DNS Media | Latest News, Breaking News And Update In Telugu

పార్టీల ఘర్షణపై గవర్నర్ కు జివిఎల్  ఫిర్యాదు

రాష్ట్రం లో ఆధిపత్య పోరు తో పరువు పోయింది :జి వి ఎల్. 

(DNS రిపోర్ట్ : పి. రాజా, Spl కరస్పాండెంట్ అమరావతి)

అమరావతి, ఫిబ్రవరి 29, 2020 (డిఎన్‌ఎస్‌) : ఆంధ్ర ప్రదేశ్

రాష్ట్రంలో అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య నెలకొన్న తాజా పరిణామాలపై గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌ కు బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు ఫిర్యాదు చేసారు.

శనివారం గవర్నర్‌ తో భేటీ అనంతరం జీవీఎల్ నరసింహారావు మీడియా తో మాట్లాడారు. à°ˆ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో నెలకొన్న తాజా పరిణామాలపై గవర్నర్ దృష్టికి

తీసుకెళ్లినట్టు తెలిపారు. శాంతిభద్రతలకు ప్రమాదమయ్యే రీతిలో రాష్ట్రంలో పరిస్థితులు నెలకొన్నాయని తెలిపారు. పాలక, ప్రతిపక్ష పార్టీలు ఘర్షణ వైఖరిని

అవలంభిస్తున్నాయని పేర్కొన్నారు. స్నేహపూర్వకమైన రాజకీయాలు ఉండాలే తప్ప.. ఇలాంటి ఘర్షణ వాతావరణం రాష్ట్రంలో నెలకొనడం బాధాకరమని వ్యాఖ్యానించారు. ఘర్షణ అనేది

కేవలం వ్యాఖ్యలకు మాత్రమే పరిమితం కావాలని సూచించారు. అంతేకాని రోడ్లపైకి వచ్చి ఒకరినొకరు ఆపుకోవడం సరికాదని హితవు పలికారు. రాష్ట్రంలో ఇలాంటి పరిస్థితులు

రాకూడదని బీజేపీ వాయిస్‌à°—à°¾ గవర్నర్ దృష్టికి తీసుకెళ్లినట్లు జీవీఎల్ వివరించారు.

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam