DNS Media | Latest News, Breaking News And Update In Telugu

నత్వాని రాజ్య సభ సీటుకోసమేనా అంబానీ జగన్ ను కలిసింది?

*పరిమళ నత్వాని కోసం కదిలి వచ్చిన రిలయన్స్ దిగ్గజం* 

*(DNS రిపోర్ట్ : సాయిరాం CVS , బ్యూరో, విశాఖపట్నం). . .*

విశాఖపట్నం, ఫిబ్రవరి 29, 2020 (డిఎన్‌ఎస్‌) : కేవలం à°’à°• రాజ్య సభ

సీటు కోసం రిలయన్స్ అధిపతి ముకేశ్ అంబానీ ఎన్నో మెట్లు దిగి ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ని కలిసారా అంటే అవుననే అంటున్నాయి సన్నిహిత

వర్గాలు. శనివారం వైఎస్ జగన్ ను స్వయంగా ముకేశ్ అంబానీ కలిసింది కేవలం తన అత్యంత సన్నిహితుడైన ఎంపీ పరిమళ్ నత్వాని కి మరోసారి రాజ్యసభ సీటు ఇప్పించేందుకు అన్నది

మాత్రం స్పష్టంగా తెలుస్తోంది. రెండున్నర గంటల సమయం ఇద్దరు వివిధ అంశాలపై చర్చలు జరిగినట్టు ప్రకటించినా, ఈ భేటీకి ప్రధాన కారణం మాత్రం నత్వాని సీటే అన్నది

కీలకం. ప్రస్తుతం రాజ్యసభ సభ్యునిగా ఉన్న నత్వాని రిలయన్స్ వ్యవస్థాపకుడు ధీరుభాయి అంబానీ హయాంలోనే రిలయన్స్ సంస్థలో చేరారు. ప్రస్తుతం అత్యంత కీలక స్థానం లో

కొనసాగుతున్నారు. ముకేశ్ అంబానీ తర్వాత రిలయన్స్ లో రెండవ స్థానం ఆయనదే కావడం గమనార్హం. సాధారణం పారిశ్రామిక దిగ్గజం అప్పోయింట్మెంట్ కోసం ఎందరో

ముఖ్యమంత్రులు సైతం ఎదురు చూస్తున్నారంటే అతిశయోక్తి కాదు. ప్రస్తుత పరిస్థితుల్లో ఆర్ధికంగా వెనుకబడి ఉన్న ఆంధ్ర ప్రదేశ్ లో అధిక పెట్టుబడులు పెట్టి

ఆర్ధికంగా ప్రోత్సాహాన్ని అందించే ఎరా చూపి, తన సన్నిహితుని రాజ్యసభ సీటు తీసుకునే ప్రయత్నం లో భాగమే ఏకంగా ముకేశ్ అంబానీ ఏ ఎన్నో మెట్లు దిగిరావడం అందరిని

ఆశ్చర్యపరిచింది. కేవలం ఆంధ్ర లో పెట్టుబడులు పెట్టేందుకు చర్చించడానికే అయితే అంబానీయే రానవసరం లేదు. అతని సంస్థల్లోని కీలక అధికారులు వచ్చి రాష్ట్ర

ప్రభుత్వంతో చర్చలు జరిపి అవకాశం ఉంది.

ముకేశ్ అంబానీ వెంట అతని కుమారుడు అనంత్ అంబానీ, పరిమళ్ నత్వాని కూడా ఉన్నారు. వీరికి విమానాశ్రయంలో వైఎస్సార్

కాంగ్రెస్ పార్టీ ఎంపీ విజయ్ సాయి రెడ్డి స్వాగతం పలికారు. 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam