DNS Media | Latest News, Breaking News And Update In Telugu

మిషన్‌ బిల్డ్‌ ఏపీపై సీఎం వైఎస్ జగన్ ఉన్నత స్థాయి సమీక్ష

ప్రభుత్వ భూముల వినియోగం - చేపట్టాల్సిన ప్రాజెక్టులపై చర్చ 

(DNS రిపోర్ట్ : పి. రాజా, Spl కరస్పాండెంట్ అమరావతి)

అమరావతి, మార్చి 02, 2020 (డిఎన్‌ఎస్‌) : మిషన్‌ బిల్డ్‌

ఏపీపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సోమవారం సమీక్ష నిర్వహించారు. బిల్డ్‌ ఏపీపై రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సోమవారం ఉన్నత స్థాయి

సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. à°ˆ భేటీలో నేషనల్‌ బిల్డింగ్‌ కన్‌స్ట్రక్షన్‌ కార్పొరేషన్‌ (ఎన్‌బీసీసీ) లిమిటెడ్‌ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ పీకే

గుప్తా సహా పలువురు మంత్రులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

రాష్ట్రంలోప్రభుత్వ భూములు గరిష్ట వినియోగం, అందులో చేపట్టాల్సిన పలు ప్రాజెక్టులపై

ఎన్‌బీసీసీ ప్రతిపాదనలు చేసింది. à°ˆ సమావేశం అనంతరం ఎన్‌బీసీసీ సీఎండీ పి.కె గుప్తాను సీఎం వైఎస్‌ జగన్‌ సత్కరించారు. ప్రభుత్వ భవనాల నిర్మాణానికి ‘బిల్డ్‌ ఏపీ’

పేరుతో కొత్త మిషన్‌ను ప్రభుత్వం ప్రారంభించిన విషయం తెలిసిందే.

à°ˆ మేరకు ఎన్‌బీసీసీ సంస్థతో కలిసి ‘బిల్డ్‌ ఏపీ’ కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపట్టనుంది. à°ˆ

మిషన్‌లో భాగంగా ప్రభుత్వ భూములు గుర్తించి, భవన సముదాయాలు నిర్మించే యోచనలో సర్కార్‌ ఉంది. మిగతా భూముల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలని నిర్ణయం తీసుకుంది.

అంతేకాకుండా మార్కెట్‌ ధరకు ప్రైవేట్‌ వ్యక్తులు, సంస్థలకు విక్రయించాలని నిర్ణయించింది. ఇందుకోసం ప్రభుత్వ భూములు, ఆక్రమణలు, వివాదాల్లో ఉన్న భూముల వివరాలను

సేకరించనుంది.

à°ˆ పథకంలో భాగంగా ప్రభుత్వ భూముల వివరాలు ఇవ్వాలని జాయింట్‌ కలెక్టర్లను ప్రభుత్వం ఇప్పటికే ఆదేశించింది. బిల్డ్‌ ఏపీ మిషన్‌ డైరక్టర్‌à°—à°¾

ఐఏఎస్ అధికారి ప్రవీణ్‌కుమార్‌ను ప్రభుత్వం నియమించింది. à°ˆ మిషన్‌లో భాగంగా ప్రభుత్వ భూములను గుర్తించి, భవన సముదాయాలు నిర్మించే తలంపులో రాష్ట్ర ప్రభుత్వం

ఉంది.

మిగతా భూముల్లో మౌలిక వసతులను కల్పించాలని నిర్ణయం తీసుకుంది. అంతేకాదు, వీటిని మార్కెట్‌ ధరకు ప్రైవేట్‌ వ్యక్తులు, సంస్థలకు విక్రయించాలని

ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం ప్రభుత్వ భూములు, ఆక్రమణలు, వివాదాల్లో ఉన్న భూముల వివరాలను సేకరించనున్నారు. ఈ పథకంలో భాగంగా ప్రభుత్వ భూముల వివరాలు

అందజేయాలని జాయింట్‌ కలెక్టర్లను ప్రభుత్వం ఆదేశించింది.

ఇక, విజయవాడలో బిల్డ్ ఏపీ మిషన్ తొలి ప్రాజెక్ట్ చేపట్టనున్నారు. బిల్డ్ ఏపీ మిషన్ అమల్లో భాగంగా

నిధుల సమీకరణ కోసం రెండెకరాల భూమిని విక్రయించేందుకు సన్నాహాలు చేస్తున్నట్టు సమాచారం. నిరుపయోగంగా ఉన్న రెండెకరాల భూమిని విక్రయించే దిశగా ప్రభుత్వం

చర్యలు చేపట్టింది. స్టేట్ గెస్ట్ హౌస్ ప్రాంగణంలోని ఖాళీ స్థలాన్ని బూత్ బంగ్లాను తలపిస్తోన్న భవనాలను విక్రయించే అవకాశం ఉందని అంటున్నారు. అధునాతన భవనాల

కోసం కమర్షియల్ కాంప్లెక్స్ నిర్మాణానికి అది అనువైన ప్రదేశమని అధికారులు అంటున్నారు. దీని ద్వారా రూ. 200 కోట్లు ఆదాయం సమకూరుతుందని అంచనా

వేస్తున్నారు.

సమావేశం అనంతరం ఎన్‌బీసీసీ సీఎండీ పి.కె గుప్తాను సీఎం వైఎస్‌ జగన్‌ సమ్మానించారు. 
 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam