DNS Media | Latest News, Breaking News And Update In Telugu

4 నుంచి ఏపీ లో ఇంటర్‌ పరీక్షలు - ఏర్పాట్లు పూర్తి. . .

ఇంటర్‌ పరీక్షలకు 10,65,156 మంది విద్యార్థులు సిద్ధం

మార్చ్ 4 నుంచి 23 వరకూ పరీక్షలు, à°®à±Šà°¤à±à°¤à°‚ 411 పరీక్ష కేంద్రాలు :

ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు

(DNS రిపోర్ట్ : పి. రాజా, Spl కరస్పాండెంట్ అమరావతి): . . .

అమరావతి, మార్చి 03, 2020 (డిఎన్‌ఎస్‌) : బుధవారం నుంచి ప్రారంభం కానున్న ఇంటర్‌ పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి

చేసినట్టు ఆంధ్ర ప్రదేశ్ ఇంటర్మీడియెట్‌ బోర్డు ప్రకటించింది. బుధవారం నుంచి మొదటి సంవత్సరం పరీక్షలు,  à°—ురువారం నుంచి ద్వితీయ సంవత్సరం పరీక్షలు ప్రారంభం

అవుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పరీక్ష కేంద్రాల్లోనూ à°…న్ని ఏర్పాట్లు పూర్తి చేసిన ఇంటర్మీడియెట్‌ బోర్డు తెలియచేసింది. హాల్‌టికెట్లను

విద్యార్థులే నేరుగా డౌన్‌లోడ్‌ చేసుకొనే అవకాశం కల్పించింది. కాలేజీ ప్రిన్సిపాళ్ల సంతకం అవసరం లేకుండా పరీక్ష కేంద్రాల్లోకి అనుమతి ఇచ్చింది. ఎటువంటి

అవకతవకలకు ఆస్కారం లేకుండా పటిష్టమైన చర్యలు తీసుకుంటోంది. 

విద్యార్థులు ఎలాంటి ఒత్తిడికీ గురికాకుండా ప్రశాంత వాతావరణంలో పరీక్షలు రాసేందుకు

ఇంటర్మీడియెట్‌ బోర్డు అన్ని ఏర్పాట్లు చేసింది. కాపీయింగ్‌కు, అవాంఛనీయ ఘటనలకు ఆస్కారం లేకుండా పటిష్టమైన చర్యలు చేపట్టింది. 

మార్చ్ 4 నుంచి 23 వరకూ

పరీక్షలు :

మార్చ్ 4 నుంచి మొదలవుతున్న ఈ పరీక్షలు మార్చి 23వ తేదీ వరకు కొనసాగనున్నాయి. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు నిర్వహిస్తారు. మొత్తం 411 పరీక్ష

కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఇంటర్‌ పరీక్షలకు 10,65,156 మంది విద్యార్థులు హాజరు కానున్నారు. వీరిలో జనరల్‌ విద్యార్థులు 9,96,023 మంది, వొకేషనల్‌ విద్యార్థులు 69,133 మంది ఉన్నారు.

/>  

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam