DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ఉగాది నాటికి ఇళ్ళ పట్టాలు ప్రభుత్వ ధ్యేయం – ప్రత్యేక అధికారి

(DNS రిపోర్ట్ : SV ఆచార్యులు, స్టాఫ్ రిపోర్టర్, శ్రీకాకుళం ). .

శ్రీకాకుళం, ఫిబ్రవరి 29, 2020 (డిఎన్‌ఎస్‌) : రాష్ట్రంలో ఉగాది నాటికి అర్హులైన ప్రతి ఒక్కరికి ఇళ్ళ పట్టాలను

అందించాలనేది ప్రభుత్వ ధ్యేయమని ముఖ్య మంత్రి కార్యాలయ అదనపు కార్యదర్శి మరియు ఉత్తరాంధ్ర జిల్లాల ఇళ్ళ పట్టాల కార్యక్రమం ప్రత్యేక అధికారి కె.ధనంజయ రెడ్డి

అన్నారు. శని వారం జిల్లాలో ఇళ్ళ పట్టాల పంపిణీ కార్యక్రమం ఏర్పాట్లను పరిశీలించుటకు విచ్చేసిన ధనంజయ రెడ్డి కోటబొమ్మాళి, టెక్కలి, పలాస, శ్రీకాకుళం మండలాల్లో

లే అవుట్లను పరిశీలించిన అనంతరం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సంబంధిత అధికారులతో సమీక్షించారు. అనంతరం మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ ప్రభుత్వం

ప్రతిష్టాత్మకంగా ఇళ్ళ పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని చేపడుతుందన్నారు. మార్చి 10à°µ తేదీ నాటికి లే అవుట్లు పూర్తి చేయాలని అన్నారు. శ్రీకాకుళం జిల్లాలో  à°²à±‡ అవుట్

పనులు సంతృప్తికరంగా ఉన్నాయని పేర్కొన్నారు. శరవేగంతో పనులు చేస్తున్నారని అన్నారు. లబ్ధిదారులకు ముందుగానే స్థలాలు చూపించి, స్థలాలను జియో టాగింగ్

చేస్తున్నట్లు చెప్పారు. మహిళల పేరుతో రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేయడం జరుగుతుందని తెలిపారు. దేశ చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా మొట్టమొదటి సారిగా ఇంతటి

పకడ్బందీ కార్యక్రమం రాష్ట్ర ప్రభుత్వం చేపడుతుందని అన్నారు. ఇళ్ళ స్ధలం వద్ద లబ్దిదారుని ఫోటో తీయడం జరుగుతుందని పేర్కొన్నారు. ఐదు సంవత్సరాల తరువాత

విక్రయించే అవకాశం కూడా కల్పించడం జరుగుతుందని ధనంజయ రెడ్డి చెప్పారు. జిల్లాలో 53,660 మంది లబ్దిదారులు ఉన్నట్లు గుర్తించడం జరగిందని పేర్కొన్నారు. భూ సేకరణ

దాదాపుగా పూర్తి అయిందని చెప్పారు. బలవంతంగా ఎవరి భూములు తీసుకోవడం జరగదని చెప్పారు. పేదలు జీవనాధారానికి ప్రభుత్వ భూములను ఆక్రమించి ఉన్నప్పటికి మానవతా

ధృక్పథంతో పరిశీలించాలని సూచించినట్లు చెప్పారు. ఇళ్ళ స్ధలాల జాబితాలో అర్హులైన ఏ ఒక్కరూ తప్పిపోరాదని, అనర్హులకు జాబితాలో ఎట్టిపరిస్థితుల్లోనూ చోటు

ఉండరాదని ఆయన స్పష్టం చేసారు. ఇళ్ళ పట్టాలకు భూ సేకరణ కార్యక్రమంలోనూ బలవంతంలేదని అన్నారు. భూమి ఇచ్చేవాడు సంతృప్తికరంగా ఇవ్వాలని, ఇళ్ళ స్ధలాలు పొందేవారు

సంతృప్తికరంగా ఉండాలని పేర్కొన్నారు. పూర్తి పారదర్శకంగా కార్యక్రమం జరుగుతుందని అన్నారు. రాగోలులో భూములు విక్రయించినవారితో మాట్లాడామని వారు ఆనందంగా

వ్యక్తం చేసారని చెప్పారు. భూములు తీసుకున్న వెంటనే సంబంధిత మొత్తం బ్యాంకు ఖాతాల్లో జమ చేసారని సంతోషం వ్యక్తం చేసారని తెలిపారు. 
    à°ˆ కార్యక్రమంలో జిల్లా

కలెక్టర్ జె నివాస్, జాయింట్ కలెక్టర్ డా. కె శ్రీనివాసులు, ఐటిడిఏ పిఓ సి.ఎం.సాయికాంత్ వర్మ, సహాయ కలెక్టర్ భార్గవ తేజ, జాయింట్ కలెక్టర్-2 ఆర్.గున్నయ్య, జిల్లా

రెవెన్యూ అధికారి బలివాడ దయానిధి,  à°†à°°à±à°¡à±€à°µà±‹à°²à± à°Žà°‚.వి.రమణ, టివిఎస్జి కుమార్, ఐ కిషోర్, గృహ నిర్మాణ సంస్థ పిడి à°Ÿà°¿.వేణుగోపాల్, జిల్లా నీటి యాజమాన్య సంస్థ పిడి

హెచ్.కూర్మారావు, ఎస్డీసీలు, తహశీల్దార్, గృహ నిర్మాణ సంస్థ ఇంజినీర్లు, జలవనరుల ఇంజినీర్లు తదితరులు పాల్గొన్నారు.

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam