ఆర్ధికంగా పటిష్టంగా డాలని ఆకాంక్షించారు. డ్వాక్రా బజారులో విక్రయిస్తున్న వస్తువులు మహిళా

సంఘాలు తయారు చేస్తున్నవని,వాటిని ప్రోత్సహించాలన్నారు. పౌష్టికాహారాన్ని అందించే ఆహార పదార్ధాలు ఉన్నాయని ఇటువంటి ఆహారం ఆరోగ్యకర సమాజానికి ఉపయోగపడతాయని

పేర్కొన్నారు. రాష్ట్ర ముఖ్య మంత్రి జగన్ మోహన్ రెడ్డి ఉత్తరాంధ్ర అభివృద్ధికి ఆలోచించే వ్యక్తి అని ఒక ప్రశ్నకు స్పందిస్తూ చెప్పారు. జగన్ ప్రజా సేవకుడు

అన్నారు. ఉద్దానం కిడ్నీ సమస్యకు శాశ్వత పరిష్కారానికి పలాసలో రూ.50 కోట్లతో రెండు వందల పడకల ఆధునాతన ఆసుపత్రి, కిడ్నీ పరిశోధనా కేంద్రాన్ని ఏర్పాటు

చేస్తున్నారని చెప్పారు. శుద్ధ జలాలను అందించుటకు రూ.6 వందల కోట్లతో ఇంటింటికి కొలాయిలను ఏర్పాటు చేస్తున్నారని తెలిపారు. సహజవనరులు కలిగిన నగరం విశాఖపట్నం అని

పేర్కొంటూ విశాఖపట్నంను రాజధానిగా చేయడం వలన ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయని అన్నారు. ఆర్ధిక రాజధానిగా మారుతుందని చెప్పారు. అమరావతి గ్రామాల సమస్యలను

పరిష్కరించుటకు ముఖ్య మంత్రి ఆలోచిస్తున్నారని వివరించారు.
          à°ˆ కార్యక్రమంలో పలాస శాసన సభ్యులు à°¡à°¾.సీదిరి అప్పల రాజు, జాయింట్ కలెక్టర్ à°¡à°¾.కె.శ్రీనివాసులు,

జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్ధ ప్రాజెక్టు డైరక్టర్ ఏ.కళ్యాణ చక్రవర్తి, మెప్మా ప్రాజెక్టు డైరక్టర్ ఎం.కిరణ్ కుమార్, నాబార్డు జిల్లా అభివృద్ధి మేనేజర్

మిలింద్ చౌసాల్కర్, బిసి కార్పొరేషన్ ఇడి జి.రాజారావు, మునిసిపల్ మాజీ అధ్యక్షులు ఎం.వి.పద్మావతి, మాజీ ఉపాధ్యక్షులు చల్లా అలివేలుమంగ., సురంగి మోహన రావు, దువ్వాడ

శ్రీకాంత్, సుగుణా రెడ్డి, డిఆర్డిఏ, మెప్మా అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam