DNS Media | Latest News, Breaking News And Update In Telugu

అన్నవరం ఆలయ పాలక మండలి ప్రమాణ స్వీకారం 

చైర్మన్ à°—à°¾ రోహిత్, ఇతర సభ్యులు భాద్యతలు  

(DNS రిపోర్ట్ : పి. రాజా, Spl కరస్పాండెంట్ అమరావతి)

అమరావతి, ఫిబ్రవరి 29, 2020 (డిఎన్‌ఎస్‌) : తూర్పుగోదావరి జిల్లాలోని

ప్రముఖ పుణ్యక్షేత్రం అన్నవరం వీర వెంకట సత్యనారాయణ స్వామివారి దేవస్థానానికి కొత్తగా నియమించిన పాలక మండలి సభ్యులు శనివారం పదవి ప్రమాణ స్వీకారం చేసారు.

వ్యవస్థాపక కుటుంబ సభ్యుడు, ఆలయ ప్రధాన అర్చకుడితో పాటు 16 మందికి à°ˆ ట్రస్ట్‌ బోర్డులో అవకాశం కల్పించారు. ప్రభుత్వం గుర్తించిన వ్యవస్థాపక కుటుంబ సభ్యులు

చైర్మన్‌à°—à°¾ వ్యవహరిస్తారని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. సభ్యులు పదవీ బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి రెండేళ్ల పాటు పాలక మండలిలో కొనసాగుతారని స్పష్టం చేశారు.

ప్రధాన అర్చకుడు ఎక్స్‌అఫిషియో సభ్యుడిగా ఉంటారని తెలిపారు. కాగా, ఇప్పటికే విజయవాడ, ద్వారకా తిరుమల, సింహాచలం దేవస్థానాలకు నూతన పాలక మండళ్లను రాష్ట్ర

ప్రభుత్వం నియమించిన సంగతి తెలిసిందే. శనివారం జరిగిన పాలక మండలి ప్రమాణ స్వీకారానికి ప్రత్తిపాడు నియోజకవర్గ శాసనసభ్యులు పర్వత ప్రసాద్, తుని శాసనసభ్యులు

దాడిశెట్టి రాజా తదితరులు పాల్గొన్నారు. 

అన్నవరం దేవస్థానం నూతన పాలకమండలి సభ్యులు వీరే..

1. వ్యవస్థాపక కుటుంబ సభ్యులు రోహిత్  (చైర్మన్‌)
2. సాధు దుర్గ
3.

కర్రి భామిరెడ్డి
4. కలగా రామజోగేశ్వర శర్మ
5. వాసిరెడ్డి జగన్నాథం
6. నత్రా మహేశ్వరి
7. గాదె రాజశేఖరరెడ్డి
8. చిట్టూరి సావిత్రి
9. అప్పారి లక్ష్మి
10. ముత్యాల

వీరభద్రరావు
11. మోకా సూర్యనారాయణ
12. చాగంటి వెంకట సూర్యనారాయణ
13. ములికి సూర్యవతి
14. బి. ఆశాలత
15. కర్రా వెంటకలక్ష్మి
16. కొండవీటి సత్యనారాయణ (ప్రధాన అర్చకుడు)

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam