DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ఇళ్ల స్థలాలకు భూ సేకరణ వేగవంతం చేయండి: నిశాంత కుమార్.

(DNS రిపోర్ట్ : పి. రాజా, Spl కరస్పాండెంట్ అమరావతి)

అమరావతి, మార్చి 02, 2020 (డిఎన్‌ఎస్‌) : పేద ప్రజలకు ఇల్లు స్థలాలు ఇచ్చేందుకు ప్రభుత్వ ఆదేశాల మేరకు భూ సేకరణ పనులు

వెంటనే పూర్తి చేయాలని రాజమహేంద్రవరం డివిజన్ ఇల్లు స్థలాల సేకరణ ప్రత్యేక అధికారి మరియు రంపచోడవరం ఐ.టి.డి.ఎ.ప్రాజెక్ట్ అధికారి నిశాంత కుమార్ అన్నారు. సోమవారం

తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం లోని  à°¶à±à°°à±€ వేంకటేశ్వర ఆనం కళాకేంద్రం లో రెవెన్యూశాఖ అధికారులు సిబ్బందితో సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడుతూ ప్రభుత్వం

ఇల్లు లేని నీరు పేద ప్రజలకు ఇల్లు స్థలాలు ఇచ్చేందుకు తీసుకున్న నిర్ణయం ప్రకారం రెవెన్యూ సిబ్బంది అంతా ఆయా పరిధిలో కావలసిన భూ సేకరణ సత్వరమే పూర్తి చేయాలని

అన్నారు.మనమంతా పేద ప్రజలకు సేవ చేస్తున్నాము ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు లేకుండా అతి జాగ్రత్తగా చర్యలు తీసుకోవాలని అన్నారు.ప్రభుత్వ భూములు లేదా ఇతర భూములు

సేకరణలో తగు జాగ్రత్తలు తీ సుకోవాలి అన్నారు.బాధ్యత ఆంత మీపై ఉందని దానికి తగినట్లుగా పని చేయాలని అన్నారు.ఈ సందర్భంగా రాజమహేంద్రవరం సబ్-కలెక్టర్ డాక్టర్

ఆర్.మహేష్ కుమార్ మాట్లాడుతూ మార్చి 10 వ తేదీ లోగా ఇల్లు స్థలాలకు సంబంధించి అవసరమైన భూ సేకరణ వేగవంతం చేయాలని అన్నారు.భూ సేకరణలో ఏవైన ఇబ్బందులు ఉన్న యెడల మా

దృష్టికి తీసుకురావలని తెలిపారు.గ్రామాలలో వి.ఆర్.ఓ/వి.ఆర్.ఏ. లను ఉపయోగించుకొని భూ సేకరణ లో నిమగ్నమై ఉండాలని అన్నారు.కార్యక్రమంలో డివిజన్

తహశీల్దార్లు,ఆర్.ఐ.లు,వి.ఆర్.ఓ.లు,వి.ఏ.ఓ.లు పాల్గొన్నారు.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam